Month: February 2019

‘NADAKA’ POEM

Posted on

‘నడక’

—– వారాల ఆనంద్

నేనట్లా అలసటను వెంటేసుకొని

అడుగు తీసి అడుగేస్తూ

నడుస్తూనే వున్నా  

కాలం నన్ను ముందుకు తోసి

వెనకకు వెళ్తూనే వుంది

నడక దేముంది

శరీర కదలిక

గులక రాళ్లూ ఇసుక తిన్నెలూ

చిక్కటి అడవీ కటిక చీకటీ

అనుభవాలు పాద ముద్రల్లో

భద్రమవుతున్నాయి

యధాలాపంగానో

కావాలనో నన్ను అడగకు

ప్రయాణం ఎక్కడిదాకా అని

ఏమని చెప్పను ‘గమ్యం’

నాకు తెలిస్తే కదా

నడకేమో

కనిపించే వెతుకులాట

మనసెమో

వినిపించని పలవరరింత

నడక సాగుతూనే వున్నది

మనసు తెరుకునేవున్నది

ఇక

తెలియన్ది తెలుసుకోవడమే

తెలిసింది పంచుకోవడమే

================== 

‘YAVANIKA’ film club

Posted on

‘యవనిక’ ఫిలిం క్లబ్ 
ప్రతి బుధవారం

=============
ఆకట్టుకునే ‘బదాయీ హో’
==========
మధ్య తరగతి కుటుంబంలో జరిగిన ఒక సంఘటన ఎంత సంఘర్షణకు దారితీస్తుందో ఆ కుటుంబాన్ని ఎంతలా అతలాకుతలం చేస్తుందో ‘బదాయీ హో సినిమా చూపిస్తుంది. ఇద్దరు కొడుకులున్న ఒక మధ్య వయస్సు మహిళ గర్భవతి కావడంతో ఆ కుటుంబంలోనూ చుట్టూ వున్న సమాజం ఎట్లా స్పందిస్తున్నది ‘బదాయీ హో ‘ ప్రధాన ఇతి వృత్తం. 
పెళ్లి పిల్లలూ అయింతర్వాత కూడా మహిళ లో స్త్రేత్వం సజీవంగా ఉంటుందని, ఆమెకూ కోరికలు ఉంటాయని, భార్యగా ఆమె భర్త తో గడిపే ఆలోచన హక్కూ ఆమె స్వంతమని మరిచిపోయిన ఈ సమాజం ఆమె గర్భవతి కావడాన్ని జీర్నించుకోలేదు. గుసగుసలు పోతుంది. మరీ చిత్రంగా వుండే మధ్యతరగతి మనస్తత్వాలు ఆ వయసులో గర్భవతి కావడాన్ని ఆశ్చర్యంగానూ వింతగానూ తీసు కొంటాయి. చెవులు కొరుక్కుంటాయి. ఇక ఇంట్లో అత్త, ఇద్దరు కొడుకుల ప్రతిస్పందన కూడా ప్రతికూలంగానే వుంటుంది. ఇలాంటి సున్నితమయిన అంశాన్ని పగడ్బందీ కథనంతో సున్నిత మయిన హాస్యాన్ని జోడించి దర్శకుడు ప్రతిభావంతంగా తెరమీద ఆవిష్కరించాడు. 
కథ విషయానికి వస్తే జీతేందర్ కౌశిక్, ప్రియంవదా కౌశిక్ లు మధ్యతరగతి కి చెందిన మధ్య వయసు జంట. వారికి ఇద్దరు కొడుకులు పెద్దవాడు నకుల్ పెల్ల్లీడు కొచ్చిన ఇరవై ఏళ్ళు దాటినా వాడు, రెండోవాడు స్కూలు విద్యార్థి. వారితో పాటు జితేందర్ తల్లి కూడా డిల్లీ లోని లోని లోది కాలనీ లో నివసిస్తుంటారు. ఇంతలో ప్రియం గర్భవతి అయిందని తెలుసుకొని ఇంట్లోకి ‘నయా మహామాన్’ రానున్నాడని తల్లికి మొహమాటంతో తడబడుతూ చెబుతాడు జీతేందర్. ఇక అప్పటినుండి మొదలవుతుంది ఇంట్లో సంఘర్షణ. ఎవరికీ అది రుచించదు, ఎవరూ అంగీకరించడానికి సిద్దంగా వుండరు. ఇంట్లోనే కాకుండా చుట్టుపక్క ఇండ్లల్లో కూడా అది చర్చనీయాంశం అవుతుంది. జీతేందర్ అబార్షన్ చేపిద్దమా అని ప్రియంవదలు అడుగుతాడు, లేదు నేను బిడ్డను కంటా నంటుంది. ఆమె మిత్రులు కొందరు ప్రియం ను అభినందిస్తారు. ఇక జీతేందర్ తల్లి కూడా తొలుత వ్యతిరేకంగానే స్పందిస్తుంది. కానే జీతేందర్ అక్కలు ప్రియంవద గర్భం విషయంలో తీవ్రమయిన స్వరం తో మాట్లాడడంతో తల్లి తన కోడలి పక్షం వహిస్తుంది. కాని వాళ్ళ పెద్దకొడుకు నకుల్ చాలా గందరగోళం లో పడిపోతాడు. వ్యతిరేకతను ఏర్పరుచుకుంటాడు. అప్పటికే నకుల్ రెనీ తో ప్రేమలో పడతాడు. ఇద్దరిమధ్యా వున్న ఆర్ధిక అంతరాలతో పాటు ఇప్పుడీ తల్లి గర్భం కూడా వారి పెళ్ళికి అడ్డుగోడ అవుతుంది. రెనీ తల్లి నకుల్ తో వ్యంగంగా మాట్లాడ్డమే కాకుండా గేలి చేస్తుంది. నకుల్ తీవ్రంగా ఎదురు మాట్లాడ్డం తో రెనీ తో బెడిసికొడుతుంది. ఇద్దరి మధ్యా బ్రేక్ అప్ అవుతుంది. ఇదంతా తల్లి వల్లే అని నుకుల్ కోపాన్ని పెంచుకుంటాడు. ఇక రెండవ వాడు గుల్లార్ తన స్కూల్లో తోటి విద్యార్థుల వెకిలి మాటలకు తీవ్రంగా స్పందిస్తాడు. ఒక విద్యార్థి గుల్లార్ పై చేయి చేసుకుంటాడు. ఇదంతా ఇంటికి వచ్చినతర్వాత అన్నతో తో చెబుతాడు గుల్లర్. మర్నాడు నకుల్ స్కూలుకు వెళ్తాడు గుల్లార్ తనను కొట్టిన వాడి చెంప పగుల గొడతాడు . నకుల్ మిత్రులు కూడా హేళన చేస్తే వారికి సరయిన బదిలిస్తాడు. క్రమంగా వాళ్ళు పరిస్థితిని అర్థం చేసుకొని సహజమయిన వాస్తవాన్ని గ్రహిస్తారు. నకుల్ కొడుకుగా తన బాధ్యతను తెలుసుకుంటాడు. నకుల్ రెనీ మధ్య ఎదో గొడవ జరిగిందని అర్థం చేసుకున్న ప్రియంవద వెళ్లి రెనీ తల్లికి క్షమాపణ చెప్పమంతుంది. అయిష్టంగానే అంగీకరించిన నకుల్ వెళ్లి ఆమెకు సారీ చెబుతాడు. తల్లి చెప్పగానే రెనీ నకుల్ కోసం బయల్దేరుతుంది. ఇంతలో ప్రసవ సమయం వచ్చేస్తుంది. లేటు వయసు గర్భం కనుక కొంత కష్టం కావచ్చు ననుకున్నప్పటికీ ప్రసవం సాఫీగా జరుగుతుంది. ఆడపిల్ల పుడుతుంది. అంతా సంతోష పడతారు. సంవత్సరం తర్వాత నకుల్ కు రెనీ తో నిశ్చితార్థం అవుతుంది.
‘బదాయీ హో´ సినిమా ఆద్యంతం హాస్యం తో సాగి ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. కథ కథ నాలల్లో ఎంత బలం వుందో దానికి సమానంగా ప్రధాన పాత్రధారుల నటన సినిమాకు గొప్ప శక్తిని ఇచ్చింది. ప్రియంవద గా నీనా గుప్తా ఎంతో హుందాగానూ పరిపక్వతతోనూ నటించింది. జీతేందర్ గా గజ రాజ్ రావు నటన సినిమాకు హైలైట్. హాస్యాన్ని పండించడంలో కానీ తన బాడీ లాంగ్వేజ్ ద్వారాగానీ గజ రాజ్ రావు మొత్తం సినిమాను నడిపిస్తాడు. వీరికి తోడు నకుల్ గా ఆయుష్మాన్ ఖురానా, అత్తగా సురేఖ సిక్రీ కూడా గొప్ప నటను అందించింది. 
అధిక శాతం రొడ్డ కొట్టుడు అంశాలతో సాగే హిందీ సినిమా రంగంలో ‘బదాయీ హో´ లాంటి సినిమాలు గొప్ప ఊరట. అందుకు దర్శకుడు అమిత్ రవీంద్రనాథ్ శర్మను అభినందించాలి. 
‘బదాయీ హో´ చూడాల్సిన సినిమా. ఆన్ లైన్ లో అనుబాటులో వుంది.
– వారాల ఆనంద్

రాజకీయ ప్రచార ‘బయోపిక్ ‘లు

Posted on

(Namasthe Telangana Tue,February 5, 2019)

నిజానికి గత కొన్నేండ్లుగా దేశంలో రాజకీయపార్టీల ఎన్నికల ప్రచార సరళి మారిపోయింది. కేవలం సభలు, ప్రకటనల లాంటి సనాతన విధానాలకు భిన్నంగా పెరిగిన సాంకేతిక అభివృద్ధిని ఉపయోగించడం మొదలైంది. ఐదేండ్ల కిందట ఎన్నికలప్పుడు సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సప్‌లను విస్తృతంగా వినియోగించి యువతీయువకులను ప్రభావితం చేసిన రాజకీయపార్టీలు ఈసారి మరింత విస్తృతమైన ప్రసార వ్యవస్థ అయిన సినిమాను తమ ప్రచారానికి వినియోగిస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తున్నది.

విలువలను వివేకాన్ని, వినోదాన్ని అందించే కళాత్మక దృశ్య మాధ్యమమైన సినిమా వర్తమాన భారతంలో శుష్క రాజ కీయ ప్రచార మాధ్యమంగా తెరపైకి వస్తున్నది. దేశానికి అత్యంత ముఖ్యమైన ఎన్నికల ఏడాదిలో ఈ ప్రయత్నాలు విరివిగా జరుగుతున్నాయి. బాలీవుడ్‌గా పిలువబడే హిందీ సినిమా రం గంలోనే కాకుండా వివిద భారతీయ భాషా సినిమాల్లో కూడా ఈ ప్రచార ధోరణి కనిపిస్తున్నది. ఎన్నికల కాలంలో సినిమా రాజకీయపార్టీల ప్రచార వేదికగా పరిణామం చెందుతున్నది. కళగా సినిమాల్లో రాజకీయ దృక్పథా లు ధోరణులూ కనిపించవచ్చు, అది ఆక్షేపణీయం కాదు. స్వాతంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో రాజ్‌కపూర్, మనోజ్‌కుమార్ లాంటి సుప్రసిద్ధ నటు లు, దర్శకులు నవ్య స్వతంత్ర భారత స్థితిని వివరిస్తూ దేశం గురించి ఆశా వహమైన కళాత్మక సినిమాలుగా అవి రూపొందాయి. ప్రజలూ వాటిని విశేషంగా ఆదరించారు. కానీ ఆ ధోరణిలో వచ్చిన సినిమాలు అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రచార సినిమాలుగా రాలేదు. అది గమనించాల్సిన అంశం.

కానీ, ఈ రోజుల్లో వస్తున్న సినిమాలు పార్టీల ప్రచార కార్యక్రమాలకు వాహకాలుగా మారడం అభిలషనీయ పరిణామం కాదు. గత కొన్ని నెల లుగా విడుదలవుతున్న భారతీయ సినిమాల్లో దేశంలోని ప్రధాన రాజకీ య పార్టీ పెంచి పోషిస్తున్న భావజాలవ్యాప్తికి ఊతమిచ్చేలా ప్రచార బాధ్య తలను మోస్తున్నాయి. అంతేకాకుండా తద్వారా రాబోయే ఎన్నికల్లో ఓట్ల లబ్ధి పొందే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

నిజానికి గత కొన్నేండ్లుగా దేశంలో రాజకీయపార్టీల ఎన్నికల ప్రచార సరళి మారిపోయింది. కేవలం సభలు, ప్రకటనలలాంటి సనాతన విధానా లకు భిన్నంగా పెరిగిన సాంకేతిక అభివృద్ధిని ఉపయోగించడం మొదలైం ది. ఐదేండ్ల కిందట ఎన్నికలప్పుడు సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సప్‌లను విస్తృతంగా వినియోగించి యువతీయువకులను ప్రభావితం చేసిన రాజకీయపార్టీలు ఈసారి మరింత విస్తృతమైన ప్రసార వ్యవస్థ అయిన సినిమాను తమ ప్రచారానికి వినియోగిస్తున్న తీరు స్పష్టం గా కనిపిస్తున్నది. సామాజిక మాధ్యమాలు కేవలం పట్టణ, చదువుకున్న వారిపైనే ప్రభావం కలిగించగలిగింది. సినిమా అయితే గ్రామీణ నిరక్షరా స్యులను కూడా ప్రభావితం చేయగలదు. కాబట్టి పలు రాజకీయపార్టీలు ఈసారి సినిమాను వినియోగించుకుంటున్నాయి. కేవలం తమ ప్రచారాని కే పరిమితం చేయకుండా ఎదుటి పార్టీపై బురదచల్లడానికి సినిమాను ఉపయోగిస్తున్నాయి.

ఇప్పటికే నాలుగు పెద్ద సినిమాలు విడుదలయ్యా యి. ఉరి, మణికర్ణిక, ఆక్సిడెంటల్ ప్రైం మినిస్టర్, థాకరేలకు తోడు త్వరలో సల్మాన్‌ఖాన్ సినిమా అక్షయ్‌కుమార్ సినిమా కేసరి రానున్నాయి. వాటితోడు ప్రధాని మోదీ జీవితచరిత్ర ఆధారంగా ఉమంగ్ కుమార్ దర్శకత్వంలో వివేక్ ఓబ్‌రాయ్ ప్రధాన పాత్రధారిగా బయోపిక్ రానున్నది, దానికితోడు పరేష్ రావల్ కూడా తన రానున్న సినిమాలో మోదీ జీవితాన్ని చిత్రీకరిస్తున్నట్టు ప్రకటించాడు. 72 అవర్స్, మార్ టైర్ హూ నెవర్ డయిడ్, బటాలియన్ 609 లాంటి నిగూఢమైన సిని మాలు రానున్నాయి.

ఉరి సినిమా మన దేశరక్షణ దళాలు నిర్వహించిన సర్జికల్ ైస్ట్రెక్స్ ఆధా రం చేసుకొని నిర్మించబడింది. అత్యంత రహస్యంగా నిర్వహించబడిన ఆ సర్జికల్ దాడులను సినిమాలో సాంకేతికంగానూ, నటీనటుల నటన తది తరాల పరంగా చాలా మంచి నిర్మాణ విలువలతో రూపొందించారు. కానీ ఉరి రక్షణ దళాల గొప్పదనాన్ని చూపిస్తూనే పక్కదేశాన్ని ద్వేషించే ఒక భావజాలాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగానే ఉన్నది. అధికారంలో ఉన్న రాజకీ యపార్టీ భావజాలాన్ని ప్రచారంలోకి తెచ్చినట్టుగానే ఉండటాన్ని యాదృచ్ఛికమని అనుకోలేం. ఇక ఆక్సిడెంటల్ ప్రైం మినిస్టర్ సినిమాలో కాంగ్రెస్ తదితర రాజకీయపార్టీల నాయకులను ఎంతో తక్కువ స్థాయి లోనూ, బలహీనంగానూ చూపించడం గమనించవచ్చు. ఇక థాకరే సిని మా గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది అది సినిమాగా కంటే కేవలం థాకరే భావజాలాన్ని దృశ్యరూపంలో ఆవిష్కరించిన చిత్రం గా చెప్పుకోవచ్చు.

ఇవిలా ఉంటే ఇటీవలి కాలంలోనే అక్షయ్‌కుమార్ ప్రధాన పాత్రధారి గా రెండు సినిమాలు స్వచ్ఛ భారత్‌ను ఎంతగా ప్రచారం చేశాయో మనం గమనించవచ్చు. 2017లో విడుదలైన టాయిలెట్-ఏక్ ప్రేమ కథ సినిమా ఇంట్లో మరుగుదొడ్డి లేకపోవడం దాన్ని సాధించడానికి ఒక జంట పడ్డ పాట్లు ప్రధానాంశంగా ఈ సినిమా రూపొంది గొప్ప విజ =యాన్నే సాధించింది. దానికి ప్రధాని మోదీ ప్రసంశలు కూడా లభించాయి. అంతేకాదు అంతకుముందే 2016లో అక్షయ్‌కుమార్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రావడం గమనించాలి. ఇంకా పాడ్ మాన్ కూడా ఒక బయోగ్రఫికల్ సినిమాగా తీసినప్పటికీ అది కూడా స్వచ్ఛభారత్ ప్రచార చిత్రంగానే విమర్శకులు భావించారు. అవేకాకుండా తెలుగులో వచ్చిన ఎన్టీఆర్, త్వరలో రానున్న రాజశేఖర్‌రెడ్డి సినిమా మొదలైనవి కూడా రాజకీయపార్టీల ప్రచార లక్ష్యంతో నిర్మించిన చిత్రాలుగానే చెప్పుకోవాలి.

ఇట్లా మొత్తం మీద సినిమా గొప్ప ప్రసార మాధ్యమం స్థాయి నుంచి ప్రచార మాధ్యమం స్థాయికి దిగజారడం విచారకరం. అయినా ప్రజలు విజ్ఞులు కాబట్టి ప్రచార చిత్రాలు ఏ మేరకు విజయవంతమవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం.