YAVANIKA ONLINE FILM CLUB

24 frames 

Posted on

* విసరనయి* ( తమిళ చిత్రం )*

24 frames 

* విసరనయి* ( తమిళ చిత్రం )*

     ఏ కళయినా వర్తమాన సమాజానికి అద్దం పడుతుంది. విశ్లేషిష్తుంది. ధిక్కారంతో కామెంట్ చేస్తుంది. అప్పుడే ఆ కళ యొక్క లక్ష్యం నెరవేరుతుంది. కళ భావోత్తుంగ తరంగాల నడుమ తన భాధ్యతను నెరవేర్చినట్టవుతుంది. సినిమా కూడా కళ గా తన భాధ్యతను నెరవేరుస్తూనే వుంది. అత్యధిక శాతం వ్యాపార లక్ష్యాలతో సాగే సినిమా రంగం ఉత్తమ చలనచిత్రకారుల చిత్రాల ద్వారా తన భాధ్యతను కొనసాగిస్తూనే వుంది.

ప్రధానంగా వ్యవస్థ గురించి అందులోని అవలక్షణాలు దాష్టీకాల గురించీ సినిమా అనేక సార్లు వివరిస్తూనే వుంది. సమాజం లో అధికారం, బలం, ధనం గల వాళ్ళు పేదల పట్ల బడుగు జీవుల పట్ల వ్యవహరించే తీరుని మంచి సినిమా పట్టించుకుంటూనే వుంది. ఈ మొత్తంలో ప్రధానమయిన పోలీస్ వ్యవస్థ ఎట్లా వ్యవహరిస్తుంది, కింది వర్గాల పట్ల ఏ తీరున పని చేస్తుందన్నది ఇప్పటికే భారతీయ సినిమా రంగం అనేక చిత్రాల్లో దృశ్యీకరించింది.అర్ధ సత్య మొదలు పలు సినిమాల్లో పోలీసుల దాష్టీకాని కళ్ళకు కట్టినట్టు చూపించింది. ఇటీవలి మోహన్ లాల్ ‘దృశ్యం’, కమలహాసన్ ‘పాపనసమ్’ లాంటి సినిమాల్లో పోలీసుల తీరు తెన్నుల్ని చిత్రీకరించారు. అలాంటి మరో మంచి ప్రయత్నమే  తమిళ సినిమా ‘వీసారనై’ (Interrogation)

నేట్రిమారన్ దర్హకత్వంలో నిర్మించ బడ్డ ఈ సినిమా జాతీయ అవార్డులను అందు కోవడమే కాకుండా పలు అంతర్జాతీయ చిత్రోత్సవాలల్లో పాల్గొని ఆస్కార్ పోటీల్లో విదేశీ విభాగంలో భారతీయ సినిమాగా ఎంపికయి అందరి దృష్టినీ ఆకర్షించింది.

గతంలో బాలు మహేంద్ర దర్శ కత్వంలో రూపొందిన ‘నిరీక్షణ’ లో పోలీసుల తీరును చూపించినట్టే  వీసారనై లో కూడా పోలీసు వ్యవస్థ సామాన్య మనిషిని ఎట్లా చూస్తుందో వారిపట్ల ఎట్లా  వ్యవహరిస్తుందో వాస్తవికంగానూ  హృద్యంగానూ ఆవిష్కరించారు.

తమిళనాడు నుంచి ఆంధ్రాకు వలసవచ్చిన నలుగురు కూలీల పట్ల పోలీసుల అక్రమ అరెస్టు దుర్మార్గపు థర్డ్ గ్రేడ్ విచారణ అన్నీ వాస్తవికంగా ఆవిష్కరించారు. రచయితగా మారిన కొయెంబత్తూర్  కు చెందిన ఆటో డ్రైవర్ ఏం. చంద్ర కుమార్ తాను ఎదుర్కొన్న భయంకరమయిన అనుభవంతో రాసిన ‘లాకప్’ అన్న నవల లోని ప్రధాన అంశాన్ని తీసుకుని వీసారనై నిర్మితమయింది. నాలుగురు కూలీలు గుంటూరుకు వచ్చి కూలి చేసుకు బ్రతుకుతుంటారు. అదే ప్రాంతంలో డబ్బు అధికారం వున్న ఒక పెద్ద మనిషి ఇంట్లో దొంగలు పడతారు. పై నుంచి వచ్చిన వొత్తిడి తో ఎట్లాగయినా దొంగల్ని దొరకపుచ్చుకుని నేరాంగీకారాన్ని పొందాలనే ఆలోచనతో ఈ నాలుగుర్ కూలీలు పాండి( దినేష్), మురుగన్( మురుగదాస్), అఫ్జల్(సీలాంబరసన్ ), కుమార్(ప్రదీష్) లను అరెస్టు చేస్తారు. నేరాన్ని అంగీకరించమని తీవ్రయిన హింసకు గురి చేస్తారు. అమాయకులు బడుగు వర్గానికి చెందిన వారు, నోరు లేని వారు అయిన ఆ నలుగురు హింసను తాళ లేక నేరాన్ని అంగీకరిస్తారు. ఇదిలా వుంటే మరో వైపు కెకె అనే ఒక వైట్ కాలర్ నేరస్తున్ని ఎయిర్ కన్దీషన్ గదిలో ప్రశ్నిస్తూ వుంటారు. ఈ రెంటి నడుమా వున్న వైవిధ్యాన్ని దర్శకుడు వాస్తవికంగా చూపిష్తాడు. ఈ మొత్తం కథా కథనంలో లంచగొండులయిన పోలీసు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు వారి అధికార ప్రతిపక్ష పార్టీలూ వాటి ప్రమేయాలు స్వార్థ పరత్వాలూ అన్నీ చూపిస్తాడు దర్శకుడు. న్యాయం కొంత,ఉద్యోగ భాధ్యత గా కొంత అని న్యాయంగా పనిచేసిన ముత్తువేల్ అన్న పోలీస్ అధికారి కూడా ఉన్నతాధి కారుల, రాజకీయ నాయకుల స్వార్థానికి బలయి పోతాడు. ఉత్త పుణ్యానికి ఏమి తెలియని కూలీలు కూడా భూటకపు  ఎన్ కౌంటర్ లో చంపివేయ బడతారు. సినిమా మొత్తం వాస్తవ కోణంలో విలక్షణమయిన చిత్రీకరణ శైలిలో నిర్మించ బడింది. వ్యాపార లక్షణాలున్నప్పటికీ పోలీసు వ్యవస్థ అసలయిన రూపాన్ని ఆవిష్కరించారు దర్శకుడు. పోలీసు హింసను కూడా సూత్రప్రాయమయిన ప్రతీకల ద్వారా చూపించి తన ప్రతిభను ప్రదర్శించాడు దర్శకుడు వెట్ర్రి మారన్ . తమిళ నటుడు ధనుష్ నిర్మాణ సంస్థ నిర్మించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంశల తో పాటు అవార్డులూ రివార్డులూ అందుకుంది. నటులుగా దినేష్ రవి,సాముద్రికరన్ గొప్ప నతని ప్రదర్శించారు. సమస్తం వ్యాపారమే అయిన ఈ కాలపు సినిమా రంగం లో వచ్చిన విలక్షణ చిత్రం విసరనయి.

·         విసరనయి* దర్శకుడు-వెట్రిమారన్*సంగీతం-జి.వి.ప్రకాష్*

24 frames 
* విసరనయి* ( తమిళ చిత్రం )*

అదూర్ ‘స్వయంవరం’ @50

Posted on

  

FRIENDS, 24 FRAMES MY WEEKLY COLUMN IN ‘DISHA DAILY 

24 ఫ్రేమ్స్  

అదూర్ ‘స్వయంవరం’ @50   

+++++ వారాల ఆనంద్

సాధారణ అట్టడుగు ప్రాంతీయ జీవితాల్లోంచి ప్రపంచ మానవ జీవితాల్ని ఆవిష్కరించిన అదూర్ దర్శకుడు గోపాలకృష్ణన్. ఆయన రూపొందించిన మొట్టమొదటి సినిమా ‘స్వయంవరం’. ఆ సినిమాకిప్పుడు యాభై ఏళ్ళు. అంటే గోల్డెన్ జూబ్లీ, స్వర్ణోత్సవం. అర్థవంతమయిన సినిమా అభిమానులు రియలిస్టిక్ సినిమాల్ని ఇష్టపడేవారికి ఇది ఒక పండగే. స్వయంవరం మలయాళీ సినిమాకు కొత్త భాషను కొత్త ఒరవడిని చూపించిన సినిమా. ఆ సినిమా ఎలాంటి రాజీ లేకుండా కేవలం సినిమాను సినిమాగా ఆవిష్కరించిన సినిమాగా నిలబడింది. అప్పటిదాకా మలయాళీ సినిమాల్లో వున్న మెలోడ్రామా, పాటలు, డాన్సులు, కామెడీ ట్రాకులూ లేకుండా దృశ్య ప్రధాన మయిన ఒరవడిలో కొత్త దారులు వేసింది. రే లాంటి వాళ్ళు ఆరంభించిన సమాంతర సినిమాలకు కొనసాగింపు ఈ స్వయంవరం. ఇద్దరు ప్రేమికులు వారి పెద్దలు అంగీకరించకున్నా తమ అభీష్టం మేరకు పెళ్ళాడి తమ కాళ్ళ పై తాము నిలబడాలని నగరానికి వస్తారు. కాని ఈ సమాజంలో మన గలగడం అంత సులభం కాదని అందునా రచయిత గా నిలబడడం చాలా కష్టమని క్రమంగా తెలుసుకుంటారు. ఆ గమనం లో ఆ జంట ఎదుర్కొన్న అనుభవాలూ చూసిన జీవితాలూ ఈ సినిమా కాన్వాస్. అందులో అదూర్ తన దృష్టి కోణాన్ని గొప్పగా ఆవిష్కరించాడు. టార్చ్ బేరర్ గా నిల బడ్డాడు. స్వయంవరం సినిమా స్వర్ణోత్సవం సదర్భంగా ఫిలిం క్రిటిక్ మధు ఎరవంకర THE JOURNEY, Swayamvaram at Fifty అన్న డాక్యుమెంటరీ తీసాడు. అట్లా ‘స్వయంవర’ స్వర్ణోత్సవం కేరళ లోనే కాదు మొత్తం భారతీయ సినిమా రంగంలో నిర్వహించుకోవాల్సిన పండుగ.     

         భారతీయ నవ్య సినిమా ప్రపంచంలో సత్యజిత్ రే తర్వాత అంత గా ప్రపంచ వ్యాప్త గౌరవాన్ని అనుడ్కున్న దర్శకుడు అదూర్ గోపాలకృష్ణన్. సినిమా ఒక పరికరం కాదు అది ఒక ఆలోచన, అభిప్రాయం, ఒక ఆవిష్కరణ అని విశ్వసించి సినిమా ద్వారా జనానికి సామాజిక వాస్తవిక అవగాహన ఆకలుగుతుందని అదూర్ సినిమాలు వివరిస్తాయి. అదూర్ గోపాలకృష్ణన్ అంతర్ముఖుడైన భావుకుడు. వాస్తవికతకు నిబద్దుదయిన దర్శకుడు. ఎప్పటికప్పుడు తనని తాను తెలుసుకుంటూ ఆవిష్కరించుకుంటూ దృశ్య మాధ్యమంలో ప్రకటిస్తూ వచ్చాడు అదూర్. ఒక రకంగా అదూర్ చిత్ర యాత్ర సమస్తం ఆయన విశ్వసించిన వాస్తవికతను ఆయన తన కోణంలో పూర్తిగా తనదయిన ప్రాంతీయ నేపధ్యంలోంచి చిత్రీకరిస్తూ పోయాడు. అందుకే అదూర్ కేవలం తన మాతృ భాష మలయాలంలోనే తన సినిమాలు తీసాడు తప్ప వేరే భాషలో నిర్మించే అవకాశాలు వచ్చినా అందుకు ముందుకు రాలేదు ఎందుకంటే తాను చేపాదలచుకున్నది తనకు తెలిసిన భాషలో చెప్పడమే సరయినదని విశ్వసించాడు. అదే పాటించాడు.

మీ సినిమా తలా రూపొందుతుందంటే కలగా మొదలయి, అక్షరంగా రూపుదిద్దుకొని పాత్రలుగా మారి సినిమా తయారవుతుందని అదూర్ ఒక చోట చెప్పుకున్నాడు. ప్రాంతీయ కోణంతో పాటు అదూర్ సినిమాల్లో మానసిక వాస్తవికత కూడా ప్రతిఫలిస్తూ వుంటుంది. ఆయన సినిమాల్లో స్త్రీ లది ప్రముఖమయిన పాత్ర. అట్లని aa పాత్రలు స్థ్రేఎ వాడ పాత్రలు మాత్రమే కాదు. మొత్తంగా కుటుంబాన్ని సమాజాన్ని నిభాయించుకునే స్త్రీ పాత్రలు ఆయనవి. అదూర్ గమనించిన కేరళ  మాతృ స్వామ్య లక్షణాలు ఆయన సినిమాల్లో ప్రతిధ్వనిస్తూ వుంటాయి. అదూర్ సాధారణంగా  తన సినిమాలకు తానే కథ కథనాలు సమకూర్చుకుంటాడు. ఆయన తీసిన ‘ మధిలుకల్ ‘ (వైకం మొహమ్మద్ భషీర్), విదేయన్ ( పాల్ జక్కరియా) ల కథల ఆధారంగా తీసాడు. తను సినిమా నిర్మాణం మొదలు పెట్టింతర్వాత మరే ఆలోచన తనలో చొరబడనీయకుండా మొదటి ప్రింట్ పూ ర్తి అయేంతవరకు దీక్షగా కోన సాగుతాడు.

తన నాలుగు దశాబ్దాల చలన చిత్ర జీవితంలో 12 కథాత్మక సినిమాలు రూపొందించిన అదూర్ అనేక డాకుమెంటరీ సినిమాలు తీసాడు. తన సినిమాల్లో ప్రతి వివరాన్నిపూర్హి గా తన సంతృప్తి మేరకే తీసుకునే అదూర్ తన సినిమాల్లో నటులు సెచ్చ తీసుజోవదాన్ని అంగీకరించరు. సినిమాల్లో నటులు నాటకాల్లోలాగా ప్రేక్షకులకోసం నటించడం లేదని  వారు దర్శకుడికోసం దర్శకుడి ఆశించినట్టుగా దర్శకుడి సంతృప్తి మేరకు నటించాలని అంటారు. పాత్రల్ని సృష్టించి కథ మేరకు ఆవిష్కరింప చేసే పని దర్శకుడిదే కనుక నటులు పాత్రల్ని ఇంప్రోవైస్ చేయడాన్ని సమంజసం కాదంటారు. అంతే కాదు అదూర్ నటీనటులకు పాత్రల వివరాలు మాటలు సీన్లు సెట్లోకి  వచ్చింతర్వాతే ఇవ్వాలంటాడు. ఆతర్వాతే రిహార్సల్ తర్వాత షూట్ అంటాడాయన. అట్లా సినిమాలకు సంభందించి తనదైన ప్రత్యేక ఒరవడిని సృష్టించాదాయన. అందుకే దర్శకుడి దృక్కోణాన్ని తెరపైకి ఎక్కించి ప్రపంచ వ్యాప్త ఖ్యాతిని సంపాదించాడు.

మలయాళీ చలన చిత్ర రంగంలో అప్పటిదాకా ఉన్న నాటకీయత దాబికాల్ని తోసిరాజని అద్దోర్ గోపాలకృష్ణన్ తన మొట్టమొదటి సినిమా ‘స్వయంవరం’ తో నూతన ఒరవడిని మొదలుపెట్టాడు. జూలై 3 1941 న జన్మించిన అదూర్ గోపాలకృష్ణన్ కుటుంబం కథాకళి నేపధ్యం వున్న కుటుంబం కావడం తో చిన్ననాటినుండే నాటకాలు ప్రదర్శనలతో ఆయన జీవితం ప్రారంభమయంది. కథాకళి లో వున్న సంగీత ఒరవడి, శారీరక సంజ్ఞలు అదూర్ని అమితంగా ప్రభావితం చేసాయి. 8 ఏళ్ల వయసులోనే వేదికలెక్కి ప్రదర్శనలిచ్చారు. డిగ్రీ చదువు పూర్తి చేసుకున్న తర్వాత తమిళ నాడు లోని దిండిగల్ లో ఉద్యోగం చేసాడు.తర్వాత పూనా లోని ఫిలిం ఇన్స్టిట్యుట్ లో స్క్రీన్ప్లే, డైరక్షన్ లలో డిప్లొమా  పొందాడు. తర్వాత త్రివేండ్రం వచ్చి కొంత మంది మిత్రులతో కలిసి రాష్ట్రంలో మొట్టమొదటి ఫిలిం సొసైటీ ‘చిత్రలేఖ’ స్థాపించాడు. తర్వాత సినిమా నిర్మాణం కోసం ‘చిత్రలేఖ ఫిలిం కొ ఆపరేటివ్ ‘ ను ఆరంభించాడు. తాము కొంత చిత్రలేఖ సంస్థ కొంత నేషనల్ ఫిలిం ఫైనాన్స్ సంస్థ నుంచి కొత్త అప్పు తీసుకొని 1972 లో ‘స్వయంవరం’ తీసాడు. నూతన జీవితాన్ని ఆరంభించాలనే ఓ జంట ఎదుర్కొనే అడ్డంకులు ఒడిదొడుకులు ప్రధాన అంశంగా వుంటుందీ చిత్రంలో కాని aa నేపధ్యంలో అదూర్ ఆకాలం నాటి సామాజిక ఆర్ధిక అంశాల పైన ఒక స్టేట్మెంట్ లాగా ఈ సినిమా రూపొందించాడు. అత్యంత వాస్తవిక ధోరణిలో చిత్రీకరించబడి ప్రపంచవ్యాప్తంగా మన్ననలు అందుకుంది. నిజానికి విడులయిన మొదటి రోజుల్లో ప్రేక్షకులు రాక ఆర్థికంగా వైఫల్యాన్ని ఎదుర్కొంది. కాని ఎప్పుడయితే జాతీయ స్థాయి అవార్డులు గెలుచుకొందో దాన్ని మళ్ళీ రెలీస్ చేయడంతో జనం దృష్టిని ఆకర్షించి గొప్ప విజయాన్ని సాధించింది. తర్వాత అద్దోర్ తీసిన సినిమా ‘ కోడియాట్టం’. ఇందులో ఒక వ్యక్తి అమాయక ఏదీ పట్టించుకోని వ్యక్తి నుండి ఒక సంపూర్ణ వ్యక్తిత్వం కల మనిషిగా ఎదిగిన క్రమాన్ని ఈ సినిమా ఆవిష్కరిస్తుంది. సినిమా మొత్తం కేరళ ఆలయాల్లో జరిగే పండుగలా జరుగుతుంది. కోడియాట్టం ప్రధాన పాత్ర దారి గోపికి ఈ సినిమా గొప్ప పేరును తెచ్చి పెట్టడంతో పాటు అనేక అవార్డులు సాధించింది. తర్వాత అదూర్ తీసిన ‘ఎలిపత్తాయం’ 

అద్దోర్ సినీ రంగ జీవితంలో గొప్ప సినిమా గా ఎంచబడింది. ఇది కేరళ లోని ఫ్యూడల్ వ్యవస్థను అత్యంత వాస్తవికంగా ఆవిష్కరించి. బ్రిటిష్ ఫిలిం ఇన్స్టిట్యుట్ అవార్డును గెలుచుకొంది. ఇఅ అదూర్ ‘ ముఖాముఖం’ ఒక కమ్యునిస్టు కార్యకర్త జీవితం పైన నిర్మించబడి గెలుపు ఓటముల సంక్షోభాల్ని ఆవిష్కరించింది. ఇక ‘ అనంతరం’ అదూర్ స్వీయ జీవిత కథాత్మక సినిమా గా చెప్పుకుంటారు. నిర్మాణ సరళి లో మొదట  మోనోలోగ్ గా ప్రారంభమయి కోన సాగుతుంది. వాస్తవం, కల ల మధ్య ఊగిసలాడే జేవితాన్ని అనంతరం అద్భుతంగా చిత్రిస్తుంది.

తర్వాత వైకం బషీర్ కథ ఆధారంగా ‘ మథిలుకల్ ‘ తీసాడు. ఇది కూడా చిత్రీకరనలోవిలక్షనతు సంతరించుకుంది. స్వాతంత్ర పోరాట కాలంలో బషీర్ అనుభవించిన జైలు జీవితాన్ని మథిలుకల్ చిత్రించింది. ఆరాట కాలంలో బషీర్ను జైల్లో వేస్తారు. జైలు గోడకి అవతల మహిళా జైలులో వున్న నారాయని తో మాట కలుస్తుంది. గోడకు చెరో పక్క వున్న a ఇద్దరి నడుమా స్నేహం కుదుర్తుంది. ఒకరిని ఒకరు చూసుకునే అవకాశం లేదు కాని కాని మాటలు కలుపుతాయి చిత్రీకరణ గొప్పగా సాగుతుంది. ఇద్దరూ బయట ఆసుపత్రిలో కలుసుకోవాలనుకుంటారు కాని వీలు కాదు. ఇందులో మమ్ముట్టీ అద్భుతంగా నటించాడు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నాడు. తర్వాత అదూర్ విదేయన్, కథాపురుషన్ తీసాడు. ఇవి రెండూ కేరళలో కొంత వివాదాస్పదమయ్యాయి. విదేయన్ రచయిత పాల్ జక్కరియా తన కథకు అదూర్ న్యాయం చేయలేదని హిందూత్వాన్ని జోడించి నవలకు యదార్థ రూపం ఇవలేక పోయాడని అనడంతో వివాదం చెలరేగింది. దానికి జవాబుగా అదూర్ ఇట్లా అన్నాడు ‘ సాహిత్య పఠ నం వ్యక్తిగత అనుభవం అదే సినిమా సామూహిక అనుభవం కాబట్టి సినిమా రూపాన్తరీకరణ నవల లాగే ఉండాలనుకోవడం సమంజసం కాదు’. తర్వాత అదూర్ తీసిన కథాపురుషన్ స్వీయ కథాత్మక సినిమా గా నిలిచింది. ఇది కేవలం సినిమాఎన్ కాకుండా 40 నుంచి 80 దాక కథానాయకుడి చరిత్రగా తెరకెక్కింది కాని అది కేవలం అతని జీవితమే కాకుండా అయా కాలాలకు సంభంచిన సామాజిక చరిత్రను సైతం చిత్రించింది. ముఖ్యంగా ఆయా కాళాల దృక్పథాల ప్రభావాల్ని ప్రతిహావంతంగా చూపించింది.

ఇక అదూర్ తీసిన ముఖాముఖం కూడా కొంత వివాదాన్నే లేవనేత్త్తింది ఇది కేరళలో కమ్యునిస్టుల వైఫల్యాల్ని చూపించిం ది. దాంతో ముఖాముఖం కమ్యునిస్టుల వ్యతిరేక చిత్రం గా ఆరోపించబడింది. ఇందులో ప్రధాన పాత్రదారికి నత్తి పెట్టడంతో సూచన ప్రాయంగా ఒక నాయకుడిని ప్రతిబింబించి వివాదం ఎక్కువయింది.

తర్వాత అదూర్ ‘ నాలు పెలుంగల్ ‘ తీసాడు. ఇది తగజి శివ శంకర పిల్లి రాసిన నాలు కట్ర్హల్ని జోడించి నిర్మించాడు. స్త్రీల పాత్రల్ని ఆవిష్కరిస్తూ తీసిన ఈ సినిమా నాలుగు కథల సమ్మేళనంగా వుంది. తర్వాత అదూర్ పెన్న్యం నిర్మించాడు. ఇట్లా ఆయన నిర్మించిన సినిమాలు అంతర్జాతీయంగా ఎంతో పేరు గడించి సొంత గొంతును పలికించి నిలబెట్టాయి.

ఫీచర్ films తో పాటు అదూర్ అనేక డాక్యుమెంటరీ సినిమాలు తీసాడు. కాలమండలం గోపి లాంటి కథాకళి కలాకారు డి పైన ఆయన తీసిన డాక్యుమెంటరీ లు సాదికరికమయినవిగా పెరుతేచ్చుకున్నాయి.

 మానవీయ విలువల్ని ఆవిష్కరిస్తూ కళాత్మక వాస్తవికతకు తోడు మానసిక వాస్తవికతను తెరపై నిజాయితీగా చిత్రిస్తూ ముందుకు సాగుతున్న అదూర్ గోపాలకృష్ణన్ భారతీయ సినిమాకు అందించిన ఆణిముత్యాల్లాంటి సినిమాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి ఆయన ఖ్యాతి కూడా చిరస్థాయిగా నిలుస్తుంది.

-వారాల ఆనంద్   944440501281

అదూర్ ‘స్వయంవరం’ @50

మంచి సినిమాకు కోట్లు కాదు ఊతం కావాలి

Posted on

++++ వారాల ఆనంద్

        ఒక్క తెలుగు సినిమానే కాదు మొత్తం భారతీయ సినిమా రంగంలో ‘ట్రెండ్’ అన్న మాట చాలా పాపులర్. ట్రెండ్, ట్రెండ్ సెట్టింగ్, ట్రెండ్ సెట్టర్ లాంటి మాటల్ని సినిమా వాళ్ళు తరుచుగా వాడుతూ వుంటారు. ట్రెండ్ అంటే ఒక తరహా సినిమా వచ్చి గెలిచిందంటే చాలు అదే ఒరవడిలో పలు సినిమాలు రావడం. ఆ తరహాని సినిమా వాళ్ళు ఈ ట్రెండ్ అనే మాట తో తరుచుగా వాడుతూ వుంటారు. ఆ మాట సినిమాకు హైప్ తీసురావడానికి కూడా విస్తృతంగా వాడతారు. అయితే ఇవ్వాల్టి వాతావరణంలో ఈ ట్రెండ్ అన్నమాట భిన్న సందర్భంలో, భిన్న ధోరణిలో వాడుతున్నారు. గతంలో హీరోను లేదా ఒక జానర్ సినిమాను ఈ ట్రెండ్ మాటతో ఊదర గొట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు నడుస్తున్నది “బడ్జెట్ ట్రెండ్”. అంటే పాపులర్ హీరో పేరు కంటే కూడా వంద కోట్ల సినిమా రెండొందల కోట్ల సినిమా అంటూ సినిమా నిర్మాణ సమయంలోనే ప్రచారం చేయడం ఇవ్వాల్టి ఒరవడి, సందడి కూడా. ఇక విడుదల అయిం తర్వాత రోజు రోజుకీ ఇన్ని కోట్ల వసూళ్ళ క్లబ్ లో చేరిందదనేది ఇంకో ప్రచారాస్త్రం. ఇదంతా ఇవ్వాల్టి ట్రెండ్. నిజానికి వ్యాపార సినిమా అంటేనే డబ్బు మాయ.. ప్రచారం ఒక ట్రెండ్. దాంట్లో ఏది నిజమో ఏది ఉత్తుత్తి ప్రచారమో ఎవరికీ తెలీదు. ఇన్ కం టాక్స్, ఎంటర్తైన్మెంట్ టాక్స్ లాంటి వాళ్లకు కూడా అర్థం కాని బ్రహ్మ పదార్ధం ఈ సినిమాల పెట్టుబడీ, వసూళ్ళ వ్యవహారం. అదంతా మనకవసరం లేదు కానీ సినిమా బాగుందా అర్థవంతంగా వుందా లేదా అన్నది మనకు ముఖ్యాం. అంతే కాదు వీక్షకులకు కనీస వినోదం అందించినదా లేదా అన్నదీ అంతకంటే ప్రధానం కదా.

సినిమా నిర్మాణానికి సంబంధించి సాంకేతిక అంశాల్లో అనేక మార్పులు వచ్చాయి. 8 ఎం.ఎం.- 16 ఎం.ఎం., 35 ఎం.ఎం., సినిమా స్కోప్, 70 ఎం.ఎం., బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్, స్టీరియో ఫోనిక్, దాల్బీ నుంచి అనేకాకానేక మార్పులకు లోనయింది. FILM VIEWING EXPERIENCE చాలా ప్రగతిశీలయిన మార్పులు వచ్చాయి.  ఆధునిక సాంకేతికత ఎంతగా పెరుగుతూ వచ్చిందో పెట్టుబడీ అంతే పెరుగుహ్తూ వచ్చింది. అంది కాదు సాంకేతిక పరికరాల తో పాటు ఇతర ఇన్ఫ్రా స్ట్రక్చర్  విషయంలో అంతే మార్పులు సంభవించాయి. ఫలితంగా సినిమాలకు పెట్టుబడీ పెరిగింది. అందులో కార్పోరేట్ సంస్థలూ వచ్చి చేరాయి. దాంతో సినిమా రంగంలో నిర్మాతలుగా స్టూడియోలు పోయాయి, సంస్థలూ, వ్యక్తిగత నిర్మాతలూ వెనకడుగు వేసారు. ఇప్పుడంతా కంపనే వ్యవహారం. నిర్మాణం నుంచి మొదలు పంపిణీ, ప్రదర్శన రంగాల దాకా కార్పోరేట్ రంగమే. దాంతో కళ కళాత్మకత అన్న మాటలకు అర్థం పోయి అంతా “అర్థమే” అయిపొయింది. ఫలితంగా సామాన్యుడికి సినిమాకు వున్న కనెక్టివిటీ పోయింది. సినిమా పరాయిదయి పోయింది. వ్యాపార సినిమాకు పెద్ద పోషకుడు అయిన సామాన్యుడు దూరం కావడం తో కలెక్షన్లు ప్రభావితమయి పోయి అనేక సినిమాలు తిరుగు టపాలో వెనుతిరుగుతున్నాయనే చెప్పాలి. అదంతా ఒక వలయం.

ఇక కేవలం సినిమా నిర్మాణ రంగానికి సంబంధించిన అంశాలనే పరిశీలించుకుంటే సినిమా తొలి రోజుల్లో వ్యవసాయంలోనో, వ్యాపారంలోనో లేదా అప్పటికి వున్నా చిన్న మధ్య తరగతి పరిశ్రమల్లోనో విజయాలుసాధించిన వాళ్ళు అధిక శాతం నిర్మాతలుగా ఫిలిమ్స్ లోకి వచ్చారు. ఆయా రంగాల్లో లభించిన మిగులును తెచ్చి స్టూడియోలు కట్టి నిర్మాతలుగా మారారు. అక్కడా పెరుతున్న లాభాలూ మరొక వైపు సినిమాలకు పెరుతున్న గ్లామర్ కూడా కొంత మందిని నిర్మాతలుగా చేసిందనే చెప్పాలి. ఇందులో వాటాదార్ల వ్యవస్థ కూడా వచ్చింది. తర్వాత చాలా కాలానికి ప్రపంచీకరణ ఫలితంగా కార్పొరేట్లు సినిమాల్లోక్ వచ్చారు. అది వేరే కథ. ఇదంతా ఇట్లా ఉండగానే సహకారరంగం లో లాగా అనేక మంది సామాన్య సభ్యులు కలిసి సినిమాలు నిర్మించే ప్రయత్నాలూ, సామాన్యులు ఇచ్చిన చందాలతో సినిమాలు నిర్మించిన ప్రయత్నాలూ మన దేశంలో వివిధ భాషా సినిమాలలో జరిగాయి. వాటి ఫలితంగా కొన్ని అర్థవంతమయిన సినిమాల నిర్మాణం జరిగింది. కానీ ఆ ఒరవడి పది కాలాల పాటు నిలబడక పోవడమే విషాదం. ఇటీవల క్రౌడ్ ఫండింగ్ అనే భావన గురించి పలువురు మాట్లాడుతున్నారు కానీ ఆ పేరు మీద కాదు కానీ అలాంటి ప్రయత్నాలు మన దేశంలో చాలానే జరిగాయి. ఆవిధంగా సహకార వ్యవస్థ రూపంలో దేశంలో జరిగిన మొట్టమొదటి ప్రయత్నం కేరళ లో జరిగింది. సుప్రసిధ్హ దర్శకుడు అదూర్ గోపాల కృష్ణన్ పూనా ఫిలిం ఇన్స్టిట్యుట్ లో తన కోర్సు పూర్తి చేసుకున్నతర్వాత త్రివేండ్రం లో తన మిత్రులతో కలిసి ‘చిత్రలేఖ ఫిలిం సొసైటీ’ తో పాటు ‘చలచిత్ర సహకార సంఘం’ ఏర్పాటు చేసాడు. చిత్రలేఖ ఫిలిం సొసైటీ’ తో దేశ విదేశాల గోప్పసినిమాల్ని ప్రదర్శించడం, ‘చలచిత్ర సహకార సంఘం’ తో సినిమా నిర్మాణం చేయాలని సంకల్పించాడు. సహకార సంఘ సభ్యులు సమకూర్చిన సభ్యత్వంతో తన మొట్ట మొదటి సినిమా “స్వయంవరం” రూపొందించాడు. కేవలం రెండున్నర లక్షల పెట్టుబడి తో నిర్మితమయిన ఆ సినిమాలో ప్రధాన పాత్రల్ని శారద, మధు పోషించారు. ఆ సినిమా ఆ సంవత్సరానికి జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమనటి, ఉత్తమసినిమాతోగ్రఫర్ అవార్డుల్ని  అందుకుని కొత్త ఒరవడిని మొదలు పెట్టింది. ఆ సినిమా తోనే మన శారదకు జాతీయ ఉత్తమ నటి అవార్డు లభించింది. అట్లా నిర్మాణ రంగం లో సహకార వ్యవస్థలో కేవలం సభ్యులు పెట్టిన పెట్టుబడితో నిర్మించబడి విజయవంతమిన సినిమా గా నిలబడింది.

ఇక ఆ తర్వాత కేరళ లోనే జాన్ అబ్రహం తన మొట్ట మొదటి సినిమా ‘అగ్రహారిత్తుల్ కజుతై’ తర్వాత సామాన్య ప్రజలు ఇచ్చిన చందాలతో ‘అమ్మా అరియన్’ సినిమా తీసాడు. జాన్ అబ్రహం తన మిత్రులతో కలిసి  ‘ఒడిస్సీ’ ఉద్యమం పేర ఉత్తమ సినిమాల్ని పల్లెల్లో ప్రదర్శించే ఒక కార్యక్రమం చేపట్టాడు. అందులో భాగంగా ఊరూరా తిరుగుతూ 16 ఎం.ఎం లో ప్రదర్శనల్ని ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ప్రతి ప్రదర్శన తర్వాత జాన్ తన మిత్రులతో కలిసి జోలె పట్టి జనం వద్ద చందా అడిగే వాడు. అట్లా జనం ఇచ్చిన సొమ్ముతో ఆయన అద్భుతమయిన ’అమ్మా అరియన్’ అన్న సినిమా తీసాడు. ఆ సినిమా కూడా జాతీయస్థాయిలో అవార్డులతో పాటు విలక్షణమయిన సినిమా నిలబడింది. అంటే ఆ సినిమాకు ఇర్మాతలు ప్రజలే..

ఇదిట్లా వుంటే లక్షలాది మంది కలిసి నిర్మించిన సినిమా ‘మంథన్’. ఆ సినిమాకు శ్యాం బెనెగల్ దర్శకత్వం వహించాడు. పాల ఉత్పత్హి పెంచడంలో అనేక విజయాలు సాధించి శ్వేత విప్లవ పితా మహుడిగా పేరొందిన వర్గీస్ కురియన్ జేవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ అండ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ సంస్థ ఈ సినిమా నిర్మాణానికి ముందుకు వచ్చింది. దాంతో ఆ ఫెదేరషణ్ లో వున్నా 5 లక్షల మంది సభ్యులు తలా రెండు రూపాయల చొప్పున ఈ సినిమా నిర్మాణానికి ఇచ్చారు. దాంతో వాళ్ళంతా నిర్మాణంలో భాగస్వాములు అయ్యారు. అంటే దేశంలో అత్యధిక మంది CROWD FUNDING చేసి నిర్మించిన సినిమా గా మంతన్ మిగిలి పోయింది. గిరీష్ కర్నాడ్, నసీరుద్దిన్ షా, స్మితా పాటిల్, అమ్రీష్ పూరి తదితరులు ప్రధాన పాత్రల్ని పోషించిన ఈ మంతన్ విశిష్టమయిన సినిమాగా పలు అవార్డుల్ని అందుకుంది.

ఈప్రయత్నాల ప్రేరణ తో కరీంనగర్ లోకూడా ‘కరీంనగర్ ఫిలిం క్రియేటర్స్’ పేరాక విఫల యథానంజరిగింది. కరీంనగర్ ఫిలిం సొసైటీ ఉదృతంగా కార్యక్రమాల్ని నిర్వహిస్తూనే నిర్మాణ రంగంలోకి వెళ్లాలని చేసిన ప్రయత్నమే ఇది. అప్పటికే నారదాసు లక్ష్మన రావు ఇతర మిత్రులతో కలిసి ‘విముక్తి కోసం’ నిర్మించి వున్నాడు. దాంతో జాన్ అబ్రహం చేసిన అమ్మ అరియన్ ప్రేరణ తో ‘కరీంనగర్ ఫిలిం క్రియేటర్స్’ ఆలోచన ముందుకు వచ్చింది. హరిపురుశోత్తమ రావు లాంటి వాళ్ళతో సభలు చర్చలు కూడా చేసాం. దాంట్లో ప్రధానంగా డి.నరసింహారావు, నరేడ్ల శ్రీనివాస్, వారాల ఆనంద్, గోపు లింగా రెడ్డిలు ముందున్నారు. నారదాసు పైన పూర్తి నిర్మాణ బాధ్యతల్ని పెట్టాలని నిర్ణయించాం. ఆయనా గొప్ప ఉత్సాహం తో ముందుకువచ్చాడు. సంస్థ రూపొందడడం నాలుగు అడుగులు ముందుకు పాడడం కూడా జరిగింది. కానీ అనేక ఇతర కార్యక్రమాల వత్తిడి తో సమష్ట ముందుకు సాగలేదు. ఒక చారిత్రాత్మక సినిమా నిర్మాణం నిలిఛి పోయింది. అది పెద్ద వైఫల్యంగనే భావిస్తాను. ఇట్లా CROWD FUNDING తో తెలుగులో కూడా కొన్ని యత్నాలు జరిగాయి. వాటిలో ముఖ్యమయంది. ఫణీంద్ర దర్శకత్వం వహించిన సినిమా ‘మను’. అట్లా మరిన్ని మంచి సినిమాలు CROWD FUNDING లో రాగలిగితే నిర్మాణ వ్యయం విషయంలో పోటాపోటీ తగ్గుతుందని మంచి అర్థవంతమయిన సినిమాలు వచ్చే వీలు ఉంటుందని భావిస్తాను.

-వారాల ఆనంద్               

ఖరీదుగా మారిన వినోదం – వారాల ఆనంద్

Posted on

24 MY WEEKLY COLUMN IN ‘DISHA’ DAILY

ఖరీదుగా మారిన వినోదం

++++++++++++ వారాల ఆనంద్

  మన దేశంలో ‘సినిమా’నే సామాన్య ప్రేక్షకుడికి వినోదం. తెరపై బొమ్మలు కదలడం, మాట్లాడడం, పాడడం, నాట్యం చేయడం మొదలయ్యాక సినిమా సామాన్యుడి జీవితంలో అంతర్భాగమయిపోయింది. పడగొచ్చినా పబ్బమొచ్చినా, దోస్తులు కలిసినా చుట్టాలొచ్చినా అంతా కలిసి సినిమాకు వెళ్ళడం భారతీయులకు సాధారణం కాలక్షేపం. అంతేకాదు వాళ్లకు  ‘కదిలే బొమ్మల కబుర్లు’ చెప్పుకోవడం, వాటి గురించి మాట్లాడుకోవడం ఎంతో సరదా అయిన వ్యాపకం. సినిమా కనిపెట్టబడిన ఈ శతాబ్దకాలంలో ముంబై లాంటి మహానగరాలనుంచి మారు మూల పల్లెల దాకా సినిమా ప్రజల్లోకి చొచ్చుకు పోయింది. అంతకు ముందు వీధి నాటకాలూ, హరికథలూ, బుర్రకథలూ,ఒగ్గు కథలూ లాంటి కళా రూపాల్లో రామాయణ, భారత కథల్ని చూసి ఆనందింఛి వినోదాన్ని చూసిన సామాన్య ప్రజానీకానికి సినిమా అద్భుతమయిన కాలక్షేప వినోద వ్యాపకంలా మారిపోయింది. అవి వారికి అందుబాటు ధరలో వినోదాన్ని పంచాయి. రోజంతా కాయకష్టం చేసిన సామన్యునికి సినిమా పెద్ద వేదిక అయిపొయింది. కానీ ప్రదర్శనా రంగంలో ఇవ్వాళ  ‘మల్టీ ప్లెక్ష్’ సినిమా హాళ్ళ సంస్కృతి వచ్చి సామాన్యున్ని సినిమాలకు దూరం చేసింది.

    గతంలో నా ఎరుకలోనే 35 పైసలకు నేల టికెట్ మీద సినిమా చూసిన జ్ఞాపకం వుంది. అప్పుడు బెంచి 75 పైసలు, కుర్చీ రూ.1.25 గా వుండేది. అది కాలక్రమంగా కొంచెం పెరిగినా సామాన్యుడికి భారం కాని స్థాయిలోనే వుండేది. సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్ళల్లో 800–1000 సీట్లదాకా ఉండేవి. వాటిల్లో లోయర్ క్లాస్ ఎక్కువగా వుండి హయ్యర్ క్లాస్ టికెట్స్ సీట్లు తక్కువగా ఉండేవి. అప్పుడు సామాన్యుడికి సినిమా అత్యంత చవకయిన వినోదం. ఇంటిల్లిపాదీ సినిమాకు వెళ్ళగలిగే వాళ్ళు. అంతే కాదు ఒకే సినిమాను పలుసార్లు రిపీట్ ఆడియన్స్ గా చూసేవాళ్ళు. ఈలలు కొట్టి గోల చేసేవాళ్ళు. సినిమాల్ని పలు కేంద్రాల్లో వంద రోజులు, సిల్వర్ జూబిలీ. గోల్డెన్ జుబ్లీ లు చేసేవాళ్ళు. సామాన్య ప్రేక్షకుల్లోనే హీరోలకు అభిమాన సంఘాలు ఉండేవి. టాకీసుల ముందు బానర్లు కట్టి పూలదండలు వేసి పండగ చేసుకునే వాళ్ళు. అంటే కేవలం వినోదం పేర సినిమాలకు ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అయ్యేవాళ్ళు. ఇవ్వాళ ఈ దృశ్యాలు మనకు కనిపించవు.ఈ రోజుల్లో సినిమా వాళ్ళే విపరీతంగా డబ్బులు పెట్టి ప్రచారం చేసుకుని డబ్బా కొట్టుకునే స్థితి మనకు కనిపిస్తుంది. దాంతో సామాన్యుడికి సినిమాకు వున్న కనెక్టివిటీ పోయింది. సినిమా పరాయిదయి పోయింది. 

     ఇవ్వాళ మల్టీ ప్లెక్ష్ సినిమా హాల్లల్లో ఒక కుటుంబం అంతా కలిసి సినిమాకు వెళ్ళాలంటే వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో ఈ రోజు సినిమా ఒక ఖరీదయిన వినోదంగా మారిపోయింది. సరసమయిన ధరలకు దొరికే వినోదం కాస్తా ఖరీదయినదిగా మారడంతో సామాన్య ప్రేక్షకులు సినిమాలకు, సినిమా హాళ్ళకు దూరం అయిపోయారు. అంతే కాదు ఓ నెలనొ రెండు నెలలో ఆగితే ఓ టీ టీ లలో చూడొచ్చులే  అనే భావన ప్రక్షకుల్లో క్రమంగా నెలకొంటున్నది. పర్యవసానంగా సినిమా హాళ్ళకు వచ్చే జనం తగ్గిపోయి అవి బోసి పోతున్నాయి. జనం సినిమాలకు రావడం లేదు మొర్రో అని సినిమా వాళ్ళు గగ్గోలు పెట్టడం మొదలు పెట్టారు. ప్రేక్షకుల్ని టాకీసుల్దాకా రాబట్టడానికి ఎన్నెన్నో కొత్త ఎత్తులు వేయడం పాన్ ఇండియా అని కబుర్లు చెప్పడం శురూ చేసారు. “ ప్రేక్షక దేవుళ్ళు అనే మాట మరిచిపోయి ప్రేక్షకుల్ని వినియోగదారులుగా, కస్టమర్స్” గా చూడ్డం  ఆరంభించారు. ఫలితంగా వాళ్ళు సినిమా నిర్మాణం నుండి విడుదల దాకా అష్ట కష్టాలు పడాల్సి వస్తున్నది. తీరా ఎదో ఒకరకంగా సినిమా ను టాకీసుల్దాకా తెస్తే అవి ఆర్థికంగా ఏమవుతాయో తెలీని స్థితి ఏర్పడింది. అంటే సామాన్యుడి వినోదాన్ని హంగుల పేర వాళ్లకు దూరం చేసి తిరిగి వాళ్ళనే దోషులుగా మాట్లాడ్డం సినిమా వాళ్లకు అలవాటయిపోయింది.

అసలీ సినిమా రంగంలో ఈ మార్పు ఈ రోజు కాదు 90 లలోనే మొదలయింది. దానీ ప్రధానంగా అప్పుడు  దేశంలో అమల్లోకి వచ్చిన ఎల్.పీ.జీ, ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. అంటే గోబలైజేషణ్ ప్రభావం సినిమా రంగం పైన పెద్ద ఎత్తున పడింది. అప్పుడే సినిమాకు పరిశ్రమ హోదా ఇచ్చారు. దాంతో చిన్న నిర్మాతల స్థానం లో పెద్ద కార్పోరేట్స్ నిర్మాణ, పంపిణీ, ప్రదర్శనా రంగాల్లోకి వచ్చాయి, చిన్న, వ్యక్తిగత నిర్మాతలు క్రమంగా రంగం నుండి తప్పుకున్నారు. పెద్ద పెట్టుబడులు చేరాయి. క్రమంగా పాశ్చాత్య సంస్కృతి పెచ్చరిల్లింది. వాటికి తోడు ఆధునిక సాంకేతికత ఆవిర్భావంతో సినిమా సీన్ మొత్తం మారిపోయింది. తొలుత సినిమా హాళ్ళల్లో కింది టికెట్ల సీట్లు,సంఖ్య తగ్గించేసారు. క్రమంగా పెద్ద రెట్ల టికెట్స్ సీట్లు పెంచారు. అక్కడే మొత్తం ప్రహసనం మొదలయింది. దాంతోనే ఆగకుండా అసలు ఈ సింగిల్ స్క్రీన్ హాళ్ళు అనవసరం అన్నారు. వర్క్ ఆవుట్ కాదన్నారు. వాటి స్థానంలో చిన్న మల్టీ పర్పస్ సినిమా కామ్ప్లెక్ష్ ల ఆలోచన మొదలయింది. దాని పర్యవసానమే ఇవ్వాల్టి  మల్టీ ప్లెక్ష్ లు. సినిమా ప్రదర్శనలకు హాల్లల్లో కేవలం 200 సీట్లకు పరిమితం చేసి మొత్తం ఓ వ్యాపార కూటమిగా అవి ఏర్పడడం మొదలయ్యాయి. 1990 ల్లో ముంబైలో మొట్ట మొదటి పీ.వీ.ఆర్ ఆమపమ మల్టిపుల్ సినిమా హాలు మొదలయింది. తర్వాత 2002 లో ముంబై లో ‘ఫేం సినిమా’ మొట్ట మొదటి మల్టీ ప్లెక్ష్ గా పేరొందింది. వాటిల్లో షాపింగ్ కాంప్లెక్స్, కాఫీ హౌజ్ , పాప్ కార్న్ టబ్స్, గేమింగ్ మొదలయిన వన్నీ సమకూర్చడం మొదలు పెట్టారు. రెండు మూడు వందల్లో సినిమా టికెట్ రెట్లు, ఇతర షాపింగ్ కూడా ఖరీదయింది కావడం తో ప్రేక్షకుల పైన భారం విపరీతంగా పెరిగింది. ఇప్పటికి దేశంలో మహానగరాల నుంచి మామూలు పట్టణాల వరకు మల్టీ ప్లెక్ష్ సంస్కృతి పెరిగి పోయింది. దేశమంతా పీ.వీ.ఆర్.,ఐనొక్ష్, బిగ్ సినిమా ఎస్క్వేర్, సినిపోలిస్, ముక్తా లాంటి  కార్పోరేట్స్ మల్టీ ప్లెక్ష్ రంగాన్ని శాశిస్తున్నాయి అనడం లో అతిశయోక్తి లేదు.

ఈ స్థితిలో సామాన్యుడు సినిమా హాలుకు రావడం గగనం అయిపోయిందనే చెప్పాలి. వ్యాపార సినిమాకు పెద్ద పోషకుడు అయిన సామాన్యుడు దూరం కావడం తో కలెక్షన్లు కూలి పోయి సినిమాలు తిరుగు టపాలో వేనుతిరుగుతున్నాయనే చెప్పాలి.

అయితే ఈ విషయాన్ని ఇప్పుడిప్పుడే సినిమా వాళ్ళు గమనిస్తున్న దాఖలా కనిపిస్తున్నది.

ఉదాహరణకు చెప్పుకుంటే “బచ్చన్ బ్యాక్ టుది బిగినింగ్’ గురించి చెప్పాలి. అమితాబ్ బచ్చన్ కి 80 ఏళ్ళు నిండిన సందర్భంగా పీ.వీ.ఆర్.సినిమాస్ , ఫిలిం హీరిటేజ్ ఫౌండేషన్ సంయుక్తంగా 4 రోజుల ఉత్సవాన్ని నిర్వహిస్తున్నది. దేశంలోని 17 నగరాలలోని 22 సినిమా హాల్లల్లో ఈ ఉత్సవం జరుగుతుంది. అయితే ఈ సినిమాలు ప్రదర్శించే ఈ నాలుగురోజులకు గాను కేవలం రూ. 400/ మాత్రమే చార్జ్ చేస్తారు. అంటే మల్టీ ప్లెక్ష్ రెట్లు కాకుండా ముంబై, డిల్లీ, కలకత్తా, హైదరాబాద్ లాంటి మహా నగరాలతో పాటు సూరత్ బరోడా లాంటి నగరాల్లో కూడా ఈ సినిమాలు ప్రదర్శిస్తారు. వీటిలో డాన్, కభీ కభీ, నమక్ హలాల్, అభిమాన్, కాలా పత్తర్, దీవార్, మిలీ లాంటి సినిమాల్ని ఇందులో ఈ పాకేజీలో ప్రదర్శిస్తారు. అంటే మల్టీ ప్లెక్ష్ ప్రదర్శనలు సామాన్యుడికి అందుబాటులోకి ఇచ్చే ప్రయత్నం ఇది. ఇది ఘనంగా విజయవంతమయితే భవిష్యత్తులో మల్టీ ప్లెక్ష్ ఆలోచన మారే అవకాశం వుంది. ఆ క్రమంలో తెలుగు సినిమా రంగం కూడా ఆలోచించాల్సి రావచ్చు. అట్లా జరగాలని మళ్ళీ సినిమా వినోదం సామాన్యుడికి అందుబాటులోకి రావాలని ఆశిస్తాను.

  • వారాల ఆనంద్                              

“24 ఫ్రేమ్స్” భరత్’ అనే నేను ఓ దేశభక్తి చిత్రాన్ని

Posted on

భరత్’ అనే నేను ఓ దేశభక్తి చిత్రాన్ని

24 ఫ్రేమ్స్ “ (MY WEEKLY COLUMN IN ‘DISHA’ DAILY)

“భరత్’ అనే నేను ఓ దేశభక్తి చిత్రాన్ని
+++++++++వారాల ఆనంద్

హిందీ సినిమా రంగంలో ఆయన హీరోగా నటించిన అనేక సినిమాల్లో ఆయన పాత్ర పేరు ‘భరత్”. ఆయన నటించిన అనేక సినిమాలు దేశభక్తిని ప్రభోదించినవే. అందుకే మనోజ్ కుమార్ ను వెండి తెర దేశభక్తుడు అంటారు.
“హై ప్రీత్ జహాన్ కి రీత్ సదా
మై గీత్ వహాన్ కీ గాతా హూన్
భారత్ కా రహనే వాలా హూన్
భారత్ కీ బాత్ సునాతా హూన్ .. “అంటూ అనేక పాటలకు నటించి మంచి పేరు గడించాడు. ఆయన గత తరం నాయకుడు. స్వాతంత్రానంతరం జరిగన దేశ విభజనకు బలయిన లక్షలాది మందిలో తానూ ఒకడిని అని భావించే మనోజ్ కుమార్ భగత్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా 1965 లో “షహీద్” సినిమా రూపొందించాడు. అది గొప్ప విజయాన్ని సాధించింది. అప్పటి ప్రధాని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి కి ఆ సినిమా బాగా నచ్చింది. 1965 లో జరిగిన భారత్-పాకిస్తాన్ల యుద్ధం తర్వాత శాస్త్రి గారు మనోజ్ కుమార్ ను పిలిచి అభినందించారు. అంతే కాకుండా దేశానికి తానెంతో స్పూర్తిదాయకంగా ఇచ్చిన “జై జవాన్ జై కిసాన్” నినాదం ఆధారంగా ఒక మంచి సినిమా రూపొందించమని అడిగాడు. ప్రధాని సూచనల మేరకు స్పందించిన మనోజ్ కుమార్ “ఉప్ కార్ “ సినిమా తీసాడు. అందులో మనోజ్ కుమార్ స్వయంగా రైతు గానూ, సైనికుడిగానూ నటించాడు. ఆ ఏడు ఆ ఉప్ కార్ సినిమా పెద్ద విజయవంతమయిన సినిమాగా నిలిచింది. అంతే కాకుండా జాతీయ స్థాయిలో ద్వితీయ ఉతమ చిత్రం అవార్డుతో పాటు నాలుగు ఫిలింఫేర్ పురస్కారాల్ని అందుకుంది. ‘ఉప్కార్’ సినిమా అనగానే
“మేరె దేశ్ కి ధర్తీ సోనా ఉగ్లే ఉగ్లే దీరే మోతి….
ఏ బాఘ్ హై గౌతం నానక్ కి, కిల్తే హై అమన్ కే పూల్ యహాన్,
గాంధీ, సుభాష్, టాగోర్, తిలక్.. ఐసే హైన్ పూల్ చమన్ కే యహాన్,
రాంగ్ లాల్ హై లాల్ బహదూర్ సే..” పాట గుర్తొస్తుంది. గుల్షన్ బావరా రాసిన ఆపాట కు కల్యాన్ జీ-ఆనంద్ జీ సంగీతం సమకూర్చారు. మహేంద్ర కపూర్ చాలా గొప్పగా పాడాడు. అదిప్పటికీ జాతీయ ఉత్సవాలల్లో గౌరవంగా వినిపిస్తుంది. ఇక ముందూ వినిపిస్తూనే వుంటుంది.
అట్లా దేశ భక్తి సినిమాల హీరో గా వినుతికెక్కిన మనోజ్ కుమార్ తన కారీర్ ను 1957 ప్రారంభించాడు. ముప్పై ఏళ్లకు పైగా నటనా జీవితంలో కొనసాగిన ఆయన సినిమాల్లో దాదాపు అన్నింటా ఆయన పోషించిన పాత్రల పేరు ‘భరత్’ కావడం వేశేషం. దేశ విభజనకు బలయిన లక్షలాది మందిలో తానూ ఒకడిని అని భావించే మనోజ్ కుమార్ 1937లో అబ్బోతాబాద్ లో జన్మించాడు. అదిప్పుడు పాకిస్తాన్ లో వుంది. మనోజ్ అసలు పేరు హరికృష్ణ గోస్వామి. దేశ విభజన ఫలితంగా వారి కుటుంబం డిల్లీ వచ్చి శరణార్థి కేంద్రం లో నివసించారు. చిన్నప్పటినుండీ సినిమాలు చూడడంలో ఎంతో ఆసక్తి వున్న ఆయన ధిల్లీ హిందూ కాలేజ్ లో డిగ్రీ పూర్తి చేసాడు. తనకు దగ్గరి బందువయిన లేఖ్రాజ్ భక్రి ద్వారా హిందీ సినిమాల్లోకి వచ్చాడు. లేఖ్రాజ్ అప్పటికే శమ్మీకపూర్ తో ‘తంగే వాలి ’ లాంటి సినిమాలు తీసిన బాంబే లో పేరున్న నిర్మాత. లేఖ్రాజ్ సూచనల మేరకు బాంబే చేరినప్పటికీ మనోజ్ కుమార్ కు చిత్ర పరిశ్రమ వెంటనే స్వాగతం చెప్పలేదు. ఆర్నెల్లపాటు ఒక వైపు పాత్రల కోసం తిరుగుతూనే కథలు, ఫిలిం స్క్రిప్టులు రాసుకోవడం మొదలు పెట్టాడు. హోమీ సేత్నా సినిమా ‘గంగూతేలి’ తో సినిమా ప్రవేశం జరిగింది. తర్వాత లేఖ్రాజ్ నిర్మించిన ఫాషన్, చాంద్ లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేశాడు. అయితే 1961 లో హెచ్.ఎస్.రవెల్ రూపొందించిన ‘కాంచ్ కి గుడియా’ తో హీరోగా తెర మీదికి వచ్చాడు. అదే సమయంలో ‘రేశ్మీ రుమాల్’ లాంటి సినిమా అవకాశాలూ వచ్చాయి. అనంతర కాలంలో మనోజ్ కుమార్ హర్యాలీ అవుర్ రాస్తా, హిమాలి కే గోద్ మే, వొహ్ కౌన్ థీ లాంటి సినిమాలతో స్టార్ ఇమేజ్ వచ్చింది. అప్పుడే మనోజ్ ‘షహీద్’ సినిమా స్క్రిప్ట్ రాసుకున్నాడు. దాన్ని నిర్మాత కేవల్ కాశ్యప్, రాంశర్మ దర్శకత్వంలో తీసాడు. అదట్లా వుండగా 1960 తర్వాత గుమ్నాం, పత్తర్ కే సనం, పెహచాన్, సన్యాసి, బేమాన్, దస్ నంబరీ లాంటి సినిమాలతో స్టార్ స్టేటస్ సాధించాడు. స్క్రిప్ట్ రచనలో ప్రావీణ్యం వున్న మనోజ్ అనేక సినిమాలకు ఘోస్ట్ దర్శకుడిగా కూడా పనిచేసాడు.
తర్వాత 1967 మనోజ్ కుమార్ రూపొందించిన ‘ఉప్కార్’ సినిమాను ఆయన ‘16 వేల అడుగుల జాతీయ జెండా’ గా అభివర్ణించాడు. ధర్మేంద్ర తో కలిసి మొదలయిన ఆయన జీవితంలో ధర్మేంద్ర తో కలిసి అనేక సినిమాల్లో నటించాడు. ఆయన నటించిన పూరబ్ అవుర్ పశ్చిం, షోర్, రోటీ కపడా అవుర్ మకాన్, క్రాంతి లాంటి సినిమాలు మంచి పేరు ప్రతిష్టల్ని తెచ్చి పెట్టాయి. కానీ మంగల్పాండే నుంచి మొదలు గాంధీ వరకు జీవిత చరిత్రల్ని కలిపి ‘భారత్ కే షహీద్’ పేర సీరియల్ తీసేందుకు ఆయన చేసిన ప్రయత్నం వివిధ కారణాల వలన సాధ్యం కాలేదు. అంతేకాకుండా 1999లో దేశభక్తి కథాంశం తో ‘జై హింద్’ పేర తాను తీయ దలుచుకున్న సినిమా నిర్మాణం సుదీర్ఘంగా సాగి విఫలం చెందింది. మనోజ్ కుమార్ తన అనేక సినిమాల్లో భూమిపుత్రుడు గానూ, పాశ్చాత్య విలువల వ్యతిరేకిగానూ, దేశభక్తిని బోధించే కళాకారుడిగానూ వివిధ పాత్రల్ని పోషించాడు.
ఆయన కృషికి గుర్తింపుగా ఫిలిం ఫేర్ జీవనసాఫల్య (లైఫ్ టయిం అచీవ్మెంట్)పురస్కారాన్నీ, కేంద్రప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని, పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. అవే కాకుండా పలు సినిమాలు ఉత్తమ రచయిత లాంటి అనేక అవార్డులు అందుకున్నారు.
అట్లా మనోజ్ కుమార్ తన స్క్రీన్ పాత్రల ద్వారా దేశభక్తిని ప్రభోదించారు. భరత్ పాత్రకు ప్రతినిధి గా విజయం సాదించారు. దేశం 75 సంవత్సారాల ఉత్సవాలు జరుపున్న సందర్భంగా మనోజ్ కుమార్ కృషిని పునర్ మూల్యాంకనం చేయాల్సిన ఆవసరం వుంది.

27 ఆగస్ట్ 2022
(స్వాతంత్ర స్వర్ణోత్సవాల సందర్భంగా రాసిన సిరీస్ లో మూడవది)

'24  ఫ్రేమ్స్’ అనే నేను ఓ దేశభక్తి చిత్రాన్ని