Month: August 2017

IRANIAN CHILDREN’S CINEMA (ARTICLE)

Posted on

ARTICLE PUBLISHED TODAY IN ‘NAVA TELANGANA’ DAILY

f25b5a54-8922-4b8f-8cf8-3f4914b82062 05e820e0-efd3-4731-b559-34d8be7214f1

విషాదపు తెర (POEM)

Posted on

city-of-sorrow-dani-caccs

విషాదపు తెర

 

లోపలి విషాదపు తెరేదో

అప్పుడప్పుడూ బయట పడుతుంది

 

కన్నీటి పొరలాగో

పంటి కింద నలిగిన పెదవి లాగో

దాన్ని బయటకు పంపించలేను

లోపల అదిమి పెట్టుకోనూ లేను

 

చిక్కటి చలిలా ఆదేమో

దేహామంతా పాకుతుంది

 

లోపల అలజడి లేపుతూ

బయటేమో  నిశ్శబ్దాన్ని  ఆచ్ఛాదన చేసుకుంటుంది

 

రంగులన్నీ కలగలసి పోయి

విషాదం కాన్వాసు పై శూన్యం మిగిలిపోతుంది

 

శూన్యంలో విషాదం

విషాదంలో  శూన్యం

చెమ్మా చెక్కా ఆడతాయి

 

-వారాల ఆనంద్

రాత్రి (POEM)

Posted on Updated on

రాత్రి

111111

 

రాత్రి ఎక్కడ మొదలవుతుంది

ఆకాశంలోనా భూమ్మీదా

దాని పయనం ఎక్కడినుండి ఎక్కడిదాకా

సవ్యమా అపసవ్యమా

 

చీకటీ, నిశ్శబ్దం

భయం,ఒంటరితనం

రాత్రి ఓ బహుముఖి

 

చీకటి

కళ్ళల్లో మొదలై

చేతులకు చూపొచ్చి

అనువణువునూ తడుముతుంది

 

నిశ్శబ్దం

వినికిడిలో మొదలై

దేహామంతా చేరుతుంది

 

భయం గుండెల్లో పుట్టి

గూడంతా పాకుతుంది

 

ఒంటరితనం లోపలా బయటా

మేఘంలా కమ్ముకుంటుంది

 

ఘనీభవించిన రాత్రి

నిర్దయగా లోకాన్ని

నిశ్చలనం చేస్తుంది

 

వెలుతురు చినుకులో

కరిగిపోయే రాత్రి

ఓ బహురూపి

 

లోకానికి ఏం నేర్పుతుందో కానీ

నాలోపలి నన్ను తట్టి లేపుతుంది

నాలో ఆత్మ శోధనను నాటుతుంది

-వారాల ఆనంద్

 

పైడి జయ రాజ్

Posted on

 

1b

 

వ్యాపారం లోనూ, వ్యవహారంలోనూ అందె వేసిన తెలుగు సినిమా రంగం ఆర్థిక మయిన విజయాల్ని మాత్రమే పరిగణన లోనికి తీసుకునే ఆ రంగం కళాత్మకతను అర్థవంతమయిన ధోరణిని ఎప్పుడో మర్చిపోయింది. అంతే కాదు ఒక ప్రాంతం నుండి ఎదిగి వచ్చిన వారిని నిర్లక్ష్యం చేయడం విస్మరించడంతెలుగు సినిమాకు పరిపాటిగా మారింది. అలా ఇప్పటికీ తెలుగు సినిమా రంగం స్మరించుకోని తెలంగాణా సినీ తేజం పైడి జైరాజ్. హిందీ సినిమా రంగం భూమికగా ఎదిగి దేశవ్యాప్తంగా పేరు గడించి 70ఏళ్ల పాటు సినిమా రంగంలో వెలుగొందిన గొప్ప నటుడాయన. 1931 ఆలం ఆరా తో భారతీయ సినిమా రంగం మాటలు నేర్వకముందే మూకీ యుగంలోనే భారతీయ సినిమా రంగంలో తన ముద్రను నిలిపిన పైడి జై రాజ్ తెలంగాణ వాడు కావడంతో నేటికీ తెలుగు సినిమా రంగం ఆయనను అంగీకరించడానికి ఆమోదించడానికీ సిద్దంగా లేక పోవడం తెలుగు సినిమా లోకంలోని డొల్ల తనాన్ని తెలియజేస్తున్నది. అత్యంత ప్రతిష్టాకరమయిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ను 1980 లోనే అందుకొని టవరింగ్ పర్సనాలిటీగా నిలిచిన జైరాజ్ నటుడిగానే కాదు దర్శకుడిగా, నిర్మాతగా కూడా సినిమా రంగంలో కృషి చేసాడు. జైరాజ్ 11 మూకీ సినిమాల్లో, 156 టాకీ సినిమాల్లో హెరోగానూ ఇంకా అనేక సినిమాల్లో కారెక్టర్ ఆర్టిస్టు గానూ నటించారు. దర్శకుడిగా 1945లో ప్రతిమ, 1951 లో సాగర్, 1959లో రాజ్ ఘర్ సినిమాలకు దర్శకత్వ భాద్యతలు కూడా నిర్వహించాడు.  నిర్మాతగా పి.జె.ఫిల్మ్ యూనిట్ బానర్ మీద నర్గీస్ కథానాయికగా సాగర్ సినిమాని నిర్మించాడు. హిందీ,ఉర్దు, గుజరాతీ,మరాఠీ భాషల్లో నటించిన జైరాజ్ ఉత్తర భారత దేశంలో ప్రసిద్ది పొందిన నటుడు. కేవలం సినిమానే కాకుండా ఆయన 1990 లో ‘ఖూన్ భారీ మాంగ్’  టీ వీ సీరియల్ లోకూడా నటించాడు.

తెలుగులో సుప్రసిద్ద నటుడు చిత్తోరు నాగయ్య తో కలిసి ఒక తెలుగు సినిమాను నిర్మించడానికి ప్రణాళికలు వేసుకున్న పైడి జైరాజ్ నాగయ్య మరణంతో ఆ ప్రాజెక్ట్ ను చేయలేక పోయానని చెపుకున్నారు.

ఏడు దశాబ్దాలపాటు సినీ రంగంలో వుంది మూడు తరాల నటీ నటుల్తోనూ మూకీ,టాకీ సినిమాలతో పాటు టీవీ ల్లో కూడా నటించి దేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గడించిన తెలంగాణ బిడ్డను తెలుగు సినిమా రంగం ఏనాడూ కనీసం స్మరించను కూడా లేదు. దానికి వాళ్ళు జైరాజ్ తెలుగు లో నటించలేదు కదా, బాంబే వెళ్లిపోయాడు కదా అని సన్నాయి నొక్కులు నొక్కుతారు. వాత్సవానికి ప్రముఖ తెలుగు నటుడు,నిర్మాత,దర్శకుడు ఎల్.వి.ప్రసాద్ కూడా తన సినీ ప్రస్థానాన్ని బాంబేలోనే ప్రారంభించాడు మరి.

కానీ పైడి జైరాజ్ బాంబే వెళ్లడానికి గల నేపథ్యాన్ని తెలుగు సినిమా రంగం ఎప్పుడూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు. తాను పుట్టిన కరీంనగర్, పెరిగిన హైదరబాద్ నిజాం రాజ్యం కావడం ఫలితంగా హిందీ ఉర్దూల్లో జైరాజ్ కు మంచి ప్రావీణ్యం, ప్రతిభ వుండడం ఆయన బొంబే వెళ్లడానికి ప్రధాన కారణం. అప్పటికి నైజాం ప్రాంతంలో బాంబే  సినిమాల ప్రభావం అమితంగా  వుండడం కూడా మరొక ప్రధాన  కారణంగా కనిపిస్తాయి. అంతేకాదు 1928లో తన 19వ ఏట జైరాజ్ బొంబే చేరుకున్నాడు. అప్పటికి తెలుగు సినిమా ఊపిరి తీసుకోలేదు. మూకీ సినిమాలకు మద్రాస్ కేంద్రంగా కనిపిస్తున్నప్పటికీ భక్తప్రహ్లాద వచ్చింతర్వాతగాని తెలుగు సినిమాకు ఉనికి గుర్తింపు కలుగలేదు.   మూకీ సినిమాల కాలంలో మొదట తమిళ్, తెలుగు, మలయాళం లల్లో దాదాపు సమాంతరంగా సినిమాలు వెలువడ్డాయి కానీ పైడి జైరాజ్కు అప్పటికే 1929లో మావరెర్కర్ అనే నిర్మాత తన సినిమాలో అవకాశం కలిగించాడు. అలా మొదలయిన జైరాజ్ ప్రస్థానం అప్రతిహతంగా సాగింది. 11 మూకీ సినిమాల్లో నటించిన జైరాజ్ మంచ్ శారీరక సౌష్టవం గంబీరమయిన మాట సరళి తో తొలి రోజుల్లోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. భారతీయ సినిమా రంగంలో మొట్టమొదటి సారి గుర్రం పై స్వారీ చేసి నటించిన నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. అప్పటికి బాంబే లో పృథ్వీ రాజ్ కపూర్ లాంటి నటుల హవా వున్నప్పటికీ తెలంగాణ నుంచి వెళ్ళి తన స్థానాన్ని పదిల పర్చుకోవడమే కాకుండా అప్పటికె లబ్ద ప్రతిష్తులయిన అనేక మంది  నటీమణులతో హీరో గా నటించి నిలదొక్కుకున్నాడు జైరాజ్.   

        1931లో టాకీలు మొదలయిన కాలంలో నటీనటులు తమ పాటల్ని తామే పాడుకునే పద్దతి వుండేది కానీ జైరాజ్  స్వయంగా పాట పడుకోలేక పోవడం తో చాలా మంది మూకీ కాలపు నటులతో పాటు తొలుత కొంత ఇబందుల్ని ఎదుర్కొన్నాడు కానీ క్రమంగా నిలదొక్కుకున్నాడు. దానికి ఆయన స్పురద్రూపం, డయలాగ్ పలకడంలోని ప్రౌడత్వం ఉపయోగ పడ్డాయి.

       సుప్రసిద్ద కవి భారత కోకిల సరోజినీ నాయుడు భర్త గోవిందరాజులు నాయిడు కు మేనల్లుడు అవుతారు.జయ రాజ్ కు ఇద్దరు అన్నలు. ఒకరు సుందర్ రాజ్ నాయుడు, దీన్ దయాళ్ నాయుడు. సెప్టెంబర్ 28 1909 లో కరీంనగర్లో జన్మించిన జైరాజ్ హైదరాబాద్ నిజాం కాలేజీలో చదివి సినిమాలపై మోజుతో 1928 లో ముంబాయి చేరుకున్నారు. తన ఇరవైయ్యోయేట 1930 లో తొలిసారిగా ” స్పార్క్లింగ్ యూత్ ” అనే మూకీ చిత్రంలో నటించారు. అదే సంవత్సరంలో ” ట్రయంఫ్ ఆఫ్ లవ్ ” అనే చిత్రంలో కథానాయకునిగా నటించారు. జైరాజ్ మొత్తం 11 మూకీ చిత్రాల్లో నటించారు. 1931 లో ప్రారంభమైన టాకీ యుగంలో ఆయన ” షికారి ” ఉర్దూ చిత్రంతో టాకీల్లో ప్రవేశించారు. తర్వాత కాలంలో శాంతారాం, పృధ్వీరాజ్ కపూర్ లాంటి వాళ్ళు హీరోలుగా వెలుగుతున్న కాలంలో తాను కూడా పెద్ద హీరోగానే  పేరు తెచ్చుకున్నారు. నిరుపారాయ్, శశికళ, దేవికారాణిమీనాకుమారి లాంటి హీరోయిన్ ల సరసన నటించారు.

    ‘మూకీ’ సినిమా రోజులలో 11 సినిమాలలో, తరువాత సుమారు 156 ‘టాకీ’ సినిమాలలో కథానాయకుడిగా, విలక్షణమైన నటుడిగా పలు వైవిధ్యమైన పాత్రలు పోషించారు. హీరో పాత్రలతో పాటు అనేక వైవిధ్యమయిన పాత్రలు పోషించిన జైరాజ్ తాను మాత్రం దేశ నాయకుల పాత్రలు, చారిత్రక పాత్రలు ఎంతో ఉత్సాహాన్నీ సంతృప్తిని కలిగించాయని చెప్పుకున్నారు. జైరాజ్ పోషించిన టిప్పు సుల్తాన్పృథ్వీరాజ్ చౌహాన్రాణా ప్రతాప్ మొదలైన చారిత్రక సంబంధ పాత్రలు విశిష్టమైనవి. షాహిద్ ఏ ఆజమ్ లో ఆయన పోషించిన చంద్రశేఖర్ ఆజాద్ పాత్ర విలక్షణమయింది.

అలా భారతీయ సినీ రంగంలో కరీంనగర్ కు తెలంగాణకు విశిష్టమయిన స్థానాన్ని గుర్తింపును తెచ్చిన పైడి జై రాజ్ భార్య సావిత్రి పంజాబీ. వారి పెళ్లి ని పృథ్వీ రాజ్ కపూర్ తండ్రి జరిపించాడని చెబుతారు ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కూతుళ్ళు.

2000 సంవత్సరం ఆగస్ట్ 11న ఆయన పరమ పాడించారు. తెలంగాణ రాష్ట్రం తన నెల తల్లి బిడ్డ అయిన పైడి జైరాజ్ ను స్మరించుకుంటున్నది. ప్రభుత్వం కూడా ఆయన పేర జాతీయ స్థాయిలో అవార్డును నెలకొల్పేందుకు పూనుకున్నట్టు తెలిసి తెలంగాణా వాదులు తెలంగాణలో సినిమా అభివృధ్ధిని కాంక్షిస్తున్న వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.   

ఆగస్ట్ 11 ఆయన వర్ధంతి

“డియర్ జిందగీ”

Posted on

మానసిక సంఘర్షనాత్మక సినిమా

వర్తమాన సంక్షోభ, సంక్లిష్ట సమాజంలో అదీ మహానగర సమాజంలో వుత్పన్నమవుతున్న మానసిక వేదనలనూ , ఆందోళనలనూ వాటి పర్యవసానాలనూ ఆవిష్కరించిన సినిమా ‘డియర్ జిందగీ’. ఇంగ్లీష్-వింగ్లీష్ సినిమా తో మంచి పెరునూ గౌరవాన్నీ  పొందిన గౌరి షిండే రూపొందించిన  రెనడవ చిత్రం డియర్ జిందగీ. ఇదికూడా స్త్రీ పాత్ర ముఖ్యాభినేతగా రూపొందించిందే. ముంబై లాంటి మహానగరంలో వర్తమాన

సినిమాటోగ్రాఫర్గా ఎదగాలనుకుంటున్న కైరా తన జీవితంలో ఎదుర్కొన్న మానసిక వొత్తిడితో  పడ్డ సంగర్షణ , ఫలితంగా రూపొందిన ఆమె వ్యక్తిత్వం ఈ సినిమాలో ప్రధాన అంశం. చిన్న సినిమాలు ఆడ్ ఫిల్ములూ షూట్ చేస్తూ పూర్తి నిడివిగల సినిమా అవకాశం  కోసం ఎదురుచూస్తున్న కైరా తన అస్థిరమయిన మానసిక స్థితి, ఫీలవుతున్న అభద్రత ఆమె ను ఒక చోట వుండనీయవు. అపనమ్మకం ఆమెను నీడల వెంటాడుతూ వుంటుంది. ఆ స్థితిలో అనేక మండది  బాయ్ ఫ్రెండ్స్, ఒకరినుంచి ఒకరికి షిఫ్ట్ అవడం ఆధునిక నగర వాతావరణంలోని సమస్త స్థితినీ  ఆమె ఎదుర్కొంటూ వుంటుంది. ఆ స్థితినుండీ మామూలు స్థితికి వచ్చే క్రమమే ఈ సినిమా. ఇందులో కైరా గా ఆలియా భట్ చాలా సహజమయిన నటనను ప్రదర్శించింది. ఇప్పటి నటీమణుల్లో అలియా భట్ డి విశిష్ట స్థానమని ఈ సినిమా మరోసారి నిరూపిస్తుంది. ఇక దిమాఖ్ డాక్టరుగా షా రూఖ్ ఖాన్ లో ప్రొఫైల్ లో ఆయన ఇమేజ్ కు భిన్నంగా హుందాగా నటించాడు.

సామాజిక సంఘర్షణలే  కాకుండా చిన్న నాడు ఆమె తల్లిదండ్రులు ఆమె పట్ల ప్రవర్తించిన తీయు కూడా కైరా జీవితం పై పడుతుంది. అన్నీ వొత్తిడులనుండీ బయటపడి సంపూర్ణ వ్యక్తిగా మరే క్రమమే ఈ సినిమా.

కథ విషయానికి వస్తే కైరా సినిమాటోగ్రాఫర్ గా ఎదగాలనీ ఎప్పటికయినా తనను తాను నిరూపించుకోవాలని కళలు కంటూ కష్టపడే యువతి. చిన్న ఆడ్స్ తీస్తూ నిలదొక్కుకునే క్రమంలో వుంటుంది. అనేక మండి మిత్రులౌ తారస పడతారు. రెస్టారెంట్ ఓనర్ సిద్ తో స్నేహం కుదురుతుంది. తర్వాత షూటింగులో భాగంగా రఘువేంద్ర తో పరిచయం చాలా దూరం పోతుంది. రఘువేంద్ర కు అమెరికాలో పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది ఆ సినిమాకు కైరా పూర్హ్తి స్థాయి సినిమాటోగ్రాఫర్ గా వుంటుదని హామీ ఇస్తాడు. ఆమె ఆథన్నుంచు జీవితాని కోరుకుంటుంది కానీ రఘువేంద్రకు మరొకరితో ఎంగేజ్మెంట్ అవుతుంది. అది తెలిసి కైరా తీవ్ర నిరాశకు గురవుతుంది. రఘువేంద్ర తో అఫైర్ తెలిసి సిద్ ఆమెనుంచు పక్కకు జరుగుతాడు. ఇంతలో ముంబై లో ఇంటిఔనర్ ఇల్లు ఖాళీ చేయమంతాడు. గోవాలో వున్న తల్లిదంరులు అక్కడికి రమ్మంతారు తప్పని స్థితిలో ఆమె గోవాకు షిఫ్ట్ అవుతుంది. సిద్, రఘువేంద్ర ల విషయం తో ఆమె లో అస్థిరత మరింత పెరుగుతుంది. ఆమెకు మాన్సిక సాంత్వన కలిగేందుకు సైకాలజిస్ట్- దిమాఖ్ డా డాక్టర్ ను కలవమని మిత్రులు చెబుతారు. అలాంటి థెరపిస్ట్ వుంటాడా అని ఆమె ఆశ్చర్యపోతుంది. గోవాలో తల్లిదండ్రులు పెళ్లి సంభాదులు చూద్దాం మొదలు పెడతారు. కానీ కైరా దిమాఖ్ కా డాక్టర్ జహాంగీర్(షారూఖ్ ఖాన్) ను కలుస్తుంది. ఇక అక్కడినుండి ఆ  ఇద్దరి నడుమా కొనసాగే అనేక థెరపీ సిట్టింగులు ఆమె అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ పోతాయి.

‘మేధావి అంటే అన్నీ ప్రశ్నలకూ సమాధానాలు  తెలిసినవాడు  కాదు, జవాబు వరకు చేరే ఓపిక వున్నవాడు’  అని డాక్టర్ జహాంగీర్ కైరా కు చెబుతాడు. ఓపికగా నీ మనసులోని అన్నీ విషయాలూ బయటపెట్టు అవే నీకు సమాధానాలు చెబుతాయి అంటాడు. అంతే కాదు ఒక నాటి సిట్టింగులో సముద్రపు ఒడ్డుకు తీసుకెళ్లి తన చిన్నప్పుడు తరుచుగా తండ్రి  సముద్రం తో కబడ్డీ ఆడటానికి  ఇక్కడకు తీసుకొచ్చేవాడని చెబుతాడు. ముందుకొస్తున్న అలల తో కబడ్డీ ఆడడం కైరాకు గొప్ప ఆనందాన్ని ఇస్తుంది.

ఇక మరో సారి సైకిల్ రెపైర్ చేస్తున్న జహాంగీర్ ను చూసి ఏమిటి మీరు రెపైర్ కూడా చేస్తారా అంటుంది సైరా. రెపైర్ కాకుంటే సైకిల్ ను రీసైకిల్ చేస్తానంతాడు జహాంగీర్. కిలకిలా నవ్విన కైరా నా దిమాఖ్ కూడా రెపైర్ కాకుంటే దాన్ని కూడా రీసైకిల్ చేస్తారా అంటుంది. ఇట్లా అంకె సందర్భాల్లో కొటేషన్ల లాంటి డైలాగ్ లతో సినిమా ముందుకు సాగుతుంది. కైరా లో ఆందోళనలకూ అస్థిరత్వనికీ ఆమె చిన్నప్పుడు తల్లిదండ్రులు ఆమెను తాత దగ్గర వదిలేసి అమెరికా వెళ్లిపోవడం, ఆమెను సరిగ్గా పట్టించుకొక పోవడం లాంటి సంఘటనలు ఆమె మనస్సు పై తీవ్ర ప్రభావాన్ని చూపించిన విషయం జహాంగీర్ తెలుసుకొని వివరిస్తాడు. ఆమె క్రమంగా తనలోపలి భయాలు అందరూ దూరమవుతారనే ఆందోళననుంచి క్రమంగా బయటపడుతుంది. తల్లిదండ్రులను ప్రేమించడంతో పాటు ఇతరుల పట్ల వుండే సాహానుభూతే మనిషికి స్వాంతన అని తెలుసుకుంటుంది.

డాక్టర్ జహాంగీర్ పట్ల ప్రేమను వ్యక్తం చేస్తుంది కైరా కానీ తనకూ కైరాకూ మధ్య వున్నది కేవలం థెరపిస్ట్ సంభండమే తప్ప మరెడీ లేదని. సున్నితంగా తిరస్కరించి అధ్భూతమయిన భవిష్యత్తులోకి పయనిచమంటాడు జహాంగీర్. గొప్ప ఆశాహమయిన నోట్ తో సినిమా ముగుస్తుంది. అలియా భట్ షా రూఖ్ ఖాన్ లు వారి సంభాషణ ఆకట్టుకుంటాయి. ఇద్దరూ పరిపక్వమయిన నటనను ప్రదర్శించారు.

అతి తక్కువ బడ్జెట్ తో రూపొందించబడి మంచి విజయాన్ని సాధించిన “ డియర్ జిందగీ’ మహిళా సినిమానే కాకుండా మానసిక సంఘర్షణ లాంటి అనేక సమస్యల్ని చర్చిస్తుంది. సంగీతం, ఫోటోగ్రఫి బాగుంటాయి.

“డియర్ జిందగీ “ రచనా దర్శకత్వం: గౌరీ షిండే, రెడ్ చిల్లీస్ నిర్మాణం.

(PUBLISHED IN “KAARMIKA VAAHINI, LIC MAGAZINE, JULY 2017)