24 Frames
అదూర్ ‘స్వయంవరం’ @50
FRIENDS, 24 FRAMES MY WEEKLY COLUMN IN ‘DISHA DAILY
24 ఫ్రేమ్స్
అదూర్ ‘స్వయంవరం’ @50
+++++ వారాల ఆనంద్
సాధారణ అట్టడుగు ప్రాంతీయ జీవితాల్లోంచి ప్రపంచ మానవ జీవితాల్ని ఆవిష్కరించిన అదూర్ దర్శకుడు గోపాలకృష్ణన్. ఆయన రూపొందించిన మొట్టమొదటి సినిమా ‘స్వయంవరం’. ఆ సినిమాకిప్పుడు యాభై ఏళ్ళు. అంటే గోల్డెన్ జూబ్లీ, స్వర్ణోత్సవం. అర్థవంతమయిన సినిమా అభిమానులు రియలిస్టిక్ సినిమాల్ని ఇష్టపడేవారికి ఇది ఒక పండగే. స్వయంవరం మలయాళీ సినిమాకు కొత్త భాషను కొత్త ఒరవడిని చూపించిన సినిమా. ఆ సినిమా ఎలాంటి రాజీ లేకుండా కేవలం సినిమాను సినిమాగా ఆవిష్కరించిన సినిమాగా నిలబడింది. అప్పటిదాకా మలయాళీ సినిమాల్లో వున్న మెలోడ్రామా, పాటలు, డాన్సులు, కామెడీ ట్రాకులూ లేకుండా దృశ్య ప్రధాన మయిన ఒరవడిలో కొత్త దారులు వేసింది. రే లాంటి వాళ్ళు ఆరంభించిన సమాంతర సినిమాలకు కొనసాగింపు ఈ స్వయంవరం. ఇద్దరు ప్రేమికులు వారి పెద్దలు అంగీకరించకున్నా తమ అభీష్టం మేరకు పెళ్ళాడి తమ కాళ్ళ పై తాము నిలబడాలని నగరానికి వస్తారు. కాని ఈ సమాజంలో మన గలగడం అంత సులభం కాదని అందునా రచయిత గా నిలబడడం చాలా కష్టమని క్రమంగా తెలుసుకుంటారు. ఆ గమనం లో ఆ జంట ఎదుర్కొన్న అనుభవాలూ చూసిన జీవితాలూ ఈ సినిమా కాన్వాస్. అందులో అదూర్ తన దృష్టి కోణాన్ని గొప్పగా ఆవిష్కరించాడు. టార్చ్ బేరర్ గా నిల బడ్డాడు. స్వయంవరం సినిమా స్వర్ణోత్సవం సదర్భంగా ఫిలిం క్రిటిక్ మధు ఎరవంకర THE JOURNEY, Swayamvaram at Fifty అన్న డాక్యుమెంటరీ తీసాడు. అట్లా ‘స్వయంవర’ స్వర్ణోత్సవం కేరళ లోనే కాదు మొత్తం భారతీయ సినిమా రంగంలో నిర్వహించుకోవాల్సిన పండుగ.
భారతీయ నవ్య సినిమా ప్రపంచంలో సత్యజిత్ రే తర్వాత అంత గా ప్రపంచ వ్యాప్త గౌరవాన్ని అనుడ్కున్న దర్శకుడు అదూర్ గోపాలకృష్ణన్. సినిమా ఒక పరికరం కాదు అది ఒక ఆలోచన, అభిప్రాయం, ఒక ఆవిష్కరణ అని విశ్వసించి సినిమా ద్వారా జనానికి సామాజిక వాస్తవిక అవగాహన ఆకలుగుతుందని అదూర్ సినిమాలు వివరిస్తాయి. అదూర్ గోపాలకృష్ణన్ అంతర్ముఖుడైన భావుకుడు. వాస్తవికతకు నిబద్దుదయిన దర్శకుడు. ఎప్పటికప్పుడు తనని తాను తెలుసుకుంటూ ఆవిష్కరించుకుంటూ దృశ్య మాధ్యమంలో ప్రకటిస్తూ వచ్చాడు అదూర్. ఒక రకంగా అదూర్ చిత్ర యాత్ర సమస్తం ఆయన విశ్వసించిన వాస్తవికతను ఆయన తన కోణంలో పూర్తిగా తనదయిన ప్రాంతీయ నేపధ్యంలోంచి చిత్రీకరిస్తూ పోయాడు. అందుకే అదూర్ కేవలం తన మాతృ భాష మలయాలంలోనే తన సినిమాలు తీసాడు తప్ప వేరే భాషలో నిర్మించే అవకాశాలు వచ్చినా అందుకు ముందుకు రాలేదు ఎందుకంటే తాను చేపాదలచుకున్నది తనకు తెలిసిన భాషలో చెప్పడమే సరయినదని విశ్వసించాడు. అదే పాటించాడు.
మీ సినిమా తలా రూపొందుతుందంటే కలగా మొదలయి, అక్షరంగా రూపుదిద్దుకొని పాత్రలుగా మారి సినిమా తయారవుతుందని అదూర్ ఒక చోట చెప్పుకున్నాడు. ప్రాంతీయ కోణంతో పాటు అదూర్ సినిమాల్లో మానసిక వాస్తవికత కూడా ప్రతిఫలిస్తూ వుంటుంది. ఆయన సినిమాల్లో స్త్రీ లది ప్రముఖమయిన పాత్ర. అట్లని aa పాత్రలు స్థ్రేఎ వాడ పాత్రలు మాత్రమే కాదు. మొత్తంగా కుటుంబాన్ని సమాజాన్ని నిభాయించుకునే స్త్రీ పాత్రలు ఆయనవి. అదూర్ గమనించిన కేరళ మాతృ స్వామ్య లక్షణాలు ఆయన సినిమాల్లో ప్రతిధ్వనిస్తూ వుంటాయి. అదూర్ సాధారణంగా తన సినిమాలకు తానే కథ కథనాలు సమకూర్చుకుంటాడు. ఆయన తీసిన ‘ మధిలుకల్ ‘ (వైకం మొహమ్మద్ భషీర్), విదేయన్ ( పాల్ జక్కరియా) ల కథల ఆధారంగా తీసాడు. తను సినిమా నిర్మాణం మొదలు పెట్టింతర్వాత మరే ఆలోచన తనలో చొరబడనీయకుండా మొదటి ప్రింట్ పూ ర్తి అయేంతవరకు దీక్షగా కోన సాగుతాడు.
తన నాలుగు దశాబ్దాల చలన చిత్ర జీవితంలో 12 కథాత్మక సినిమాలు రూపొందించిన అదూర్ అనేక డాకుమెంటరీ సినిమాలు తీసాడు. తన సినిమాల్లో ప్రతి వివరాన్నిపూర్హి గా తన సంతృప్తి మేరకే తీసుకునే అదూర్ తన సినిమాల్లో నటులు సెచ్చ తీసుజోవదాన్ని అంగీకరించరు. సినిమాల్లో నటులు నాటకాల్లోలాగా ప్రేక్షకులకోసం నటించడం లేదని వారు దర్శకుడికోసం దర్శకుడి ఆశించినట్టుగా దర్శకుడి సంతృప్తి మేరకు నటించాలని అంటారు. పాత్రల్ని సృష్టించి కథ మేరకు ఆవిష్కరింప చేసే పని దర్శకుడిదే కనుక నటులు పాత్రల్ని ఇంప్రోవైస్ చేయడాన్ని సమంజసం కాదంటారు. అంతే కాదు అదూర్ నటీనటులకు పాత్రల వివరాలు మాటలు సీన్లు సెట్లోకి వచ్చింతర్వాతే ఇవ్వాలంటాడు. ఆతర్వాతే రిహార్సల్ తర్వాత షూట్ అంటాడాయన. అట్లా సినిమాలకు సంభందించి తనదైన ప్రత్యేక ఒరవడిని సృష్టించాదాయన. అందుకే దర్శకుడి దృక్కోణాన్ని తెరపైకి ఎక్కించి ప్రపంచ వ్యాప్త ఖ్యాతిని సంపాదించాడు.
మలయాళీ చలన చిత్ర రంగంలో అప్పటిదాకా ఉన్న నాటకీయత దాబికాల్ని తోసిరాజని అద్దోర్ గోపాలకృష్ణన్ తన మొట్టమొదటి సినిమా ‘స్వయంవరం’ తో నూతన ఒరవడిని మొదలుపెట్టాడు. జూలై 3 1941 న జన్మించిన అదూర్ గోపాలకృష్ణన్ కుటుంబం కథాకళి నేపధ్యం వున్న కుటుంబం కావడం తో చిన్ననాటినుండే నాటకాలు ప్రదర్శనలతో ఆయన జీవితం ప్రారంభమయంది. కథాకళి లో వున్న సంగీత ఒరవడి, శారీరక సంజ్ఞలు అదూర్ని అమితంగా ప్రభావితం చేసాయి. 8 ఏళ్ల వయసులోనే వేదికలెక్కి ప్రదర్శనలిచ్చారు. డిగ్రీ చదువు పూర్తి చేసుకున్న తర్వాత తమిళ నాడు లోని దిండిగల్ లో ఉద్యోగం చేసాడు.తర్వాత పూనా లోని ఫిలిం ఇన్స్టిట్యుట్ లో స్క్రీన్ప్లే, డైరక్షన్ లలో డిప్లొమా పొందాడు. తర్వాత త్రివేండ్రం వచ్చి కొంత మంది మిత్రులతో కలిసి రాష్ట్రంలో మొట్టమొదటి ఫిలిం సొసైటీ ‘చిత్రలేఖ’ స్థాపించాడు. తర్వాత సినిమా నిర్మాణం కోసం ‘చిత్రలేఖ ఫిలిం కొ ఆపరేటివ్ ‘ ను ఆరంభించాడు. తాము కొంత చిత్రలేఖ సంస్థ కొంత నేషనల్ ఫిలిం ఫైనాన్స్ సంస్థ నుంచి కొత్త అప్పు తీసుకొని 1972 లో ‘స్వయంవరం’ తీసాడు. నూతన జీవితాన్ని ఆరంభించాలనే ఓ జంట ఎదుర్కొనే అడ్డంకులు ఒడిదొడుకులు ప్రధాన అంశంగా వుంటుందీ చిత్రంలో కాని aa నేపధ్యంలో అదూర్ ఆకాలం నాటి సామాజిక ఆర్ధిక అంశాల పైన ఒక స్టేట్మెంట్ లాగా ఈ సినిమా రూపొందించాడు. అత్యంత వాస్తవిక ధోరణిలో చిత్రీకరించబడి ప్రపంచవ్యాప్తంగా మన్ననలు అందుకుంది. నిజానికి విడులయిన మొదటి రోజుల్లో ప్రేక్షకులు రాక ఆర్థికంగా వైఫల్యాన్ని ఎదుర్కొంది. కాని ఎప్పుడయితే జాతీయ స్థాయి అవార్డులు గెలుచుకొందో దాన్ని మళ్ళీ రెలీస్ చేయడంతో జనం దృష్టిని ఆకర్షించి గొప్ప విజయాన్ని సాధించింది. తర్వాత అద్దోర్ తీసిన సినిమా ‘ కోడియాట్టం’. ఇందులో ఒక వ్యక్తి అమాయక ఏదీ పట్టించుకోని వ్యక్తి నుండి ఒక సంపూర్ణ వ్యక్తిత్వం కల మనిషిగా ఎదిగిన క్రమాన్ని ఈ సినిమా ఆవిష్కరిస్తుంది. సినిమా మొత్తం కేరళ ఆలయాల్లో జరిగే పండుగలా జరుగుతుంది. కోడియాట్టం ప్రధాన పాత్ర దారి గోపికి ఈ సినిమా గొప్ప పేరును తెచ్చి పెట్టడంతో పాటు అనేక అవార్డులు సాధించింది. తర్వాత అదూర్ తీసిన ‘ఎలిపత్తాయం’
అద్దోర్ సినీ రంగ జీవితంలో గొప్ప సినిమా గా ఎంచబడింది. ఇది కేరళ లోని ఫ్యూడల్ వ్యవస్థను అత్యంత వాస్తవికంగా ఆవిష్కరించి. బ్రిటిష్ ఫిలిం ఇన్స్టిట్యుట్ అవార్డును గెలుచుకొంది. ఇఅ అదూర్ ‘ ముఖాముఖం’ ఒక కమ్యునిస్టు కార్యకర్త జీవితం పైన నిర్మించబడి గెలుపు ఓటముల సంక్షోభాల్ని ఆవిష్కరించింది. ఇక ‘ అనంతరం’ అదూర్ స్వీయ జీవిత కథాత్మక సినిమా గా చెప్పుకుంటారు. నిర్మాణ సరళి లో మొదట మోనోలోగ్ గా ప్రారంభమయి కోన సాగుతుంది. వాస్తవం, కల ల మధ్య ఊగిసలాడే జేవితాన్ని అనంతరం అద్భుతంగా చిత్రిస్తుంది.
తర్వాత వైకం బషీర్ కథ ఆధారంగా ‘ మథిలుకల్ ‘ తీసాడు. ఇది కూడా చిత్రీకరనలోవిలక్షనతు సంతరించుకుంది. స్వాతంత్ర పోరాట కాలంలో బషీర్ అనుభవించిన జైలు జీవితాన్ని మథిలుకల్ చిత్రించింది. ఆరాట కాలంలో బషీర్ను జైల్లో వేస్తారు. జైలు గోడకి అవతల మహిళా జైలులో వున్న నారాయని తో మాట కలుస్తుంది. గోడకు చెరో పక్క వున్న a ఇద్దరి నడుమా స్నేహం కుదుర్తుంది. ఒకరిని ఒకరు చూసుకునే అవకాశం లేదు కాని కాని మాటలు కలుపుతాయి చిత్రీకరణ గొప్పగా సాగుతుంది. ఇద్దరూ బయట ఆసుపత్రిలో కలుసుకోవాలనుకుంటారు కాని వీలు కాదు. ఇందులో మమ్ముట్టీ అద్భుతంగా నటించాడు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నాడు. తర్వాత అదూర్ విదేయన్, కథాపురుషన్ తీసాడు. ఇవి రెండూ కేరళలో కొంత వివాదాస్పదమయ్యాయి. విదేయన్ రచయిత పాల్ జక్కరియా తన కథకు అదూర్ న్యాయం చేయలేదని హిందూత్వాన్ని జోడించి నవలకు యదార్థ రూపం ఇవలేక పోయాడని అనడంతో వివాదం చెలరేగింది. దానికి జవాబుగా అదూర్ ఇట్లా అన్నాడు ‘ సాహిత్య పఠ నం వ్యక్తిగత అనుభవం అదే సినిమా సామూహిక అనుభవం కాబట్టి సినిమా రూపాన్తరీకరణ నవల లాగే ఉండాలనుకోవడం సమంజసం కాదు’. తర్వాత అదూర్ తీసిన కథాపురుషన్ స్వీయ కథాత్మక సినిమా గా నిలిచింది. ఇది కేవలం సినిమాఎన్ కాకుండా 40 నుంచి 80 దాక కథానాయకుడి చరిత్రగా తెరకెక్కింది కాని అది కేవలం అతని జీవితమే కాకుండా అయా కాలాలకు సంభంచిన సామాజిక చరిత్రను సైతం చిత్రించింది. ముఖ్యంగా ఆయా కాళాల దృక్పథాల ప్రభావాల్ని ప్రతిహావంతంగా చూపించింది.
ఇక అదూర్ తీసిన ముఖాముఖం కూడా కొంత వివాదాన్నే లేవనేత్త్తింది ఇది కేరళలో కమ్యునిస్టుల వైఫల్యాల్ని చూపించిం ది. దాంతో ముఖాముఖం కమ్యునిస్టుల వ్యతిరేక చిత్రం గా ఆరోపించబడింది. ఇందులో ప్రధాన పాత్రదారికి నత్తి పెట్టడంతో సూచన ప్రాయంగా ఒక నాయకుడిని ప్రతిబింబించి వివాదం ఎక్కువయింది.
తర్వాత అదూర్ ‘ నాలు పెలుంగల్ ‘ తీసాడు. ఇది తగజి శివ శంకర పిల్లి రాసిన నాలు కట్ర్హల్ని జోడించి నిర్మించాడు. స్త్రీల పాత్రల్ని ఆవిష్కరిస్తూ తీసిన ఈ సినిమా నాలుగు కథల సమ్మేళనంగా వుంది. తర్వాత అదూర్ పెన్న్యం నిర్మించాడు. ఇట్లా ఆయన నిర్మించిన సినిమాలు అంతర్జాతీయంగా ఎంతో పేరు గడించి సొంత గొంతును పలికించి నిలబెట్టాయి.
ఫీచర్ films తో పాటు అదూర్ అనేక డాక్యుమెంటరీ సినిమాలు తీసాడు. కాలమండలం గోపి లాంటి కథాకళి కలాకారు డి పైన ఆయన తీసిన డాక్యుమెంటరీ లు సాదికరికమయినవిగా పెరుతేచ్చుకున్నాయి.
మానవీయ విలువల్ని ఆవిష్కరిస్తూ కళాత్మక వాస్తవికతకు తోడు మానసిక వాస్తవికతను తెరపై నిజాయితీగా చిత్రిస్తూ ముందుకు సాగుతున్న అదూర్ గోపాలకృష్ణన్ భారతీయ సినిమాకు అందించిన ఆణిముత్యాల్లాంటి సినిమాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి ఆయన ఖ్యాతి కూడా చిరస్థాయిగా నిలుస్తుంది.
-వారాల ఆనంద్ 944440501281
అంపశయ్య పై ‘సినిమా వినోదం’
FRIENDS, my weekly column in ‘DISHA’ daily
++++ వారాల ఆనంద్
“టికెట్ కొనుక్కుని థియేటర్ కు వెళ్లి సినిమా చూడడంలో వున్న ఆనందమే వేరు..దయచేసి థియేటర్ కు వెళ్ళండి మా బొమ్మల్ని చూడండి. ప్రస్తుతం పెద్ద సమస్యగా వుంది ఈరోజుల్లో ఎవరూ సినిమా థియేటర్ కు వెళ్లేందుకు సిద్ధంగా వుండడం లేదు. చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి మా సినిమాని థియేటర్ కు వెళ్లి చూడండి” అంటూ సుప్రసిద్ధ నటుడు అమితాబ్ బచ్చన్ ఇటీవల ప్రజలకు విజ్ఞప్తి చేసారు. తన పాపులర్ క్విజ్ షో ‘కౌన్ బనేగా క్రోర్పతి’ కొత్త ఎపిసోడ్లో తమ కొత్త సినిమా ‘వూంచాయి’ ప్రమోషన్ షో నిర్వహించారు. ఆ సినిమాలో సహనటులు అనుపమ్ ఖేర్, నీనా గుప్తా, బొమ్మన్ ఇరానీలను అతిథులుగా పిలిచి ఆ కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్ ఈ మేరకు చేతులెత్తి ప్రేక్షకులను కోరుకున్నారు. అమితాబ్ లాంటి పాపులర్ సీనియర్ నటుడు ఈ మేరకు విజ్ఞప్తి చేసే పరిస్థితి వచ్చిందంటే ఇవ్వాళ ప్రేక్షకులు సినిమా థియేటర్లకు రావడం దాదాపుగా మానేసినట్టు కనిపిస్తున్నది. వారిని టాకీసుల దాకా రప్పించడం ఎంత గగనంగా మారిందో తేట తెల్లం అవుతున్నది. ఇన్నేళ్ళుగా భారతీయ ప్రజలకు చౌకగా అందుబాటులో వున్న సినిమా వినోదం ‘అంపశయ్య’ పై చేరిందా అనిపిస్తున్నది. ఎదో ఒక సినిమా ఆర్థికంగా విజయవంతమయితే పది సినిమాలు పరాజయం పాలవుతున్న వర్తమాన స్థితిలో హిందీ సినిమా రంగం తో సహా దాదాపు అన్ని భారతీయ భాషా సినిమా రంగాలూ కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. ‘పుష్ప’, ఆర్ ఆర్ ఆర్’, కీజీఎఫ్ లాంటి సినిమాల తాకిడికి గురయి హిందీ సినిమా చచ్చిపోతోంది అన్న వాదన కూడా ముంబై లో విస్తృతంగా వినిపిస్తున్నది. ఆ వాదన కొంత అతిగా ఉన్నప్పటికీ వాస్తవంగా హిందీ సినిమా దాదాపు సంక్షోభంలో ఉందన్నది మాత్రం నిజం. దాదాపు మిగతా భాషా సినిమాలది కూడా అదే పరిస్థితి.
ఈ స్థితికి కారణాలని అన్వేషిస్తే రెండు అంశాలు మన ముందుకు వస్తున్నాయి. ఒకటి ఉప్పెనలా దాడి చేస్తున్న సాంకేతిక ఆవిష్కరణలు కాగా రెండవది ఊక దంపుడు కథలతో రొడ్ద కొట్టుడు కథలతో సినిమా రంగం చేసుకుంటున్న స్వయంకృతాపరాధం.
మొదట సాంకేతిక అంశాల గురించి మాట్లాడుకున్నప్పుడు అసలు సినిమా ఆవిష్కరణే గొప్ప సాంకేతిక పరిణామం. తెరమీద బొమ్మలు కదలడమే ఆనాటి అద్భుతం. మూకీ నుంచి టాకీ, 16 ఎం.ఎం. నుంచి ఇప్పటి డిజిటల్ కాలం దాకా సాంకేతిక రంగం లో వచ్చిన మార్పులే ఇవ్వాల్టి సినిమా రూపానికి మూలాధారం. అప్పటిదాకా వీధి భాగోతాలూ, నాటకాలూ, బుర్రకథలు, హరికథలు మాత్రమె వినోదాంశాలుగా వున్న ప్రజలకు సినిమా కొత్త వినోదంగా ముందుకొచ్చింది. అయితే ఆ వినోదం తొలి రోజుల్లో కొంత సామాజిక ఉపయోగానికి, మంచి విలువలతో కూడిన కథలకు పరిమితమయి ప్రజల్ని అలరించాయి. కానీ సమాజంలో వచ్చిన మార్పులు, సాంకేతిక రంగంలో వచ్చిన సరికొత్త ఆవిష్కరణలు సినిమా రూపాల్ని పూర్తిగా మార్చేశాయి. సినిమా ప్రేక్షకులమీద మొట్టమొదటి సాంకేతిక ప్రభావం టీవీ లతో వచ్చింది. టీవీ వచ్చిన మొదటి రోజుల్లో సాయంత్రాలు, ఆదివారాలు ప్రజలు ఇండ్లల్లోంచి బయటకు రావడమే మానేశారు. రామాయణాలు, భారతాలు, సీరియల్లు, టీవీ లలో ప్రసారమయ్యే సినిమాల ప్రభావంతో 70 -80 లలో సినిమాలు చూడ్డానికి ప్రేక్షకులు కరువయ్యారు. తర్వాత వచ్చిన ‘వీడియో’ మరింత ప్రభావాన్నిచూపించింది. వీడియో పార్లర్స్ కొంత కాలం సినిమాల్ని దెబ్బ తీసాయి. కానీ క్రమంగా టీవీ కార్యక్రమాలు రొటీన్ కావడం వీడియోలు అంతగా ఆకట్టుకొక పోవడం తో పాటు థియేటర్లో చూసిన అనుభూతి పూర్తిగా కలగక పోవడం వలన ప్రేక్షకులు తిరిగి సినిమా హాళ్ళ వైపునకు మరలారు. సినిమాలు కూడా హింస, సెక్స్ లాంటి ఎమోషన్స్ ని ప్రేరేపించే కథలతో ప్రజల ముందుకు వచ్చి ఆకర్షించే ప్రయత్నాలు చేసాయి. అయితే ఇప్పటి పరిస్థితి వేరు. కోవిడ్ నేఅధ్యంలో ప్రజలు ఇండ్లల్లోంచి బయటకు రాక పోవడం సరిగ్గా అప్పుడే ఓ టీ టీ లు రావడం తో పరిస్థితి పూర్తిగా మారి పోయింది. దాంతో పాటు విపరీతంగా పెరిగిన సెల్ ఫోన్ల వినియోగం కూడా ఎంతో ప్రభావాన్ని చూపిస్తున్నది. అరచేతిలోనూ, ఇంట్లోనూ సినిమాల్ని చూసే లుక్ కల్చర్ పెరిగిన తర్వాత ప్రత్యేకంగా సినిమా హాల్లకు వెళ్లి వందలాది రూపాయలు ఖర్చు చేసేందుకు భారతీయ ప్రస్తుతానికి సిద్దంగా లేరు.
ఓటీటీ గురించి జరిపిన ఒక సర్వ్ లో చెప్పిన దానిప్రకారం ఓ టీ టీ లలో డిస్నీ-హాట్ స్టార్ కు 4 కోట్ల మంది చందాదారులు వున్నారు. అట్లే అమెజాన్ ప్రైం కు 2- 2 ½ కోట్ల మంది, జీ5 కు 60 లక్షలు, నెట్ఫ్లిక్స్ కు 60 లక్షలు, సోనీ లైవ్ కు 40 లక్షలు,వూట్ కు 30 లక్షల మంది చందాదారులున్నారు. అట్లా దేశంలో మొత్తంగా పది కోట్లకు పైగా ఓ టీ టీ చందాదారులున్నారు. సగటున ఓ టీ టీ లలో స్ట్రీమింగ్ చూసే సమయం మాత్రం వారానికి 10 నుంచి 13 గంటలు మాత్రమే నని ఆ సర్వే సూచించింది. ఇక ఓ టీ టీ లలో వారానికి సగటున 2-3 సినిమాలు చూసే వారి సంఖ్యే హెచ్చుగా వుంది. గత రెండు సంవత్సరాలుగా చూస్తే ఓ టీ టీ ప్రేక్షకుల సంఖ్యక్రమంగా పెరగడం గమనించవచ్చు. అదే క్రమంలో సినిమా హాల్లల్లోకి వెళ్లి సినిమాలు చూసే వాళ్ళ సంఖ్యా తగ్గుతూ వస్తున్నది అన్నది నిజం. అంటే ఆమేరకు మన దేశంలో సినిమా హాల్లకు వెళ్ళే వినోదం ప్రమాదం లో పడినట్టే.
ఇక రెండో కారణం గురించి ఆలోచిస్తే మన దేశంలో ఉన్న సినిమా థియేటర్స్ లోకి వెళ్లి కొనే వాళ్ళ సంఖ్య ౩-4 కోట్లు వుంటారు. ఆ సంఖ్య సినిమా హాళ్ల లోని 80 శాతం సీట్లకు మాత్రమే సమానం. ఇక రెగ్యులర్ గా సాదారణ ప్రేక్షకుడు సంవత్సరానికి 5-6 సినిమాల్ని మాత్రం చూస్తాడు. ఆ స్థితిలో పెద్ద స్టార్లు, విపరీతమయిన ముందస్తు ప్రచారం వున్న సినిమాలకు మాత్రమె జనం తండోప తండాలుగా వచ్చే అవకాశం వుంది. మిగతావాటికి జనం రావడం గగనమే అయిపోతున్నది. అందుకే గతంలో లాగా టాకీసుల ముందు “HOUSE FULL” బోర్డులు కనుమరుగు అయిపోయాయి. మల్టీ ప్లేక్సులు, విపరీతంగా పెరిగిన టికెట్ రెట్లు కూడా మరో ప్రధాన కారణం. అంటే కథా కథనం భిన్నంగానూ హై ఫై గానూ వుండి ప్రేక్షకుల్ని ఊహా లోకాల్లోకి తీసుకెళ్ళే తరహా సినిమాలకు కొంత ఆదరణ దొరికే అవకాశం వుంది. అవి కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అబ్బురపరిచే దృశ్యాలుతో కూడి వుండాలి.
ఇటీవలి కాలంలో పాన్ ఇండియన్ సినిమాల పేరున వచ్చిన పుష్ప, ఆర్ ఆర్ ఆర్, కీజీఎఫ్ లు అలాంటివే. ఇక మరో రకంవి ‘కాశ్మీర్ ఫైల్స్’. ఎదో ఒక భావోద్వేగాన్ని ప్రేరేపించే సినిమాలు కూడా ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్నాయి. రాజకీయంగా పాలకులు ప్రమోట్ చేయడం ఆ సిన్మా ఆదరణ పొందడానికి మరో ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు.
మొత్తం మీద ఇవ్వాళ ప్రజల్లో స్పూర్తిని పెపొందించే సినిమాల కంటే ఆకాంక్షల్ని అవీ భూటకపు ఆకాంక్షల్ని పెంచే సినిమాలకు అధికంగా ఆదరణ లభిస్తున్నది. అది సమాజానికి అంత అభిలాష నీయమయింది కాదు. కానీ కేవలం లాభాలు మాత్రమె పరిగణన లోకి తీసుకునే వ్యాపార సినిమా రంగం పెట్టుబడి లాభాల ప్రాతి పదికగా పని చేస్తుంది. అందుకే వందలాది కోట్ల పెట్టుగది తో మరిన్ని సినిమాలు రూపొందే అవకాశాలు మెండుగా వున్నాయి. వాటిల్లో ఎన్ని ‘పుష్ప’ సినిమాలు అవుతాయో, మరిన్ని ‘ఆచార్య’ సినిమాలు అవుతాయో చూడాలి.
కానీ మొత్తం మీద మన ప్రేక్షకులకు అతి చౌకయిన వినోదాన్ని క్రమంగా అతి ఖరీదయిన వినోదం గా మార్చే పనిలో సినిమా రంగం తల మునకలయి వుంది.. చూద్దాం ఇంకా ఏమి జరుగానుందో..భవిష్యత్తులో సినిమా వాళ్ళు గెలుస్తారా ప్రేక్షకులు నెగ్గుతారా…
-వారాల ఆనంద్
’24 ఫ్రేమ్స్’ భక్తి గీతాల ప్రవాహం – కవి ప్రదీప్
https://epaper.dishadaily.com/c/69786836
“24 FRAMES” MY WEEKLY COLUMN IN DISHA DAILY
దేశ భక్తి గీతాల ప్రవాహం – కవి ప్రదీప్
+++++++ వారాల ఆనంద్
“ ఆజ్ హిమాలయ్ కే చోటీ సే
ఫిర్ హంనే లల్కారా హై
దూర్ హటో యే దునియా వాలో
యే హిందూస్తాన్ హమారా హై..”
( హిమాలయ శిఖరాల మీదినుంచి సవాల్ విసురుతున్నాం ప్రపంచ వాసులారా దూరం జరగండి ఈ భారత దేశం మాది..) అంటూ దేశభక్తి పాటను 194౩ లో ‘కిస్మత్’ సినిమాకు రాసాడు కవి ప్రదీప్. అట్లా ఆనాటి బ్రిటిష్ పాలకులకు సవాల్ విసిరిన సినీ గేయ రచయిత కవి ప్రదీప్. భారత దేశానికి స్వాతంత్రం రావడానికి నాలుగేళ్ల ముందే ఆ పాట దేశ ప్రజల్ని ఉర్రూతలూగించింది. మొదట ఆ పాట భావం అర్థం కాని బ్రిటిష్ అధికారులు పట్టించుకోలేదు. కానీ దాని అర్థం తెలిసొచ్చి వారంట్ జారీ చేసారు. దాంతో కవి ప్రదీప్ అజ్ఞాతవాసానికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ పాట ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే సినిమా ప్రదర్శించిన ప్రతి టాకీసులో ప్రతి షో లో పాటను మళ్ళీ మళ్ళీ రీలు వెనక్కి తిప్పి ప్రదర్శించాల్సి వచ్చింది. ఇక కేవలం ఆ ఒక్క పాటతో కిస్మత్ ఎంతగా విజయవంతమయిందంటే ఒక్క కలకత్తాలోనే మూడు సంవత్సరాల ఎనిమిది నెలలు ఒకే టాకీసులో ప్రదర్శించ బడింది. కేవలం ఎనిమిది వేలకు పంపినీ హక్కులు తీసుకున్న డిస్ట్రిబ్యుటర్ కు కోటి రూపాయకు పైగా లాభించి కనక వర్షం కురిప్న్చిండా సినిమా. అంతలా ఆనాటి ప్రజల్నిఆ పాట, ఆసినిమా ఆకట్టుకుంది. కవి ప్రదీప్ ఆ పాట ఒక్కటే కాదు ఆ రోజుల్లోనే అనేక దేశ భక్తి గీతాలు రాసి, కొన్ని తానే స్వయంగా పాడి దేశ భక్తి గీతాల ప్రవాహం అయ్యాడు వాటికి శాశ్వత చిరునామా గా మిగిలాడు. భారత స్వాతంత్ర అమృతోత్సవాల సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకోవడమంటే దేశం మీద అణువణువునా ప్రేమనూ భక్తినీ స్మరించుకున్నట్టే.
ఇక 1940లో వచ్చిన బంధన్ సినిమాలో ప్రదీప్ రాసిన “ చల్ చల్ రే నౌ జవాన్, చలో సంఘ్ చలే హం, దూర్ తేరా గావ్ అవుర్ తఖే తేరా పావ్..” దేశ వ్యాప్తంగా ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకుంది. అంతే కాదు ఆ రోజులల్లో ఇందిరా గాంధీ ఏర్పాటు చేసిన ‘వానర సేన’ అన్న చిన్న పిల్లల గ్రూపులో ఈ పాట ఆత్మీయ గీతం అయిపొయింది. ఇంకా ఆ రోజుల్లోనే పంజాబ్, సింద్ రాష్ట్రాల్లో దాదాపు జాతీయ గీతంలా ఆ పాటను ఆలపించారు. అట్లా బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే దేశభక్తిని ప్రభోదిస్తూ కవి ప్రదీప్ సినిమాల్లో అనేక పాటలు రాసి గొప్ప ప్రేరణగా నిలిచాడు. 1962 ఇండో చైనా యుద్ధం ముగిసన తర్వాత అమర సైనికుల బలిదానాలకు కదిలిపోయి కవి ప్రదీప్ రాసిన
“ఎ మేరె వతన్ కే లోగో.. తుం ఖూబ్ లగాలో నారా..ఏ శుభ్ దిన్ హై హం సబ్ కా..లహరా తిరంగా ప్యారా..పర్ మత్ భూలో సీమా పర్…వీరోనే హై ప్రాణ్ గవాయే.. కుచ్ యాద్ ఉన్హే భీ కర్ లో.. కుచ్ యాద్ ఉన్హే భీ కర్ లో.. జో లౌట్ కే ఘర్ నా ఆయే.. జో లౌట్ కే ఘర్ నా ఆయే.. “ పాటతో మొత్తం దేశాన్ని ఏడిపించేసాడు. సామాన్య ప్రజలనే కాకుండా 1963లో ధిల్లీ నేషనల్ స్టేడియంలో ఆ పాటను లతామంగేష్కర్ హృద్యంగా పాడగా ప్రధాని నెహ్రు కదిలిపోయి ఏడిచేసాడు. లతాని దగ్గరకు తీసుకుని నన్ను ఇవ్వాళ ఎదిపించావు తల్లీ అన్నాడు. అప్పుడు పరిచయమయిన కవి ప్రదీప్ ని అదే రోజు తీన్ మూర్తిభవన్ లో ఆ పాట వినిపించేందుకు ఆహ్వానించాడు. కేంద్ర ప్రభుత్వం ప్రదీప్ ని రాష్ట్రీయ కవిగా జాతీయ గౌరవాన్ని ప్రధానం చేసారు. ఇంకా జాగృతి లోనే గాంధీ కి నివాళి గా ప్రదీప్ రాసిన “ దే దే ఆజాది బినా ఖదగ్ బినా ఢాల్.. సాబర్మతి కే సంత్ తూనే కర్ దియా కమాల్.. అందీ మే భి జల్తీరహీ గాంధీ తెరా మషాల్..’ , ఇంకా ‘హం లాయే హై తూఫాన్ సే కష్టి నికల్’ లాంటి పాటలు ఇప్పటికీ బాలల దినోత్సం రోజున దేశమంతా వినిపిస్తూనే వుంటాయి.
అంతలా జాతీయ దేశ భక్తి భావాల్ని సినిమా పాటల్లో వికసింప చేసిన కవి ప్రదీప్ మధ్య ప్రదేశ్ లోని మాల్వా ప్రాంతానికి చెందిన ‘బడ్ నగర్’ లో 2 ఫిబ్రవరీ 1915లో జన్మించాడు. ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు రాంచంద్ర ద్వివేది. అందరూ రామూ అని పిలిచేవారు. రామూ తల్లి భజన పాటలు పాడేది. వాటితో రామూ ప్రేరణ పొందాడు. తండ్రి నుంచి స్వాభిమానం, మొండితనం అలవడింది. స్కూల్లో టీచర్ అయినా అమ్మమ్మ వాళ్ళింట్లో మేనమామ అయినా ఒక మాటంటే పడేవాడు కాదు. అలహాబాద్ లో ఇంటర్ పూర్తి చేసుకుని లక్నో విశ్వవిద్యాలయం లో డిగ్రీ చదివాడు. తర్వాత రామూని టీచర్ ట్రైనింగ్ చేసి అధ్యాపకుడిగా చేరమని అంతా సలహా ఇచ్చారు. కానీ పిల్లలూ చదువులూ రొటీన్ తన కిష్టం లేదని. టీచర్ కాలేదు. లక్నోలో ఉండగానే రామూ కవి ప్రదీప్ గా మారి తన కవితల తో అందరినీ ఆకట్టుకోవడం ఆరంభించాడు. అప్పుడు ప్రదీప్ రాసిన “ పానీపట్” అన్న కవిత కవి సమ్మేళనాల్లో విశేష ప్రాచుర్యం పొందింది. తర్వాత ఒక కవిసమ్మేలనం లో పాల్గొనేందుకు బాంబే వెళ్ళాడు ప్రదీప్. అక్కడ అప్పటి ప్రసిద్ధ సినీ నిర్మాత దర్శకుడు హిమంశురాయ్ ప్రదీప్ కవితల్ని విన్నాడు. ఆ కవితో పనుంది ఆఫీసుకు రమ్మన్నాడు. తన ముఖం బాగానే వుంది సినిమాలో హీరో అవకాశం ఇస్తాడేమోనుకున్నాడు ప్రదీప్. కానీ కవిగా నెలకు రెండు వందల రూపాయల జీతం మీద ఉద్యోగం ఇచ్చాడు హిమాన్షు రాయ్. ఆ కాలం లో రెండు వందలంటే చాలా పెద్ద అమౌంట్. 1939లో వచ్చిన ‘కంగన్’ సినిమాకోసం 4 పాటలు రాసాడు ప్రదీప్. తర్వాత వచ్చిన ‘బంధన్’ లో 12 పాటలు రాయడమే కాకుండా మంచి స్వరమున్న ప్రదీప్ రెండు పాటలు కూడా పాడాడు.
కవి ప్రదీప్ నాస్తిక్, జాగృతి సినిమాలకు రాసిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత మత విద్వేషాలు రగిలి దేశ విభజన వల్ల కలిగిన ప్రాణ నష్టం చూసి నాస్తిక్ సినిమాకోసం రాసి పాడిన ‘దేఖ్ తేరీ సంసార్ కి హాలత్ క్యా హో గయి భగవాన్..” అ పాట ఇప్పటికీ శ్రోతల్ని అలరిస్తుంది. ఇక జాగృతి కోసం ప్రదీప్ రాసిన “ ఆవో బచ్చో తుమ్హే దిఖాయే.. వందే మాతరం వందేమాతరం..కూడా పిల్లల్నీ పెద్దల్ని ఇప్పటికీ ఆకట్టుకుంటుంది.
ఇక వ్యక్తిగత జీవితం లో ఆయన బాంబే లో ఉండగానే తల్లి దండ్రులు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. భద్ర అనే అమ్మాయిని చూపించగా నేను ఇంటర్వ్యు చేయాలన్నాడు ప్రదీప్. ఏమి అడుగుతారో అని భయపడ్డ ఆమెను కేవలం ఓకే ప్రశ్న అడిగాడు. నేను ఒక మండుతున్న జ్వాలను..నువ్వు నీళ్ళ లాగా వుంటానంటే వివాహం చేసుకున్తానన్నాడు ..ఇంకేముంది పెళ్ళయిపోయింది.వాళ్లకు ఇద్దరు అమ్మాయిలు.
దేశభక్తి గీతాలతో పాటు భక్తి గీతాలు, భజన్స్ కూడా రాసాడు. ప్రదీప్ జీవితంలో విజయాలూ సంతోషాలే లేవు దుఖాలూ వున్నాయి. ప్రదీప్ తల్లి దండ్రులు ఇద్దరినీ ఒక రోజు రాత్రి గుర్తు తెలీని దుండగులు దాడి చేసి హత్య చేసారు.ఆ దుఖం నుంచి బయట పడడానికి కవిప్రదీప్ కు చాలాసమయం పట్టింది.
ఇట్లా దేశ భక్తి గీతాల కవి శిఖరం గా నిలిచిన కవి ప్రదీప్ కు జాతీయ సంగీత నాటక అకాడెమి అవార్డు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు లభించాయి.
భారత దేశ స్వాతంత్ర స్వర్ణోత్సవాల సందర్భంగా కవి ప్రదీప్ కు నివాళులు.
+++++++
“24 ఫ్రేమ్స్“ఓ జ్ఞాపకం
“24 ఫ్రేమ్స్“ఓ జ్ఞాపకం
—————————————
డిజిటల్ సాంకేతికత ప్రపంచాన్ని కమ్మేయకముందు ‘దృశ్య మాధ్యమం’ సేల్ల్యులాయిడ్ పై నిక్షిప్తమయ్యేది. అప్పుడు 8 ఎంఎం,16 ఎంఎం ,35 ఎంఎం,70 ఎంఎం,సినిమా స్కోప్ ఇట్లా బిన్న ఫార్మాట్లల్లో సినిమాల నిర్మాణం జరిగేది. ఆ సమయంలో సినిమాకు 24 ఫ్రేమ్స్ అన్న మాట ప్రాతినిధ్య పదంగా వుండేది. అంటే ప్రొజెక్టర్ ఫిల్ము కదలికలో 24 ఫ్రేముల కదలికే తెర పైన బొమ్మల కదలికకు మూలమని. ఆ నేపధ్యం లోనే నేను 2004 లో ‘24 ఫ్రేమ్స్ (సినిమా వ్యాసాలూ-అక్షర చిత్రాలు) పేర సినిమాల పై రాసిన వ్యాస సంకలనం తెచ్చాను.
24 ఫ్రేమ్స్ లో ‘దృశ్య మాధ్యమాలయిన చలనచిత్రాలు’, ‘చరిత్రను సృష్టించిన చలన చిత్రం’, ‘రాజకీయ చిత్రాలు’,’క’ళ కోల్పోతున్న భారతీయ సినిమా’,’తెగులు పట్టిన తెలుగు సినిమా’, ‘పనోరమా చిత్రాలు’, ’అవరోధాల మధ్య అస్తిత్వాన్ని నిలుపుకున్న ఫిలిం సొసైటీ’ లాంటి అనేక వ్యాసాలున్నాయి.
24 అక్టోబర్ ఆదివారం 2004 రోజున ఆ పుస్తకావిష్కరణ కరీంనగర్ ప్రెస్ భవన్ లో జరిగింది. ఆ నాటి కార్యక్రమానికి ప్రముఖ జర్నలిస్టు శ్రీ దేవులపల్లి అమర్, సినీ కవి శ్రీ సుద్దాల అశోక్ తేజ హాజరయ్యారు. స్థానిక మానేర్ టైమ్స్ పత్రిక సంపాదకుడు అధినేత శ్రీ పొన్నం రవిచంద్ర నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి శ్రీ దర్భశయనం శ్రీనివాసాచార్య ‘24 ఫ్రేమ్స్’ని విపులంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా “ మేము సినిమా వాళ్ళం జనం కోసం రాస్తాం, వారాల ఆనంద్ మా కోసం రాస్తాడు” అన్న అశోక్ తేజ మాటలు నాకింకా గుర్తున్నాయి. అదొక గొప్ప ప్రశంసగా స్వీకరించాను. అప్పుడే అశోక్ తేజ కు జాతీయ ఫిలిం అవార్డ్ వచ్చింది. అదే సభలో ఆయనకు ఘనసత్కారం నిర్వహించాడు రవిచంద్ర. ఆనాటి సభలో ఇవ్వాల్టి TELANGANA TODAY సంపాదకుడు శ్రీ కే.శ్రీనివాస్ రెడ్డి కూడా వుండడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. ఫిలిం సొసైటీ మిత్రులు, సాహితీ మిత్రులు అనేక మంది ఈ సభకు హాజరయ్యారు.
++++
24 ఫ్రేమ్స్ పుస్తకానికి మంచి స్పందనే వచ్చింది. వాటిని మిత్రులతో పంచుకుందామని షేర్ చేస్తున్నాను.
-వారాల ఆనంద్