Month: October 2023
MAMANG DAI by VARALA ANAND
Friends, click the link and listen my podcast video relayed on 27 Oct 2023 – Varala Anand
అరుణాచల్ ప్రదేశ్ సాహిత్యం – మమంగ్ దాయి
+++++++++ వారాల ఆనంద్
ఇవ్వాళ మన దేశం మొత్తం మీద గొప్ప కవిత్వమేకాదు మొత్తంగా గొప్ప సాహిత్యం ఈశాన్య రాష్ట్రాలనుంచే వస్తున్నది. అక్కడి ప్రజల సంఘర్షణ ఆ సాహిత్యంలో సజీవంగా వికసిస్తున్నది. 7 సిస్టర్స్ గా పిలువబడే ఈశాన్య రాష్ట్రాల్లో హిమాలయాల ఒడిలో నెలకొని ఉన్న అరుణాచల్ ప్రదేశ్ భారత దేశపు ఊయయించే సూర్యుడు. అక్కడి డాంగ్ గ్రామమే దేశం మొత్తం మీద తొలి సూర్యోదయాన్ని చూస్తుంది. ఆ రాష్ట్రానికే దేశమ్మోత్తం మీద అతి ధీర్ఘమయిన అంతర్జాతీయ సరిహద్దు వుంది. అక్కడి ప్రజలు ‘ఆది’, ‘ఆక’, ‘అప్తాని’ లాంటి 90 కంటే ఎక్కువ భాషలు మాట్లాడతారు ఆ రాష్ట్రంలో 26 ప్రధాన తెగలు మరియు వందల ఉప తెగలు ఉన్నాయి. కానీ ఈ బహుళత్వం మధ్య, అన్ని సంఘాలలో ఒక సాధారణ లక్షణం ఉంది, వారు గొప్ప కథకులు.
వారి స్వంత అధీకృత స్క్రిప్ట్ లేకుండా, వారు వారి జ్ఞాపకాలలో వారి కాలపు కథలను భద్రపరిచారు. మౌఖికంగా వారు ఆయా భాషల్ని వ్యాప్తి చేశారు. తరువాతి తరాలకు అందించారు. అక్కడి ప్రజలు కీర్తనలల్ని బాగా ప్రదర్శిస్తారు. తమ కుటుంబ సామాజిక మావేశాలలోకథల్ని కథలు చెప్పడాన్ని బాగా బాగా ఇష్టపడతారు.
అరుణాచల ప్రదేశ్ సాహిత్యం గురించి మాట్లాడేటప్పుడు కేవలం మౌఖికమే కాకుండా లిఖిత సాహిత్యాన్ని కూడా చర్చించాలి.
మౌఖిక సాహిత్యం ప్రధానంగా జానపద సాహిత్యం యొక్క అభివ్యక్తి. అందులో ప్రధానంగా పురాణాల కథలు, వాటిలోని సూక్తులు, కథనాలు. కథలు ప్రధాన అంశాలుగా వుంటాయి. వాటితో పాటు జంతువులు, విశ్వం మరియు మానవ నమ్మకాలు, ఆచారాల కథలు కూడా మనకు కనిపిస్తాయి. లిఖిత సాహిత్యంలో కవిత్వం, నాటకం, చిన్న కథలు ప్రధాన పాత్ర పోషిస్తాయి మౌఖిక సాహిత్యంతో సృజనాత్మకత ప్రధానమయింది. కాగా మౌఖిక లిఖిత సాహిత్యాల నడుమ విడదీయరాని మౌళిక సంబంధం ఉంది.
ఇరవయ్యవ శతాబ్దంలో అరుణాచల్ ప్రదేశ్కు లిఖిత సాహిత్యం మొదలయిందని చెప్పాలి. మారుతున్న సామాజిక ఆర్థ్క స్థితులు అంతేకాకుండా ఆధునిక విద్య అందుబాటులోకి రావడం వల్ల అక్కడి వాళ్ళల్లో సరికొత్త భావనాత్మకత తో పాటు నవ్య సృజనాత్మకత ఆరంభమైంది. ముఖ్యంగా ఆంగ్ల, విద్య విదేశీ సంస్కృతుల ప్రభావం వల్ల కళాత్మక సృజన పెరిగిందనే చెప్పాలి. 1947 తర్వాత తగాంగ్ టాకీ, లుమ్మర్ దాయి, YD థోంగ్చి, రించిన్ నోర్బు మొయిబా, సమురు లుంచాంగ్ మరియు కెన్సమ్ కెంగ్లాం వంటి రచయితల రచనలు వెలువడ్డాయి. అరుణాచలానికి చెందిన మొదటి తరం సాహిత్య ప్రముఖులు వీరే. లుమ్మర్ దాయ్ యొక్క తొలి నవల ఫారోర్ క్సీలే క్సీలే (1961) బహుశా ఒక అరుణాచలి రాసిన అరుణాచల్ ప్రదేశ్ యొక్క మొదటి నవలగా పరిగణించబడుతుంది. తమదయిన
స్క్రిప్ట్ లేకపోవడంతో, ఆ కాలంలోని రచయితలు తమ భావాలను వ్యక్తీకరించడంలో గణనీయమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ రోజుల్లో, పాఠశాలల్లో అస్సామీ బోధనా మాధ్యమం కావడం తో చాలామంది అస్సామీని తమ రచనా భాషగా ఎంచుకున్నారు. స్వీయ భాషాపరమైన అడ్డంకిని దాటి, ఈ మొదటి తరం రచయితలు, వారి బహుముఖ మరియు విశిష్టమైన కథలతో, అరుణాచల్ ప్రదేశ్లో సాహిత్యంలో ముఖ్యమైన భాగం పంచుకున్నారు. సరికొత్త పాదులు వేశారు.
అప్పటి వారి రచనలు సామాజిక వాస్తవికతకు ప్రతిబింబాలు. వారు తరచుగా తమ రచనలకు జానపద సాహిత్యాన్ని మూలంగా చూసేవారు. వారు వక్తృత్వం, పురాణం, జానపద నమ్మకం మరియు ఆచారాల నుండి ప్రత్యేకమైన ప్రేరణను పొందారు. ఇది వారి రచనలలో వ్యక్తీకరణలో స్పష్టంగా కనిపిస్తుంది. థోంగ్చి, సోనమ్లో, బ్రోక్పాతమ రచనల్లో సమాజంలోని సంప్రదాయాల్ని ఆచారాలను అన్వేషిస్తారు. మమంగ్ డై తన నవలలు పహరోర్ క్సీలే జిలే, మోన్ అరు మోన్, పృథివీర్ హన్హిలో ఆది జానపద జీవితానికి సంబంధించిన నైతికతను చాటుకున్నారు.
అరుణాచల్ ప్రదేశ్ లో పాఠశాలల్లో క్రమంగా ఇంగ్లీషు, హిందీ భాషలను ప్రవేశపెట్టారు. అస్సామీ స్థానంలో ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు పెరిగారు. ప్రధాన మాధ్యమంగా ఇంగ్లీషు, హిందీ భాషా భాషలు స్థానం పొందాయి. తత్ఫలితంగా అస్సామీలో వ్రాసే వారు పాఠకులతో డిస్కనెక్ట్గా భావించడం ప్రారంభించారు. అస్సామీ రాయడం తగ్గిపోయింది
తర్వాత చదువు పెరగడం తో ప్రజలు వారి చరిత్రను సంస్కృతిని గురించి మరింత ఉత్సుకతతో చ్ఫూపించడం ఆరంభమయింది. 1978లో అరుణాచల్ ప్రదేశ్ లో మత స్వేచ్ఛ చట్టం ఆమోదించబడింది. దేశీయ సంస్కృతి విశ్వాసాల పరిరక్షణ, ప్రచారం పట్ల ఆసక్తి పెరిగింది. కృషీ ఆరంభమైంది. ఫలితంగా రచనల్లో అక్కడి సమస్యల్ని రాయడం మొదలయింది. అక్కడి రచయితలలో తుంపక్ ఈటే, ఒసాంగ్ ఎరింగ్, బని డాగ్గెన్, ఎన్. ఎన్. ఒసిక్, ఎల్ ఖిమ్హర్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు.
అరుణాచల్లో ఇంగ్లీషు మరియు హిందీ భాషలను ప్రవేశపెట్టినప్పటి నుండి కొత్త తరం రచయితలు ఆవిర్భవించారు. జుమ్సీ సిరామ్ రాసిన ఏ-అలుక్ (1993) అన్న నవల ఈ రాష్ట్రానికి చెందిన ఒక స్వదేశీ రచయిత హిందీలో రాసిన మొదటి నవలగా వినుతికెక్కింది. యుమ్లామ్ తానా యొక్క ది మ్యాన్ అండ్ ది టైగర్ (1999) మరియు మమంగ్ దాయి యొక్క ‘ది లెజెండ్ ఆఫ్ పెన్సమ్ (2006)’ ఇంగ్లీష్ హిందీ సాహిత్య ప్రపంచంలో అరుణాచల రచయితల స్థానాన్నినిలబెట్టాయి. వీరి రచనలు రాష్ట్ర సరిహద్దులు దాటి అరుణాచలి రచనలను దేశవ్యాప్తంగా తీసుకెళ్లడంలో ఎంతగానో సహాయపడ్డాయి.
మమంగ్ దై ‘ది లెజెండ్స్ ఆఫ్ పెన్సామ్ అండ్ బ్లాక్ హిల్స్’ లో అరుణాచల్ ప్రదేశ్ యొక్క పూర్వ-చారిత్రక గతాన్ని తిరిగి సృష్టించింది.
ఇప్పుడు అక్కడి సమకాలీన సమాజం కూడా ప్రపంచీకరణ ప్రభావంతో కొట్టుమిట్టాడుతోంది, దాంతో సంస్కృతి, సంప్రదాయాలు వాటిలోని అన్ని అంశాలు నాటకీయ మార్పులకు గురయ్యాయి. ఒక రకమైన కొత్త సాంస్కృతిక వాతావరణం ఏర్పడింది. కవులూ రచయితలూ సామాజిక అసమానతల్ని ప్రశ్నించడం ప్రారంభించారు, పురాతన ఆచారాల్ని, సంప్రదాయాలను విడిచిపెట్టడం ప్రారంభించారు. ప్రపంచీకరణ ప్రభావం అరుణాచల్ ప్రదేశ్ యొక్క సాహిత్య సృజనల్లో మార్పును తెచ్చింది. అరుణాచల్ క్రమంగా మౌఖిక సాహిత్యం మరచిపోయే స్థితికి చేరుకోవడం ప్రారంభించింది. ఉదృతమవుతున్న ప్రపంచీకరణ ప్రభావానికీ అక్కడి సంప్రదాయానికి నడుమ వున్న ఘర్షణ సమకాలీన రచనలలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే గుర్తింపు సంక్షోభం identity crisis, నోస్టాల్జియా nostalgia సామాజిక సమస్యల యొక్క ఘర్షణ వారి రచనల ఇతివృత్తాలలో ప్రతిబింబిస్తుంది.
“ఈ వేసవి”లో మమంగ్ దై
‘విలపిస్తున్నాను
మా వేటలో మేము నాశనం చేసిన అందం
జీవితం కోసం మా వేటలో.
… సీతాకోక చిలుకలను క్షమించమని వేడుకుంటున్నాను’, అంటుంది
యుమ్లాం తమ గుర్తింపు సంక్షోభం సమస్యను ఈ విధంగా ప్రస్తావిస్తుంది:
‘ఈ భౌగోళిక పటం
మా భూములు,
అటవీ హక్కుల గురించి ఏమీ మాట్లాడలేదు..’ అంటారు
ఇటీవలి సంవత్సరాలలో అనేకమంది యువకులు, విద్యావంతులైన రచయితలు సాహిత్యరంగంలో తమ స్థానాన్ని పదిలం చేసుకున్నారు. వారు తమదయిన కొత్త శైలి,, కళా ప్రక్రియలతో ప్రయోగాలు చేస్తున్నారు. అది గత తరం రచయితలకు భిన్నమయిన ధోరణి. వారి రిఫ్రెష్ కథలు వారి ప్రత్యేకమైన స్వభావాలతో, వారు ప్రపంచ సాహిత్య రంగంలో తమను తాము నిలబెట్టుకుంటున్నారు.
తాయ్ టాగుంగ్ తన డ్రామా, లాపియాలో ఉద్దేశపూర్వకంగానే అరుణాచలి హిందీని ఉపయోగించాడు. ఇది అరుణాచల్ ప్రదేశ్లో మాట్లాడే హిందీపై భాషావేత్తల దృష్టిని తీసుకువచ్చింది. గుమ్లాట్ మైయో యొక్క త్రయం వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ కాలేజీ క్యాంపస్ నవల. డై యొక్క స్టుపిడ్ మన్మథుడిని చిక్ లైట్ అని వర్ణించవచ్చు.
ఇటీవలి కాలంలో ఇక్కడి సాహిత్యంలో వున్న కొన్ని ముఖ్యమైన పేర్లు Takop Zirdo, Tony Koyu మరియు Yabin Zirdo.
అరుణాచల్ ప్రదేశ్లో హిందీ సాహిత్య పురోగతికి గణనీయమైన కృషి చేసిన వారిలో తారో సింధిక్, జమునా బిని మరియు జోరామ్ యాలం వంటి అనేకమంది వున్నారు.
మునుపటి తరం నుండి వచ్చిన వారైనా, లేదా ఇటీవలి వారైనా, అరుణాచల్లో వెలువడే సృజనాత్మక రచనల్లో పౌరాణిక జానపద కథల యొక్క ప్రభావం, దాని కొనసాగింపు కనిపిస్తుంది. మమంగ్ దాయి యొక్క సంకలనం ది బామ్ ఆఫ్ టైమ్, రివర్ పోయమ్స్, తానాస్ మ్యాన్ అండ్ ది టైగర్ అండ్ విండ్ కూడా సింగ్స్ మరియు LW బాపు యొక్క ఖండూమాస్ కర్స్ సాంప్రదాయ సాహిత్యం మరియు సృజనాత్మకత యొక్క సమ్మేళనంగా చూడొచ్చు.
అరుణాచల్ ప్రదేశ్లో ఆధునిక సృజనాత్మక సాహిత్యం 20వ శతాబ్దం మధ్యలోనే మొదలయిందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కొంతమంది ప్రతిభావంతులయిన రచయితలతో ఇది వేయి రేకులుగా విచ్చుకుంటోంది.
… మమంగ్ దాయి…
గత 13 ఏళ్లుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టాటా లిటరేచర్ లైవ్ ఈనెల 25 నుంచి తన 14 వ సంచికను నిర్వహిస్తున్నది. అందులో ఈశాన్య రాస్త్రమయిన అరుంచల్ ప్రదేశ్ కు చెందిన గొప్ప కవి రచయిత్రి మామంగ్ దాయిని ప్రధానంగా ఈ యేటి ఆస్థాన కవిగా ఎంపిక చేసి గౌరవిస్తున్నారు. మామంగ్ దాయి ఎంపిక సమంజసమయిందే కాదు, అభినందనీయమయింది.
మమంగ్ దై కవి మరియు నవలా రచయిత. ఆమె ఈశాన్య భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్లోని ఇటానగర్లో నివసిస్తున్నారు. ఇప్పటికీ ఆమె ఒక కవితా సంకలనం, ‘నది కవితలు’వెలువరించారు. ఆమె తర్వాతి రచన, మిడ్సమ్మర్-సర్వైవల్ లిరిక్స్, ఆమె ఆది భాషలోనూ ఆంగ్లంలోనూ రాస్తుంది.తాను మొదట ఐ.ఏ.ఎస్.కు ఎంపికయి జర్నలిస్టు గానూ, రచయిత్రిగానూ వుండడానికీష్టపడి ఐ ఏ ఎస్ ను వదిలేసింది.
మామంగ్ దాయి ది టెలిగ్రాఫ్, హిందుస్థాన్ టైమ్స్ మరియు ది సెంటినెల్తో సహా వివిధ వార్తాపత్రికలకు కరస్పాండెంట్గా ఉన్నారు. టెలివిజన్ మరియు రేడియోలకు కూడా విరివిగా రాశారు. రెండు నవలలతో పాటు, యువ పాఠకుల కోసం ఆమె వచన కవితలు కథలు రాసింది. ఆమె నాన్-ఫిక్షన్ రచన, అరుణాచల్ ప్రదేశ్: ది హిడెన్ ల్యాండ్, 2003లో స్టేట్ వెరియర్ ఎల్విన్ అవార్డును అందుకుంది. ఆమె ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ లిటరరీ సొసైటీకి జనరల్ సెక్రటరీగా, నార్త్ ఈస్ట్ రైటర్స్ ఫోరమ్ సభ్యురాలు మామంగ్ డయి యొక్క కవితా ప్రపంచం నది, అడవి మరియు పర్వతాలలో ఒకటి, ఆమె తన మూలాల్ని తాని నివసించిన స్వస్థలాన్ని తన రచనల్లో ప్రతిబింబింపజేసి వాటిని సృజనాత్మకంగా సజీవం చేశారు. ఇక్కడ ప్రకృతి రహస్యమైనది, పురాణాలతో పచ్చగా ఉంటుంది, పవిత్రమైన జ్ఞాపకశక్తితో దట్టమైనది. ప్రతిచోటా మాయాజాలం ఉంది:
లిల్లీస్ “హృదయ స్పందనలో నావిగేట్ చేసే విధంగా . . . “చల్లని వెదురు,/ సూర్యకాంతిలో పునరుద్ధరించబడిన” నిశ్శబ్దంగా, పర్వతాల యొక్క “మాటలు లేని ఉత్సాహం”లో, కత్తి చేపలా పైకి దూసుకుపోతున్నాయి. “నదికి ఆత్మ ఉంది” అంటారామె.
ఆమె కవిత్వంచాలా సరళంగా వుంటుంది.
Mamang Dai
Friends, Celebrated poet Mamang Dai will be the Poet Laureate of the 14th edition of Tata Literature Live! The Mumbai LitFest. I have written a small article on Mamang Dai, published today in edit page of SAKSHI daily, thanks to the editor and his editorial team members
-anand varala
MAJROOH SULTANPURI podcast by Varala Anand
FRIENDS, pl click the link and listen my podcast ON MAJROOH SULTANPURI, ON TAL RADIO and give your opinion -Varala Anand
https://youtu.be/htcdYl5OvuI?si=5f4H6Azmvo0AtQdf
యుద్దం++++ వారాల ఆనంద్
యుద్దం
+++++++++ వారాల ఆనంద్
ఆ ఇద్దరు
ఇద్దరి చేతుల్లోనూ మారణాయుధాలు
ఆయుధం పేలనంతవరకు
ఇద్దరూ ఇద్దరుగానే వున్నారు
ఒక చేతిలోని ఆయుధం పేలగానే
మరో చేయి బదులిచ్చింది
తుపాకులు బాంబులు అనేమిటి
వినాశనానికి వేయి రూపాలు
ఇరువైపులా ఆహాకారాలు ఆర్తనాధాలు
ఏరులై పారిన కన్నీళ్లు
రక్తపు టేరులు శవాల కుప్పలు
విజయం నాదంటే నాదన్నారు
చేతులెత్తి విర్రవీగారు
కాళ్ళకింది భూమి
కదిలిపోయిన సోయి లేదు
దూరంగా ఆయుధాల వ్యాపారి
హర్శామోదాలతో చప్పట్లు కొడుతున్నాడు
మాటల బేహారి శాంతి ప్రవచనం చెబుతున్నాడు
సామాన్య జనమే
నేర్రెలు బారిన నేల కేసీ
సుధూర ఆకాశంకేసి చూస్తూ
ప్రార్థనలు చేస్తున్నారు
***********************
‘సిక్కిం’ విలాపం+++++ వారాల ఆనంద్
‘సిక్కిం’ విలాపం
+++++++ వారాల ఆనంద్
మబ్బుల్లో విస్ఫోటనం
మంచు పర్వతాల్లో భూకంపం
ఏదయినా కావొచ్చు
వేలాది వృక్షాల మొదళ్లు కదిలిపోతాయి
వందలాది ఇళ్ల పునాదులు కూలిపోతాయి
లెక్కలేనంతమంది గల్లంతవుతారు
ఎంతోమంది కూలిన ఇండ్ల సూర్లకు
విరిగిన చెట్ల కొమ్మలకు వేలాడుతారు
కూలిన ఇళ్ళల్లో
నీ ఇళ్ళో నా ఇళ్ళో ఉందేమోనని చూస్తున్నా
వేలాడుతున్న శవాల్లో మన ముఖాలేమయినా
కనిపిస్తాయేమోనని కంగారుగా వెతుకుతున్నా
నరికేయడానికీ కలుషితం చేయడానికీ
తవ్వేయడానికీ ముందూ వెనకా లేదు
చెట్లూ నీళ్లూ నేలా దేనిమీదా దయలేదు
దేని పట్లా ఫికర్ లేదు
మొన్న ఉత్తరాంచల్ ఉలిక్కిపడింది
నిన్న సిక్కిం విలపించింది
రేపు
అస్సామ్ ఆందోళన పడొచ్చు
గుజరాత్ గుండెలు ఆవిసిపోవచ్చు
కేరళ కరిగిపోవచ్చు
కాశ్మీరు కంగారు పడొచ్చు
లేదా నీ వూరో నా వూరో బావురుమనొచ్చు
కాళ్ళకింది నేల కదిలిపోవచ్చు
కలలన్నీ కరిగిపోవచ్చు
ప్రకృతి నీడన ఒదగాల్సిన మనిషి
ప్రకృతినే పిడికిట్లో బంధించి
‘ఆంబుక్క’ పెట్టాలని యత్నిస్తే
మనిషి ఉనికే ఊసుకు లేకుండా పోతుంది
లోకం ఉసూరుమంటుంది
*******************
ఆమె+++++ వారాల ఆనంద్
ఆమె
+++++ వారాల ఆనంద్
ఒక్కర్తే
వేదనగా దుఃఖంతో
చెంపలమీద కన్నీటి చారికల్తో
పెరటి గుమ్మం మీద కూర్చుంది
లేచి నాలుగడుగులేసి
ఇంటిముందటి వాకిట్లోకి నడిచింది
వీధిలోకి అటూ ఇటూ దీర్ఘంగా చూసి నిట్టూర్చి
తిరిగొచ్చి
మళ్ళీ పెరటి గుమ్మం మీద కూర్చుంది
ఎవరికోసం అని అడిగాన్నేను
తల పైకెత్తి ఆకాశంలోకి చూసింది
ఏమైంది అని మళ్ళీ అడిగాను
తలదించి నేల వైపు చూసింది
పెరటి గుమ్మం గడపమీద
అలవి కాని దుఃఖాన్ని
నాలుగు కన్నీటి బొట్లని రాల్చి
మౌనంగా లేచి వెళ్లిపోయింది
రాత్రి వేళ చిమ్మచీకట్లో
మొగిన తుపాకీ మోతలు
అనేక ఏళ్లుగా ఆమె గుండెల్లో
ప్రతిధ్వనిస్తూనే వున్నాయి
****
https://telugu.asianetnews.com/literature/telugu-poem-written-by-vaarala-anand-akp-s21q0t
“యుగళగీతం -బృందగానం-అందమయిన వూహ”
“యుగళగీతం -బృందగానం-అందమయిన వూహ”
+++++ వారాల ఆనంద్
వర్షంలో ఓ చెట్టు
దేహమంతా పరవశించి పోతుంది
ఆకాశంనుంచి రాలిన చినుకులు
ఆకుల మీంచి ముత్యాల్లా జారి
నేలమీద పడి మట్టిని పలకరిస్తాయి
అప్పటికే తడిసి పులకరించిన నేల
చెట్టువైపు మట్టి పెదాలతో
చిరునవ్వు విసుర్తుంది
కొంచెంసేపటికి వర్షం నిలిచిపోతుంది
విసురుగా వీస్తున్న చల్లగాలికి
వణుకుపుట్టిన చెట్టు ఒళ్ళు విరుచుకుని
కొమ్మలన్నింటినీ పైకెత్తి
ఆకులన్నింటినీ అందంగా చాపి
ఆకాశానికి కృతజ్ఞతలు చెబుతుంది
నేల తన గొంతుకలిపి
‘యుగళ గీతం’ అందుకుంటుంది
ప్రకృతి పులకరించి
‘బృదగానం’ పాడుతుంది
…
నేనేమో అందమయిన వూహతో
నిండిన కలనుంచి
కళ్ళు నులుముకొంటూ
మేల్కొంటాను
********
(3 అక్టోబర్ 2023 ప్రపంచ ప్రకృతి దినం)