Month: November 2017

మబ్బు- గుల్జార్ కవిత

Posted on

మబ్బు 2

====

గుల్జార్ కవిత

——

నిన్న ఉదయం వర్షం విసురుగా వచ్చి

నా కిటికీని తాకింది

అప్పటికి నేనింకా నిద్దర్లోనే వున్నా

బయటంతా  చీకటి

 

లేచి వెళ్ళి బయట వర్షాన్ని

పలకరించే సమయం కాదిది

 

కెటికీ పరదాల్ని వేశాను

అయినా చల్ల గాలి విసురుగా నా ముఖాన్ని తాకి

తడి తడి చేసింది

 

నా హాస్య చతురత మూగవోయింది

లేచి కిటికీల్ని దడాల్న మూసేశా

తిరిగి ముసుగేసుకొని పడకేసా

 

మనస్తాపం చెందిన వాన కోపంతో

కిటికీ అద్దాల్ని కొట్టేసి వెళ్లిపోయింది

మళ్ళీ తిరిగి రాలేదు

 

కిటికీ అద్దం పగుళ్లు మాత్రం

అట్లాగే వుండిపోయాయి

అనువాదం: ఆనంద్ వారాల

ok

Tributes

Posted on

KARIMNAGAR Film Society pays tributes to Legendary Film actor and writer late Dr.M.Prabhakar Reddy on 26/11/2017

IMG_0401

B.S.Narayana-Memorial Lecture

Posted on Updated on

Lecture on legendary filmmaker Late B.S.NARAYANA on his anniversary @FILMBHAVAN, Karimnagar Film Society Auditorium on 23 Nov.2017

IMG-20171123-WA0011

IMG-20171123-WA0012

Book Release కలల సాగు

Posted on

ఆత్మీయ మిత్రుడు వఝల శివకుమార్ నాలుగవ జావితా సంపుటి ‘ కలల సాగు ‘ ఆవిష్కరణ 19 న రవీంద్ర భారతి లో zimbo, vajjala, Deshapathi, K.Shiva reddy, Sidda Reddy, Ayaachitam Sridhar, Mamidi Harikrishna….IMG_20171120_052618.jpg

Padmavathi & Panorama

Posted on

“భావ ప్రకటనా స్వేచ్ఛ ఎంతో ఉన్నతమయింది. సినిమా,నాటకం,లేదా పుస్తకం ఒక కాళాత్మక సృజన అని గమనించాలి. చట్టం నిషేదించని అంశాల విషయంలో కళాకారుడికి స్వేచ్ఛగా తనని తాను వ్యక్తీకరించుకోనే హక్కు వుంది”  అని భారత అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జీవితం ఆధారంగా నిర్మించ తలపెట్టిన సినిమా వివాదం విషయంలో సుప్రీం కోర్ట్ ఈ మేరకు తన మధ్యంతర ఉత్తర్వుల్లో అభిప్రాయ పడింది. దాంతో ” ఎన్ ఇన్సిగ్నిఫికెంట్ మన్ (AN INSIGNIFICANT MAN) సినిమా విడుదలకు దారి సుగమమయింది.

కానీ ఇటీవలి కాలం లో భావప్రకటనా స్వేచ్చ కు సంబందించి దేశ వ్యాప్తంగా పెరుగుతున్న అసహనం,పెచ్చరిల్లుతున్న వివాదాలూ ఆందోళన కలిగిస్తున్నాయి. భారతీయ మౌలిక రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే రీతిలో వాదాలూ చర్యలూ కనిపిస్తున్నాయి. అప్రకటిత నిషేదాలూ ఆంక్షలూ సాహిత్య సాంస్కృతిక రంగాలతో పాటు సినిమా రంగాన్ని కూడా అతలాకుతలం చేస్తున్నాయి. ఒక వర్గం పక్షాన మాట్లాడుతున్నామని  తమకు తామే ప్రకటించుకున్న కొన్ని సంస్థలు, మరికొన్ని సార్లు సెన్సార్ బోర్డ్ లాంటి చట్టబద్దమయిన సంస్థలూ ఈ వివాదాలకు మూలం కావడం అత్యంత విషాదం.

ఆ స్థితి కేవలం అర్థవంతమయిన  సీరియస్ సినిమాలకే కాదు ప్రధాన స్రవంతి సిన్మాలకూ తప్పడం లేదు. ఉడ్తా పంజాబ్ లాంటి సినిమాలు ఎంత ఒత్తిడికి గురయి కోర్టుల జోక్యం తో ప్రజల ముందుకు వచ్చిందో చూశాం. ఇప్పుడు ‘బన్సాలీ సినిమా ‘పద్మావతి’ గురించి వెల్లువెత్తుతున్న వివాదం చూస్తున్నాం.

కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా ” పద్మావతి ” సినిమా వివాదం తీవ్రమయిన చర్చల్లో కి వచ్చి పత్రికల్లోనూ, టీవీల్లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ సింహా భాగాన్ని ఆక్రమిస్తున్నది. కొంతమేర శాంతి భద్రతల సమస్యగా కూడా రూపుదిద్దుకుంది. చివరికి ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం పద్మావతి విడుదలవల్ల తమ రాష్ట్రం లో  శాంతి భద్రత ల సమస్య ఉత్పన్నమయే అవకాశం వుందని పద్మావతి సినిమాకు సంభందించి కేంద్ర సెన్సార్ బోర్డ్ ప్రజల మనోభావాల్ని పట్టించుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఇక స్వయం ప్రకటిత సంస్థలు భారత్ బందుకు పిలుపు ఇవ్వడం, మరొకరు కథానాయకి దీపికా పద్కోనే, దర్శకుడు బన్సాలీ పై భౌతిక దాడులు చేస్తామని ప్రకటించే వరకూ వెళ్ళాయి. ఇదంతా ఇట్లావుంటే నిజానికి ఒక సినిమా విషయంలో ఇంత చర్చ ఆందోళన అవసరమా,సినిమా విడుదల కాకముందే దాని గురించి తీర్పులు ఇచ్చేసి నిర్ధారణలకు వచ్చేయడం సరయిందేనా?

సినిమా  అత్యంత ప్రభావంతమయిన మాధ్యమమే అయినప్పటికి కథకు సంభందించి పాత్రల చిత్రీకరణ కు సంభందించి ముందస్తుగానే సూత్రీకరణలు చేయడం ఆందోళనకు దిగడం అర్థవంతమయింది  కాదు .ఉడ్ తా పంజాబ్ లాంటి సినిమాల విషయంలో కోర్టులు జోక్యం చేసుకుని ఆ సినిమా విడుదలను  సుగమం చేయాల్సి వచ్చింది. అట్లాగే ఇప్పటివరకు పద్మావతి సినిమాకు సంబంధించి బయటకు ప్రకటించిన లేదా తెలిసిన వివరాల మేరకు అది చిత్తోర్ రాజ్యానికి చెందిన మహారాణి పద్మిని (పద్మావతి), మహారాజు రతన్ సేన్, డిల్లీ మహారాజు సుల్తాన్ అల్లా ఉద్దీన్ ఖిల్జీ లకు సంబంధించిన కథ ఆధారంగా తీసినట్టు తెలుస్తున్నది. చారిత్రక మయిన అంశాల ఆధారంగా హుందాగా తీశామని ఎక్కడా పద్మావతి పాత్ర పట్ల గానీ ఇత్తర అంశాల్లో గానీ ఎలాంటి వివాదాస్పద దృశ్యాల్ని పొందుపరచలేదని ఆ సినిమా దర్శకుడు బన్సాలి ప్రకటించారు. కానీ రాజ్ పుత్ వశానికి చెందిన పద్మావతి పాత్రని చెడుగా  చూపించారని దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, సినిమా విడుదల కావడానికి వీలు లేదని ఆందోళకారులు వాదిస్తున్నారు.

ఇదిట్లావుంటే నిజానికి పద్మావతి కథ మొట్టమొదటిసారి 1540లో  సూఫీ కవి మహమ్మద్ జయసీ ‘పద్మావత్’ లో కనిపిస్తుంది. అత్యంత అందగత్తె అయిన పద్మావత్ మరియు రతన్ సేన్ ల పెళ్లి, సుల్తాన్ ఖిల్జీ చిత్తూర్ పై దాడి చేసి దాన్ని ఆక్రమించడం లాంటి విషయాలన్నీ అది జరిగిన 200 ఏళ్ళకు రచించబడ్డాయి. కానీ పద్మావత్ కథ కథనాలూ గడచిన వందల ఏళ్లల్లో పలు రకాలుగా వెలువడ్డాయి అవన్నీ యధార్థ చారిత్రక ఆధారాల ఆధారంగా రాయబడ్డయా లేక కొంత కల్పన జోడించి లిఖించబడ్డాయా అన్న విషయంలో వాస్తవాలు వెలికి రావలిసేవుంది. ఇంకా ఇటీవల వివిధ చరిత్ర ఆచార్య్లులు రాస్తున్న వివరాల ప్రకారం పద్మావత్ పాత్ర పలు రకాలుగా సృష్టించ బడిందని ఆమె ఒక వర్గానికి చెందింది కాదనే వాదన కూడా బలంగా వుంది.

సమగ్ర వివరాలూ, పూర్తి స్పష్టత లేకుండానే ఒక కళాత్మక సృజన పట్ల ఇంత వ్యతిరేకత పెచ్చరిల్లడం సమంజసం కాదు . శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయంటూ చట్ట పరంగా ఏర్పాటయిన సెన్సార్ బోర్డ్ లాంటి సంస్థల్ని ప్రభావితం చేసే విధంగా ప్రవర్తించడం దారుణం.

ప్రపంచ వ్యాప్త సినిమా చరిత్ర చూస్తే సీసర్ అండ్ క్లియోపాత్ర లాంటి సినిమాల్ని సినిమాలుగానే,కాళాత్మక ప్రక్రియగానే చూశారు తప్ప అస్పష్ట చారిత్రక వాదాలతో వివాదాలకు తావివ్వ లేదు

కానీ పద్మావతి విషయంలో చెలరేగుతున్న వివాదం ఇటీవల పెచ్చరిల్లుతున్న అసహనానికి మరో ఉదాహరణగా నిలిచే అవకాశం వుంది. ఆ సినిమా విడుదల తేదీ డిసెంబర్ 1 వరకు ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వివాదం  

ఇదిలా వుంటే ఈ నెల 20 నుండి గోవాలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే 48 వ భారత అంతర్జాతీయ చాలా చిత్రోత్సవం కూడా పెద్ద వివాదానికే వేదికయింది. ఈ సంవత్సరం భాతీయ పనోరమా విభాగానికి సుజయ్ ఘోష్ ఛైర్మన్ గానూ మరో 13 మంది సభ్యులు గానూ నియమించ బడింది. ఆ కమిటీ వివిధ భారతీయ భాషల్నుంది పనోరమా విభాగానికి దేశ్ ఆ వ్యాప్తంగా వివిదాహ్ భాషా సినిమాల్నుంచీ వచ్చిన  26 సినిమాల్ని ఎంపిక చేసింది.  వినోద్ కాప్రి దర్శకత్వం వహించిన హింది సినిమా ‘ పిహూ ‘ తో పనోరమా చిత్రోత్సవాన్ని ప్రారంభించాలని సూచించింది.

కానీ కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార శాఖ పనోరామా ఎంపిక కమిటీ ఎంపిక చేసిన వాటిల్లోంచి రవి జాదవ్ తీసిన ‘నూడ్'(మరాఠీ), సనల్ కుమార్ శశిధరన్ తీసిన ‘ఎస్ దుర్గా’ ( మలయాళం) సినిమాల్ని లిస్టు లోంచి తీసి వేసి 24 సినిమాల లిస్టునే ప్రకటించింది. ఎలాంటి ప్రత్యేక కారణాల్నీ ఆ శాఖ ప్రకటించలేదు. పనోరమా ఎంపిక కమిటీ ని సంప్రదించ కుండానే 2 సినిమాల్ని నిల్పి వేసింది. దానికి నిరసన గా కహానీ, ఆలాదిన్ లాంటి సినిమాలతో మంచి దర్శకుడిగా పేరొందిన సుజయ్ ఘోష్ తన జ్యూరీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఆయనకు మద్దతుగా మరిద్దరు సభ్యులు అపూర్వ అస్రాని , జ్ఞాన్ కొరియన్ లు కూడా రాజీనామా చేశారు.

దర్శకుడు కుమార్ శశిధరన్ కోర్టును ఆశ్రయించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు మాత్రం కేవలం సాంకేతిక కారణాల్ని చూపిస్తున్నారు.

2016 నుంచి పనోరమాలో వివిధ దేశాల్లో వున్న మాదిరిగానే సెన్సార్ కానీ చిత్రాల్ని కూడా పరిగణనలోకి తీసుకోవడం ఆరంభించారు. కానీ అవి ప్రసార శాఖ నుంచి అభ్యంతరం లేదని ( నో ఆబ్జెక్షన్) సర్టిఫికేట్ తీసుకోవాల్సి వుంటుంది. రవి జాదవ్’నూడ్’ సినిమా ను పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేయకుండానే పోటీకి పంపారని  చివరికి నటీ నటులు సాంకేతిక నిపుణల పేర్లు కూడా సమగ్రంగా ఇవ్వలేదని, మంత్రిత్వ శాఖ అభ్యంతరం చెబుతున్నది. దానికి దర్శకుడు మాత్రం చివరి తేదీ దగ్గ ర పడుతున్న వేళ  కాపీ సమర్పిచడం జరిగిందని పోస్ట్ ప్రొడక్షన్లో సాంకేతిక అంశాలు చివరి క్షణం జరుగుతాయని ప్రదర్శన సమయానికి అన్నీ పూర్తిచేస్తామని అంటున్నారు. సాంకేతిక కారణాలు కేవలం తొంపు మాత్రమే నని వాదిస్తున్నారు. ఇక సనల్ కుమార్ శశిధరన్ తీసిన ‘ఎస్ దుర్గా’ విషయం లో అక్టోబర్ 2017 లో జరిగిన జియో మామి ఉత్సవం లో సెన్సార్ అయిన సినిమాని ప్రదర్శించి పనోరమ కు మాత్రం సెన్సార్ కానీ ప్రింట్ సమర్పించారని ప్రభుత్వం చెబుతున్నది.

ఇవన్నీ సాంకేతిక కారణలేనని, లిస్టులోంచి తొలగించే ముందు కమిటీని కానీ ఛైర్మన్ ను కానీ ఎందుకు సంప్రదించలేదని సుజయ్ ఘోష్ అంటున్నారు. కేవలం ఏవో కారణాల్ని చూపి అర్థవంతమయిన గొప్ప సినిమాల్ని తొలగించడం సమాజసం కాదని పనోరమ నుంచి వైదొలిగిన సభ్యులు అంటున్నారు. . వివాదం కోర్టుకెళ్లింది ఫలితం వేచి చూడాల్సి వుంది..

ఏది ఎట్లున్నా సృజన కారుల భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే ఏ చర్య అయినా అది అధీకృత వ్యవస్థలు చేసినా, స్వయం ప్రకటిత సంశలు వ్యక్తులు చేసినా ఆమోద యోగ్యం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థకు అభిలషణీయం కాదు.

-వారాల ఆనంద్

 

 

 

Dr Laxman rao’sBook release

Posted on

IMG_20171117_053457.jpgమిత్రులు డాక్టర్ గండ్ర లక్ష్మణ్ రావు అనువదించిన ‘వెర్రిమానవుడు’ ( ఖలీల్ జిబ్రాన్- మాడ్ మాన్ ) ఆవిష్కరణ హైదరాబాద్ రవీంద్రభారతిలో..