Month: July 2018

GULZAR- Article by Varala Anand

Posted on Updated on

‘బాబూమొషై జిందగీ బడీ హోని చాహీయే, లంబీ నహి ‘ ,

 ‘జబ్ తక్ జిందా హూ తబ్ తక్ మరా నహీ, జబ్  మర్ గయా సాలా మై హీ నహీ’.

‘మౌత్ తో ఏక పల్ హయ్,

( జీవతం ఉన్నత మైంది కావాలి, కాని దీర్ఘమయింది కాదు, బతికి ఉన్నంతవరకూ చావలేదు, చచ్చింతర్వాత నేనే లేను, మరణం ఒక క్షణమే).

ఇలాంటి తాత్విక సజీవమయిన సంభాషణలు ఆనంద్ సినిమాలోవి. అవి రాసిన వాడు గుల్జార్. అట్లా కేవలం సంభాషణలే కాదు, గుల్జార్ గొప్ప కవి, సినీ గేయ రచయిత, రచయిత, సినీ దర్శకుడు కూడా. బహుముఖీన కార్యశీలి, ప్రతిభావంతుడు, భావుకుడ కూడా. గుల్జార్ రచనలు, సినిమాలు, గజల్స్  అన్నీ సృజనాత్మకంగానూ తాత్వికంగానూ వుండి ఆయనలోని సున్నితత్వాన్ని సరలత్వాన్ని ఆవిష్కరిస్తాయి. ఆయన కవిత చదివే పద్ధతి కూడా శ్రోతల్ని అమితంగా ఆకట్టుకుంటుంది. ఇట్లా పలు రంగాల్లో తన ముద్రను చాటుకున్న గుల్జార్ అనువాదం లోకూడా ఉన్నతమయిన కృషి చేసాడు చేస్తున్నాడు. ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, పంజాబీ, బెంగాలి భాషల్లో ప్రావీణ్యమున్న గుల్జార్ దేశంలోని ఇతర భాషల రచనల్ని చదవడానికీ ఇష్టపడుతాడు. ‘ మన మెదడు అన్టన్నే(antenne) ను తెరిచి వుందాలి అప్పుడే ఇతర ప్రాంతాల్లో ఇతర భాషల్లో ఏమి జరుగుతుందో తెలిసి వస్తుంది’ అంటాడు గుల్జార్.  అట్లా భాషల్లో, సాంస్కృతిక ప్రక్రియల్లో నిరంతర కృషి కోన సాగిస్తున్న గుల్జార్ ఒక లివింగ్ లెజెండ్. దర్శకుడిగా హిందీ చలన చిత్ర సీమలో తన ముద్రను చాటుకున్నవాడు  గుల్జార్

    గుల్జార్ గా అందరికీ పరిచయమున్న ఆయన అసలు పేరు సంపూరన్ సింగ్ కల్రా. ఆగస్ట్ 18,1936 రోజున ప్రస్తుతం పాకిస్తాన్ లో వున్న దీన పట్టణంలో సిక్కు కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పటినుంచీ అంతాక్షరీ ఆడడంలో ఆసక్తిగా వుండే ఆయన అప్పటినుండే భాష పట్ల పదాల పట్ల మక్కువను పెంచుకున్నాడు. చిన్నప్పటినుండే హిందుస్తానీ సంగీతం పట్ల మక్కువ కలిగిన గుల్జార్ రవిశంకర్, అలీ అక్బర్ ఖాన్ ల కచేరీలకు వెళ్ళేవాడు.  గుల్జార్ కుటుంబం దేశ విభజనలో తీవ్రంగా ప్రభావితమయింది. సొంతవూరు విడిచి అమృత్సర్ కి వలస వచ్చింది. తమ కుటుంబ వ్యాపారమయిన మెకానిక్ షాప్లో పనిచేయడంతో గుల్జార్ ద్జీవితం ఆరంభమయింది. తన పదమూడేళ్ళ వయస్సులోనే చదవడం పైన ఆసక్తి కలిగిన గుల్జార్ పుస్తకాలు కిరాయికిచ్చే షాప్ నుండి అపరద్ధ పరిశోదక నవలలు, మాజిక్ ఫాంటసీ రచనల్ని చదవడం ఆరంభించాడు. వారానికి ఇంత అని రుసుము చెల్లిస్తే ఎన్ని పుస్తకలయినా చదివే వీలుండేది అక్కడ. దాంతో తమ షాప్ పని అయిపోగానే రోజుకు ఒకటి అని కాకుండా రెండు మూడు పుఇస్థకాలు చావడం చేసేవాడు గుల్జార్. ఒక నాటికి షాప్ లోని దాదాపు పుస్తకాలు అయిపోఅడంతో షాపతను ఇట్లా ఎన్ని చదువుతావు అంటూ సజ్జ మీదవున్న పుస్తకమొకటి తీసి ఇచ్చాడు. ఆడు టాగోర్ రాసిన ‘ గార్డనర్’. అది చదివింతర్వాత గుల్జార్లో చదివే దృక్పథమే మారిపోయింది. తర్వాత ప్రేంచంద్ నుంచి మొదలు అనేక మంది గొప్ప రచయితల రచనలు చదవడం మొదలుపెట్టాడు. అప్పుడే గుల్జార్కి ప్రగతిశీల రచయితల క్లాలకారులతో పరిచయం కలగడం PWA కార్యక్రమాలల్లో పాల్గొనడం మొదలయింది. దాంతోపాటు ఆయనకు సినిమాల పట్ల ఆసక్తి కలగడం ఆరంభమయింది. అప్పుడే శైలేంద్ర పరిచయం అయ్యాడు. బిమల్ రాయ్ బందిని సినిమా తీయడం మొదలు పెట్టాడు ఇంతలో కవి శైలందర్ కు, సంగీత దర్శకుడు ఎస్,డి,బర్మన్ కు నడుమ ఎదో పొరపొచ్చాలు రావడంతో ఆయన గుల్జార్ను వెళ్లి బిమల్డను కలవమని సూచించాడు. బిమల్ రాయ్ ప్రోత్సాహంతో గుల్జార్ తన మొట్ట మొదటి సినిమా పాట ‘మేర గోరా అంగ లయిలే..” తో  ఆరంభమయింది. అయితే బిమల్ డా ఒక కండీషన్ పెట్టాడు. ఇక ముందు తన మెకానిక్ షాప్ కు వెళ్ళకుండా రచనల పైన దృష్టి పెట్టాలని దాంతో గుల్జార్ పూర్తి స్థాయిలో సృజన మీదే దృష్టి కేంద్రీకరించాడు. బిమల్ దాకి పూర్తి స్థాయి  సహాయకుడిగా ఉండిపోయాడు. తర్వాత హ్రిషికేశ్ ముఖర్జీ, అసిత్ సేన్ లాంటి దర్శకుల సినిమాలకు రచనలు చేయడం ఆరంభించాడు. అట్లా గుల్జార్ ఆనంద్(1970 ), గుడ్డీ(1971), బావర్చి(197 2 ), నమక్ హరం(1973 ), హ్రిషికేశ్ ముఖర్జీకి, దో దూని చార్ (1968), ఖామోషి(1969) , సఫర్(1970) అసిత్ సేన్ కు సంభాషణలు రాసాడు.

          ఇక తర్వాత 1971 లో ‘మేరె అప్నే) సినిమాతో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టాడు గుల్జార్. జీతెంద్ర ప్రధాన పాత్రధారిగా 1972లో ‘పరిచై) తీసాడు. 1972 లో అయన తీసియన్ ‘కోషిష్’  అత్యంత సున్నితమయిన మానవీయ దృక్పధంతో తీసిన సినిమా గా మిగిలి పోయింది. సంజీవ్ కుమార్, జయాభాధురి ప్రధాన భూమికల్ని పోషించిన కోషిష్ లో ఇద్దరు మూగ చెవిటి వాళ్ళ జీవితం దాంట్లో వారు ఎదుర్కొన్న అవస్థలు హృద్యగంగా చూపిస్తాడు గుల్జార్. అందులో సంజీవ్కుమార్, జయబాధురి లు అత్యంత సహజంగా నటించారు. అట్లా సంజీవ్కుమార్ తో మొదదలయిన సహచర్యం అనేక సినిమాల్ నిర్మాణానికి దోహదపడింది. వారి కయికలో వచ్చిన ‘ ఆంధీ’, మౌసం, అంగూర్ , నమ్కీన్ సినిమాలు ఒక కల్ట్ సినిమాలుగా మిగిలిపోయాయి. సంజీవ్ కుమార్ నట జీవితంలో అత్యంత సహజ నటుడిగా పేరు తెచ్చిన సినిమాలివి. ఇక గుల్జార్  జీతేంద్ర తో పరిచై, ఖుష్బూ,కినారా, వినోద్ ఖన్నా తో అచానక్, మీరా, లేకిన్, హేమామాలిని తో ఖుష్బూ, కినారా, మీరా  లాంటి మంచి సినిమాలు రూపొందించాడు. ఇంకా దర్శకుడిగా గుల్జార్ కితాబ్, పల్కొంకీ చావ మే, శాహీరా, చత్రన్, సునేయే,ఆల్కా,ఇజాజత్,లిబాస్,మాచిస్,హు టు టు లాంటి సినిమాలు రూపొందించాడు.

   ఇక టెలివిజన్  రంగంలో ఆయన తీసిన సీరియల్స్ రచయితగా, దర్శకుడిగా ఆయనలోని సున్నితత్వం ప్రతిభ విశేషంగా పేరు గడించింది. ఆయన రూపొందించిన ‘ మిర్జా గాలిబ్’ సీరియల్ aa మహాకవి కవిత్వాన్ని జీవితాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. అందులో గాలిబ్ గా  నసీరుద్దిన్ షా, గాయకుడిగా జగ్ జీత్ సింగ్ లో తమ అద్భుత ప్రదర్శనను అందించారు. వారి ప్రతిభను ఆవిష్కరించడంలో గుల్జార్ భావుకత, నిబద్దత పప్రధాన భూమికను పోషించాయి.

ఇక గేయ రచయితగా గుల్జార్ 100 పైగా సినిమాలకు పాటలు రాసాడు. అలనాటి బందిని తో మొదలయిన ఆయన ప్రస్తానం సలిల్ చౌదరి, ఎస్. డి.బర్మన్, ఆర్.డి.బర్మన్, మదన్మోహన్, విశాల్ భరద్వాజ్, ఎ.ఆర్. రెహమాన్ లాంటి ప్రాచీన ఆధునిక సంగీతకారులతో అవిశ్రాంతంగా సాగింది. అలనాటి మెలోడీ పాటలు గొప్పగా రాసిన గుల్జార్ ‘కజరారే..’ ( బంటీ ఆర్ బబ్లూ), చయ్య చయ్య చయ్యా….(దిల్ సే ) లాంటి ఆధునిక పాటల్ని కూడా రాసాడు. ఇవ్వాళ మెలొడీకి స్థానం లేదని బీట్ కె ప్రధాన పాత్ర అని ఆయన అంటారు. కాలానుగుణంగా సినిమాలు రచనలు వస్తాయని ఆయన అభిప్రాయ పడతారు. ఏ.ఆర్.రెహమాన్ తో కలిసి ‘జై హో..  ‘ పాటకు గుల్జార్ ఆస్కార్ అవార్డును అనుడ్కున్నారు. అంతే కాదు ఈ జంట గ్రామ్మీ అవార్డును కూడా అందుకుంది.

అయన 1973 లో ప్రముఖ నటి రాఖీ ని వివాహం చేసుకున్నారు తర్వాత కొంత కాలానికి వేరై వేరుగా వుంటున్నారు వారి కూతురు మేఘన గుల్జార్. ఆమె దర్శకురాలిగా ఫైల్హాల్, జస్ట్ మారీడ్, దస్  కహానియా, తల్వార్, రాజీ సినిమాలు రూపొందించారు. అంటే కాదు తన తండ్రి పైన ‘ బకాస్ హి ఈస్ ‘ పుస్తకం రాసారు.

  గుల్జ్జార్ బహుముఖీన ప్రతిభ లో ఆయన రాసిన రచనలు భారతీయ హింవి ఉర్దూ సాహిత్య రంగాల్లో విలక్షణతను విశేష ఖ్యాతిని పొందాయి ఆయన రవీంద్రనాథ్ రచనల్ని అనేకం అనువాదం చేసారు. గ్రీన్ పోయెమ్స్, సస్పెక్టే డ్ పోయెమ్స్, జిందగీ నామా, హాఫ్ ఎ రూపీ, సేలేక్తేడ్ పోయెమ్స్, 100 లిరిక్స్, మేరా కుచ్ సమ్మాన్, సైలేన్సేస్, టూ లాంటి ఎన్నో రచనలు విశేష ప్రశంశాల్ని అందుకున్నాయి.

గుల్జార్ పద్మభూషణ్, సాహిత్య అకాడెమి అవార్డు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు లు అందుకున్నారు.

-వారాల ఆనంద్

gulzar navatelangana

gulzar navatelangana 2

‘సౌపర్నిక’

Posted on

‘గజల్’  దాదాపు వేయ్యేల్లకు పైగా చరిత్ర కలిగింది. తెలుగు గజల్‌కు స్వర్ణోత్సవం దాటింది. గజల్‌ ప్రక్రియ అరబ్బీలో పుట్టి, ఫార్సీలో పెరిగి ఫార్సీ భాష మూలంగా మన దేశంలోకొచ్చింది. మన దేశానికి గజల్ ను పరిచయం చేసింది నాకు తెలిసి అమీర్ ఖుస్రో 13 వ శతాబ్దంలో.  గజల్‌ ఇస్లాంకు ముందే ఉన్న కవితా ప్రక్రియ గా చెప్పుకోవచ్చు. అరబీ భాషలో గజల్‌ పదానికి పూర్వరూపమైన ‘గజ్జాల్‌ అనే పదానికి లేడి, జింక అని అర్థముండేది. ఇరాన్‌ దేశపు రాగాలలో ఒక రాగానికి ఉన్న పేరు అది. గజల్‌ ‘కసీదా’ నుంచి విడివడి ఒక ప్రత్యేకమైన కవితా ప్రక్రియ రూపాంతరం చెందింది.

ఇవ్వాళ గజల్ అనగానే గాలిబ్, గుల్జార్, జావేద్ అక్తర్, జగ్జీత్ సింగ్ ల పేర్లు బాగా గుర్తొస్తాయి. ఇక తెలుగులో గజల్‌ పందొమ్మిది వందల అరవై ఆరులో వచ్చింది. దాశరథి వెలువరించిన ‘కవితాపుష్పకం’ కవితా సంకలనంలో తొలి తెలుగు గజల్‌ కామన :

‘వలపునై నీ హృదయ సీమల నిలువవలెనని ఉన్నది
పిలుపునై నీ అధర వీధుల పలుకవలెనని ఉన్నది’..

ఇట్లా సాగే  గజల్ ప్రక్రియలో కృషి చేస్తున్న  మిత్రుడు సూరారం శంకర్ వెలువరించిన ‘సౌపర్నిక’ ఇవ్వాళ ముట్టింది. దానికి ముందు మాటలో డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ కోట్ చేసిన షేర్

కలలు రాలితే ఎమిలే ‘కన్నీళ్లు వుంటాయి

గుండె పగిలితే ఎమిలే నీ గుర్తులుంటాయి ‘

ఇట్లా సాగిన సౌపర్నిక పూర్తిగా చదివి రాస్తాను. సూరారం శంకర్ గారికి అభినందనలు. పుస్తకం పంపినందుకు ధన్యవాదాలు

 

Untitled-1

‘దీప స్వగతం’ (Poem)

Posted on Updated on

దీప స్వగతం

———-

వెలుగును ఆర్పేసుకొని

నేను ‘కాలంచేసే’ సమయం

ఆసన్నమయింది

 

కాలం తీరినంక

ఎవరు మాత్రం ఏం చేస్తారు

తలవంచుకు నమస్కరించి

తరిలి పోవాల్సిందే

 

దుఃఖం లాంటి చీకటి

మిమ్మల్ని  కమ్మెసినప్పుడు

దాన్ని నా పాదాల కిందికి లాక్కున్నాను

 

ఎన్నో కాలాలపాటు

అనేకానేక కలల్ని మోసుకొచ్చి

మీముందు వెలుతురు భూముల్ని పరిచాను

 

దుక్కులు దున్నారో నాట్లే వేశారో

బీళ్లే మిగిల్చుకున్నారో

 

నేనేమిచ్చానో మేరేమి తీసుకున్నారో

అవసరానికే పంచానో

అవసరమయిందే  ఇచ్చానో

 

నామట్టుకు  నేనయితే

అవసరానికి మించే తీసుకున్నాను

భూమి పోరల్లోంచి

వెళ్ళు పీల్చేసినట్టు

 

నేను తిరిగివ్వగలిగిన దానికంటే

ఎక్కువే తీసుకున్నాను

 

తీసుకున్నదంతా తిరిగి ఇచ్చేందుకే

కాలిపోయాను

 

ఇచ్చిందీ పుచ్చుకున్నదీ

జమా లెక్క లేవరు కట్టాలి

 

పిలుపొచ్చింది మిత్రులారా

నాకిక సెలవియ్యండి

 

మీరేమో

మరో వెలుగు తీరం వైపు

కదిలి పొండి

dweepa swagatham- manam

అర్థవంతమయిన సినిమా ‘హిందీ మీడియం’

Posted on Updated on

అర్థవంతమయిన సినిమా ‘హిందీ మీడియం’     

      మాతృ భాష, మాతృ మూర్తి, మాతృ దేశం మానవ జీవితం లో గోప్ప భావనలు. వాటి గురించి అందరూ భావనత్మకమయిన అనుభందాన్ని కలిగివుంటారు. కాని ప్రపంచీకరణ నేపధ్యంలో మారిన పరిస్థితులు, పెరిగిన అనారోగ్యక్రమయిన పోటీ పరిస్థితుల్లో విద్య విషయంలో దాదాపు అందరూ ఆంగ్ల మాద్యం వైపునకే మొగ్గు చూపుతున్నారు. నిజానికి అనేక విద్యా విషయ మేధావులు పరిశోదనలు చెబుతున్న దాని ప్రకారం విద్య ముఖ్యంగా పాఠశాల స్థాయి విద్య మాతృ భాషలో అందించగలిగినప్పుడే విద్యార్థులు సహజంగా ఎదుగుతారని, నేర్చుకుంటారని నిరూపితమయింది. కాని పోటీ తత్వం తో పాటు తల్లిదండ్రుల్లో పెరిగిన ఆశలు అంచనాల నేపధ్యంలో తమ పిల్లల్ని ప్రైవేటు స్కూళ్ళల్లో, ఇంగ్లీష్ మాధ్యంమంలో చదివించాలనే ఆశలు ప్రబలంగా కనిపిస్తున్నాయి. అట్లా చదివించడానికి తల్లీ దండ్రులు ఎంత దూరమయిన వెల్ల దానికి, తప్పులు చేయడానికయినా సిద్ధపడడం చూస్తున్నాం. అట్లా అత్యాశ తో తమ కూతురును ధిల్లీ గ్రామర్ స్కూల్లో చదివించాలని ప్రయత్నించిన ఓ జంట కథే ‘హిందీ మీడియం’. చాలా వాస్తవిక ద్రుష్టికోనంలోంచి అత్యంత సహజ మయిన వాతావరణంలో నిర్మించబడ్డ హిందీ మీడియం సినిమాను సాకేత్ చౌదరి తన దర్శకత్వ ప్రతిభతో విలక్షణమయిన సినిమాగా రూపొందించాడు. అతి స్వల్ప నిర్మాణ వ్యయంతో నిర్మించిన ఈ సినిమా ఆర్థికంగా కూడా విజయవంతమయింది. ఇక ఇందులో ప్రధాన పాత్ర పోషించిన ఇర్ఫాన్ ఖాన్ తన అద్భుత నటనతో సినిమాకు గొప్ప బలాన్ని తీసుకొచ్చారు. తన భార్య ఆశల మేరకు కూతురిని పెద్ద స్కూల్లో చదివించడానికి అతను పడ్డ యమ యాతన హాస్యాన్ని పంచుతూనే విద్యావ్యవస్థ, పేరెంట్స్ అత్యాశ, మానవీయ విలువల ఆవిష్కరణగా సినిమా సాగుతుంది. అన్ని అవస్థలు పడి పనికిరాని రోబోలను తయారుచేసే వ్యాపార స్కూల్స్ కంటే సృజనాత్మక విలువల్ని పంచె మాతృభాష లో నడిచే ప్రభుత్వ స్కూళ్ళు మంచిదనే వాస్తవాన్ని ఆవిష్కరిస్తూ సినిమా పాసిటివ్ నోట్ తో ముగుస్తుంది. హిందీ మీడియం సినిమా వర్తమాన పరిస్థితుల్ని గొప్పగా ఆవిష్కరిస్తుంది.

    సినిమా కథాంశానికి వస్తే దిల్లీలో మంచి వ్యాపారవేత్త అయిన రాజ్ బాత్ర తన శ్రీమతి మితా కూతురు పియా తో కలిసి నివసిస్తూ ఉంటాడు. రాజ్ , మతా లు ఇద్దరూ హిందీ మీడియం లోనే చదివి వుండడం వల్ల తన కూతురు పెద్ద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదవాలని తల్లీ మీతా కోరుకుంటుంది. aa మేరకు భార్తపైన తీవ్రమయిన వొత్తిడి తెస్తుంది. ధిల్లీ గ్రామర్ స్కూల్లో చేర్పించాలని అనుకుంటారు. మూడు కిలోమీటర్ల లోపు నివ సించేవారికే సీట్ ఇస్తామని చెప్పడంతో తమ ఇల్లుని స్కూలు దగ్గరికి మార్చుకుంటారు. ప్రవేశాల విషయంలో తల్లీ దండ్రులకు కూడా ఇంటర్వూ ఉంటుందని తెలిసి ఇద్దరూ శిఖ్సన తీసుకుంటారు. కాని రాజ్ బాత్ర ఇంటర్వ్యు లో విఫలం చెందుతాడు. కాని విద్యా హక్కు చట్టం కింద తమ కూతురుకు ప్రవేశం దొరకొచ్చని తెలుసుకొని బీదవారిగా కనిపించడానికి గాను ఒక బస్తీలో కాపురముంటారు. ప్రవేశానికి దరఖాస్తు చేసుకుంటారు. బస్తీలో పాకింటి శ్యాం ప్రకాష్ కుటుంబం అన్ని విదాల సహకరిస్తారు. చివరగా వెరిఫికేషన్ కోసం స్కూల్ నుండి వచ్చిన టీచర్ ముందు వాళ్ళ ఆర్ధిక స్థితి బయటపడే స్థితి వస్తుంది. కాని శ్యాం ప్రకాష్ వారి పక్షాన వాదించి కాపాడుతాడు. పియా అడ్మిషన్ ను ఓకే చెబుతూ 24౦౦౦/ ఇతర ఫీజులకింద చెల్లించమని చెబుతారు. aa రాత్రి తన డెబిట్ కార్డ్ తో ఏ టి ఎం నుంచి డబ్బు డ్రా చేస్తున్న రాజ్ బాత్ర ను చూసి శ్యాం ప్రకాష్ దొంగిలిస్తున్నాదేమో నానుకుని లాక్కోస్తాడు. ఎదురుగా వస్తున్న వాన్ కింద పడి తగిలిన దెబ్బలకు పరిహారంగా డబ్బులు వసూలు చేసి రాజ్ కిస్తాడు శ్యాం ప్రకాష్. పియా అడ్మిషన్ పూర్తి అవుతుంది. కాని శ్యాం ప్రకాష్ కొడుక్కి అడ్మిషన్ దొరకదు. ఇక రాజ్ మీతా లు తమవసంత విహార్ ఇంటికి మారిపోతారు. శ్యాం ప్రకాష్ కొడుకు మోహన్ చదువుతున్న స్కూలుకు వెళ్ళిన రాజ్ మీతా లు అక్కడి స్థితి చూసి కదిలిపోతారు. తామెవరో చెప్పకుండా అకూలుకు అన్ని వసతులు కల్పిస్తారు. మోహన్ చదువులో వస్తున్న మార్పుకు సంతోషించిన శ్యాం ప్రకాష్ సహకరిస్తున్న దాతల వివరాలు ప్రిన్సిపాల్ నుంచి తీసుకొని ధన్యవాదాలు చెప్పడానికి వసంత విహా కు వెళ్తాడు. అక్కడ రాజ్ బాత్రను చూసి ఖిన్నుదవుతాడు. గ్రామ్మార్ స్కూల్లో మోసం గురించి చెప్పాలని వెళ్తాడు కాని అక్కడ పియా ను చూసి మనసు మార్చుకుంటాడు. అడ్మిషన్ కోసం తాము చేసిన మోసం గురించి రాజ్ బాత్ర తీవ్ర మనస్తాపానికి గురయి స్కూలుకు వెళ్లి అడ్మిషన్ కాన్సిల్ చేయమంటాడు. కాని ప్రిన్సిపాల్ వినదు. అయినా రాజ్ మితా లు తమ కూతుర్ని తీసుకొని ప్రభుత్వ స్కూలుకు వెళ్లి అడ్మిషన్ తీసుకొంటారు. ప్రభుత్వ స్కూల్లనే మెరుగు పరుచుకొని తమ కూతురికి మంచి అర్థవంతమయిన విద్యనూ అందించాలని తలపోస్తారు. అట్లా తమ ఇంగ్లీష్ మీడియం వ్యామోహం నుండి బయటపడి హిందీ మీడియం లో తమ కూతుర్ని చేర్పిస్తారు. అట్లా ఒక వాస్తవాన్ని అత్యంత వాస్తవికంగా హిందీ మీడియం సినిమాలో చూపిస్తాడు దర్శకుడు. ఇర్ఫాన్ ఖాన్, సబా ఖమర్ ల నటన గొప్పగా వుండ్తుంది. సినిమాలో ఆద్యంతం హాస్యం వెళ్లి విరిసి ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుంది. కేవలం 23 కోట్లతో నిర్మించబడ్డ హిందీ మీడియం సినిమా 336 కోట్లకు పైగా వసూలు చేసింది.

ఇవాల్టి తల్లిదండ్రులంతా చూడాల్సిన సినిమా

vahini

‘MORNING WALK’ poem

Posted on Updated on

‘ఉదయపు నడక’

—————–వారాల ఆనంద్

ఉదయాన్నే

‘నిద్ర ‘,‘బద్ధకం’

కవలల్ని వదిలించుకుని

లేచి కూర్చున్నా 

 

నాలుగు నీటి చుక్కలు

ముఖాన చిలకరించుకొని

నడకకు బయలుదేరా

 

అప్పటిదాకా మంచు తో

సహజీవనం చేస్తున్న చీకటి

మెల్లి మెల్లిగా పలుచబడుతున్నది

 

లోకం మేల్కొందో లేదో చూడ్డానికన్నట్టు

లేత కిరణాలు తూర్పు శిఖరం నుంచి తొంగి చూస్తున్నాయి

 చెట్ల మీది పిట్టలేమో కళ్ళు నులుముకుంటూ

గుంపులు గుంపులుగా

ఆకాశపు దారి పట్టాయి

 

నా అడుగులు పడుతూనే వున్నాయి

 

మనసేమో తియ్యటి గాలిలో తెలుతున్నట్టు

చల్లటి నీటిలో ఈదుతున్నట్టు

 

అవును మరి ప్రతిరోజూ

ఉదయపు మెలకువ

ఓ  ‘కొత్తజన్మ’

 

నడకేమో చైతన్యాన్నిచ్చే

‘సహచరి ‘

DOCUMENTARY trailer SRIBHASHYAM VIJAYA SARADHI

Posted on

sri 8

ZANG YIMOU- FILM MAKER

Posted on Updated on

దృశ్యావిష్కరణల ప్రతీక ఝాం గ్ యిమో
( ఈ రోజు సోపతి ఆదివారం సంచికలో..)

ఝాం గ్ యిమో చైనా నుంచి ఎగిసి వచ్చిన ఓ గొప్ప దర్శకుడు. ఆయన సినిమాల్నిండా మానవ ఉద్వేగాలూ ప్రేమలూ, అభిమానాలూ, హింసా ప్రతికారాలూ వెరసి మానవ జీవితాల్లోని అన్ని స్పందనా ప్రతిస్పందనల్ని మనం గమనించవచ్చు. ఆయన సినిమాల్లో ప్రతి ఫ్రేమూ మౌలిక రంగుల సాంద్రతా అద్భుతమనిపించే లైటింగ్, విశాలంగా కనిపించే దృశ్యాలూ మొత్తం మీద ఝాం గ్ యిమో సినిమాలన్నీ విశాలమయిన కాన్వాస్ పైన గీసిన పెయింటింగ్ ల్లాగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఝాం గ్ యిమో తోలిసినిమాలలో తాజాదనం చూపరుల్ని వీక్షకుల్ని తన్మయిల్ని చేస్తాయి. తను ప్రాధమికంగా ఫోటోగ్రాఫర్ కావడం తో దృశ్యాల మధ్య లయను సాధించడంలో విజయాన్ని సాధించాడు. ప్రపంచవ్యాపితంగా అందరి ప్రశంశల్ని అందుకున్నాడు.

ఝాం గ్ యిమో సినిమాల్లో చైనాకు సబంధించిన గతం, వర్తమానం.భవిష్యత్తు గోచరిస్తాయి.చైనాకు చెందిన అయిదవ తరం దర్శకుల్లో ఝాం గ్ యిమో ప్రధానమయిన వాడు. ఆయన నిర్మాణ శైలిలో విజువల్ డిస్ప్లే ప్రధాన మయిన అంశం. అందులోనూ మహిళల్ని ప్రధాన భూమికలుగా చేయడం కూడా ఆయన ప్రతిభ.

1980 ల తర్వాత అంతర్జాతీయ సినిమాను చైనా తన దేశంలోకి అనుమతించడం తో బీజింగ్ ఫిలిం ఇన్స్టిట్యుట్ నుంచి అయిదవ తరం చలన చిత్రకారులు ఉద్భైన్చారు. ఫ్రెంచి సినిమాల ప్రభావంతో చైనాలో న్యూ వేవ్ ఆరంభమయింది. అట్లా ఆధునికతను సంతరించుకున్న దర్హ్స్కుల్లో ఝాం గ్ యిమో జాంగ్ జూన్ జాడో, చెం కైగీ, లాంటి వాళ్ళు ప్రధానమయిన వారు. 1950 లో శాంగ్చీ ప్రాంతంలో జన్మించిన ఝాం గ్ యిమో కుటుంబం నేషనలిస్ట్ ఆర్మీ తో సంబంధాల కారణంగా అష్టకష్టాలు పడింది. 196 6 లో చైనా సాంస్కృతిక విప్లవ కాలంలో సెకండరీ స్కూలు విద్యనూ వదిలేసి ఓ చేనేత మిల్లులో కార్మికుడిగా పనిచేసారు. aa తర్వాత ఫోటోగ్రాఫర్ గా ఎదిగారు. 197 4 లో సొంత కెమెరా కొనుక్కొని ఝాం గ్ యిమో తీసిన ఫోటోలు వివిధ పత్రికల్లో అచ్చాయి. 197 9 లో ఆయన బీజింగ్ ఫిలిం అకాడెమి లో చేరాడు. 198 2 లో కోర్సు పూర్తి చేసాడు. మొదట పూతియాన్ మింగ్ అన్న దర్శకుదివద్ద సహాయకుడిగా చేరాడు. ‘ ఓల్డ్ వెల్’సినిమాకు ఫోటోగ్రాఫర్ గా పని చేసాడు. తర్వాత చెం కైగీ లాంటి దర్శకుల వద్ద పని చేసాడు. ఎల్లో ఎర్త్, డి వాన్ ఎర్త్ లాంటి సినిమాలకు కెమెరా వర్క్ చేసాడు.

198 7 లో ఝాం గ్ యిమో తీసిన ‘ రెడ్ సోర్ఘం’ , జూడో, రేస్ ది రెడ్ లాంతర్’, ఆయన ట్రిలోజీ గా పేరు తెచ్చుకున్నాయి.

రెడ్ సోర్ఘం లో ద్రుష్యమానమయిన ఆయన కథనం ప్రపంచ వ్యాప్త ప్రశంసల్ని అందుకుంది 1988 లో బెర్లిన్ అంతర్జాతీయ చిత్రోత్సవం లో గోల్డెన్ బేర్ వార్డును అందుకుంది. 193 0 ల నాటి ఉత్తర చైనా ప్రాంత ప్రజలకు చెందిన కథ ఇది. ఆనాటి ప్రజలు నెల కోసం, తన సోదరుల త్యాగాల కోసం తమను తాము అర్పించుకోవడం మనసుల్ని కదిలిస్తుంది.సినిమా ప్రారంభం నుంచి అద్భుత గేయం లాగా సాగిపోతుంది. సినిమా చివరికి వచ్చేసరికి ఒక ఉద్విగ్నతకు లోనవుతాం. రెండు హృదయాల మధ్య రెండు జీవితాల మధ్య ప్రేమ, తమ కోసం తమ వారికోసం సామాజిక ప్రేమ గా పరిణితి చెందడం రెడ్ సోర్ఘం లో చూస్తాం. ఇందులో విశ్యపరమయిన ఉద్వేగంతో పాటు సాంకేతిక పరమయిన పరిణితి స్పష్టంగా కనిపిస్తుంది. సినిమా చివరిదాకా వుండే కథనాత్మక బిగువు మన కళ్ళని మనసుని కట్టిపడేస్తుంది.

రెడ్ సోర్ఘం కొత్న్హ వరకు దర్శకుడు ఝాం గ్ యిమో ఆత్మ కథే . అందుక్జే ఆయన ఈ సినిమాని తన నానమ్మ కథ అంటూ మొదలుపెడతాడు, మనమడు కనిపించదు కేవలం కథ చెబుతూ ఉంటాడు. మొదట నానమ్మ పెళ్ళవగానే పల్లకి లో అత్తవారింటికి బయలుదేరుతుంది. ఆనాటి ఆచారం ప్రకారం ఆమె తండ్రి డబ్బు తీసుకుని ఆమెను 50 ఏళ్ల లోఫర్కిచ్చి పెళ్లి చేస్తాడు. ఆమె భర్త సారాయి చేసేవాడు.సెడాన్ (పల్లకి) లో అత్తవారింటికి వెళ్ళే దారిలో బందిపోట్లు అటకాయించి దోచుకునే ప్రయత్నం చేస్తారు.పల్లకి బోయీలు ఎదిరించి పోరాడుతారు. బందిపోట్లు పారిపోతారు. భర్త సేవకుల్లో ఒకడు పెళ్ళికూతుర్ని స్పర్శిష్టాడు. అక్కడ వారిద్దరిలో ప్రేమ అంకురిస్తుంది. పల్లకీ బయలుదేరి అత్తావారింట్లో మూడు రోజులున్న తర్వాత తిరిగి ఆమె తండ్రి వద్దకు వస్తుంది.మళ్ళీ అత్తవారింటికి వెళ్ళడానికి ఆమె నిరాకరించడంతో ఆమెను తిట్టి పంపిస్తారు. కోపంతో బయలుదేరినియా ఆమెను దారిలో భర్త సేవకుడు ఎత్తుకెళ్ళి ఆకుపచ్చ రెడ్ సోర్ఘం లో అనుభవిస్తాడు. ఊరు చేరేటప్పటికి భార్తను ఎవరో చంపేసి వుంటారు. ఆమె సేవకులన్దరినీ కూడగట్టి సారా తయారు చేయడం ఆరంబిస్తుంది. సేవకుడు ఆమెను భార్యగా ప్రకటించి అందరినీ ఒప్పిస్తాడు. దాంతో అతడు బాస్ అయిపోతాడు. కొత్త కాలానికి వారికి కొడుకు పుడతాడు. ఇంతలో చైనా పై జపనీయుల దాడి ప్రారంభమవుతుంది. వీరి ఊరిపైనా దాడి చేసి అందరినీ పట్టుకుని బానిసలుగా చేసి తమ పనులు చేయించుకుంటారు. వారి ఆక్రుత్యాల్లో చర్మం ఊదబెరకడం కూడా చేస్తారు. ఆమె ఒక రాత్రి తన వాళ్ళందరినీ లేపి మగవాళ్లయితే జాపాన్ ట్రాక్ ను పేల్చి వేయమంటుంది అంతా మర్నాడు ట్రాక్ ను పేల్చేసి అందరూ మరణిస్తారు. కాల్పుల్లో ఆమె కూడా మరణిస్తుంది. భర్తా కొడుకూ మిగిలిపోతారు. ‘ అమ్మా వెళ్ళిపో స్వర్గానికి, ముడుకాలం మనదే’ అంటూ కొడుకు పాడుతూ వుండగా ఎరా సూరీడు ప్రతీకాత్మకంగా సినిమా ముగుస్తుంది. చైనా గ్రామీణ ప్రాంత సౌందర్యాన్ని ఆవిష్కరిస్తూ రే సోర్ఘం హీరోయిన్ పాత్రధారి గాంగ్ లీ విశేష ప్రశంశలు అందుకుంది.

ఝాం గ్ యిమో తిలోజీ లో రెండవ సినిమా ‘ జుదో’. ఇది కూడా చారిత్మాక మయిన అంశం పైనే రూపొందింది. ఆస్కార్ కి నామినేట్ అయిన తొలి చైనా సినిమా గా పేరు గడించింది.

మొదవ సినిమా ఝాం గ్ యిమో మాగ్నం ఓపస్ ‘రైస్ డ రెడ్ లాంటర్న్’ . 192 0 ప్రాంతాల్లో ధనవంతుడయిన వ్యక్తి భావన సముదాయంలో జరిగే వాస్తవాలు, సంఘర్షణలు ఈ చిత్రం లో ఆవిష్కరించాడు ఝాం గ్ యిమో. చైనా సివిల్ వార్ కి ముందు డయిన కథలో 19 ఏళ్ల సాన్గ్లియాన్ కుటుంబ పరిస్థితుల వాళ్ళ తన యునివర్సిటీ చదువుని వదిలేసి ధనవంతుడయిన చెన్ కి నాలుగవ భార్యగా వస్తంది. నిజానికి ఉమ్పుడుగత్తే. తొలిరోజుల్లో రాజ భోగాలు చూపించిన సేవకులు ఆమెను ఫోర్త్ మిస్త్రేస్స్ గా పిలుస్తారు. ఎర్ర లాంతర్లు, పాదాల మర్దనం భర్తతో అధిక సమయం గడపడం లాంటి విషయాలు ఆమె కాలం గొప్పగా గడుస్తుంది. సాయంత్రం ఎవరి గడప ముందు ఎర్ర లాంతరు వేలుగుతుందో aa రాత్రి వాజ్మాన్ శ్సున్ ఆమె తో గడుపుతాడు. ఆది అక్కడి ఆచారం. అట్లా సాగే కథలో అనేక మలుపులు తిరిగి భార్యల మధ్య పోరు వైరం హత్యలు జరుగుతాయి. చెన్ తనకు అయిదవ భార్యను తెచ్చుకుంటాడు. సాన్గ్లియాన్ తీవ్రంగా దుఖపడి పిచ్చిదానిలా మారిపోతుంది. సాన్గ్లియాన్ పాత్రని గాన లి పోషించింది. ఇందులో నిర్మాణ శైలి ఝాం గ్ యిమో సిగ్నేచర్ ళా సాగుతుంది. ఇట్లా తన మూడు సినిమాల్లో స్త్రీ పాత్రలనే ప్రధానం చేసి వాళ్ళని అండగా అద్ద్భుతంగా చూపించడం తో పాటు ఉదాత్తంగా కూడా ఆవిష్కరిశ్తాడు ఝాం గ్ యిమో. దర్శకుడి తర్వాతి సినిమా ‘ టు లివ్’ 20 వ శతాబ్దం ప్రారంభ కాలం నుంచి మూడుతరాల చైనీయులు ఎదుర్కొన్న అనుభవాల్ని ఇది మన ముందుంచుతుంది. సినిమా ఎపిక్ లాగా సాగుతుంది.

తర్వాత ఝాం గ్ యిమో ‘ షాంగై ట్రేడ్’ సినిమా తీసాడు. 1930 ల కాలం నాదు ఏడురోజుల కాలగమనం దీని ఇతివృత్తం. 14 ఏళ్ల గ్రామీణ యువకుడి కోణంలోంచి అండర్ వరల్డ్ ని చూపిస్తుందీ సినిమా. తర్వాత కీప్ కూల్ ( నియో రియలిస్టిక్ స్టైల్లో నిర్మంచబడింది), నాట్ వాన్ లెస్ ( ఆధునుక చైనా నగరం పైన తీసింది), ద రోడ్ హోం, హాప్పీ టైం, రైడింగ్ అలాన్ ఫర్, కార్స్ ఆఫ్ ద గోల్డెన్ ఫ్లవర్, మూవీ నైట్, తౌసండ్స్ ఆఫ్ మయిల్స్ , హీరో, హౌస్ ఆఫ్ ఫ్లైయింగ్ దాగార్స్ లాంటి సినిమాలు తేస్సాడు ఝాం గ్ యిమో. 200 6 లో ఝాం గ్ యిమో కార్స్ ఆఫ్ ది గోల్డెన్ ఫ్లవర్’ . ఆయన రోడ్ హోం అచంచల మయిన ప్రేమతో వున్న ఒక యువతీ గాధ. యిమో గత సినిమాలకన్నా భిన్నమయిన సినిమా గా పేరు తెచ్చుకోండి.

2008 లో జరిగిన బీజింగ్ ఒలంపిక్స్ కి ఝాం గ్ యిమో పనిచేయడం పెద్ద వివాదాస్పద మయింది. తర్వాత ఫ్లవరాఫ్ వార్(20 11), కమింగ్ హోం (20 14), ద గ్రేట్ వాల్ (20 16), షాడో(20 18) లు తీసాడు ఝాం గ్ యిమో. గ్రేట్ వాల్ మరో పెద్ద వివాదాన్ని లేపింది వివాదాల మాట ఎట్లున్నప్పటికీ ఝాం గ్ యిమో చిత్ర నిర్మాణ శైలిలో అద్భుతమయిన ఒరవడిని సృష్టించిన వాడు. కళాత్మకతను ఆవిష్కరించిన ఆయన చైనా పిత్రు స్వామ్యాన్ని, విమోచన,ఆధునుకతలను కథాంశాలను తీసుకొని విలక్షణమయిన సినిమాల్ని ప్రపంచానికి అందించాడు. ఆయన వెండి తెరపైన చిత్రించిన మూవింగ్ ఇమేజెస్ వీక్షకుల హృదయాల్లో చిరకాలం నిలిచి పోతాయి. చలన చిత్ర కారుదిగానే కాకుండా సినిమాటోగ్రాఫర్ గానూ, నటుడిగాను ఝాం గ్ యిమో తన ప్రతిభను చాటుకున్నాడు. దర్శకుడిగా జాంగ్ యిమో సాధించిన అవార్డులకు లెక్కే లేదు. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా దృశ్యమాన రూపకర్త గా చెప్పుకునే వారిలో ముడువరాసలో ఉంటాడు జాంగ్ యిమో.

-వారాల ఆనంద్Zang- sopathi 2Zang- sopathi 2a

CHILDREN STORIES by VARALA ANAND

Posted on

మిత్రులారా , ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం 1989-90 లో పిల్లల  కోసం ఓ నాలుగు కథలు రాసాను, అవి అప్పుడు ‘ఆంద్ర ప్రభ’ వారపత్రికలో అచ్చయ్యాయి, మర్చేపోయాను. తర్వాత దేశ విదేశాల పిల్లల సినిమాలపైన కొంత పని చేసాను. అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాల్లో జ్యూరీ గా పని చేసాను. ఇవ్వాళ పొద్దున్నే ఇంట్లో లైబ్రరీ లో దేనికోసమో వెతుకుతూ వుంటే తవ్వకాల్లో ఇవి బయటపడ్డాయి. మీతో షేర్ చేసుకోవాలనిపించింది. వీలయినప్పుడు చదవండి.

ANAGA ANAGA RAAGAM...1ANAGA ANAGA RAAGAM...2EPPATIPANI APPUDE 1EPPATIPANI APPUDE 2KASHTAME ISHTAM 1KASHTAME ISHTAM 2KASHTE PHALI 1KASHTE PHALI 2

 

https://drive.google.com/drive/folders/1l2nGQygP_U-PZiKPmXT3IMH2Mu2xCBsh