మానేరు తీరం

“మానేరు తీరం” ఒక జ్ఞాపకం

Posted on

1981 లో నేను మిత్రులు జింబో,వఝల శివకుమార్, అలిశెట్టి ప్రభాకర్, పి.ఎస్.రవీంద్ర లతో కలిసి ‘లయ’ కవితా సంకలనం వెలువడింది. తర్వాత 1998లో అంటే ఇప్పటికి దాదాపు 23 ఏళ్ళ క్రితం నా మొదటి పుస్తకం ‘మానేరు తీరం’ వెలువడింది. ఆ పుస్తక పరిచయ సభలో శ్రీయుతులు దర్భశయనం శ్రీనివాసాచార్య, నలిమెల భాస్కర్ లు మాట్లాడారు. సమైఖ్య సాహితీ సాహితీ సంస్థ పక్షాన శ్రీ కే.ఎస్.అనంతాచార్య, మదిశెట్టి గోపాల్ లు సభ నిర్వహించారు. పాత ఫైళ్ళు తిరగేస్తున్నప్పుడు అప్పుడు ‘మానేరు తీరం’కు  వచ్చిన స్పందన కనిపినిచింది. ఒక సారి మళ్ళీ మిత్రులందరితో పంచుకుందామని షేర్ చేస్తున్నాను.. చూడండి… వీడియో కూడా జత చేసాను…pl watch.. వారాల ఆనంద్